‘ఆసరా’ ఎప్పుడు దొరికేది...?
వైఎస్సార్ ఆసరా మూడో విడత ఎప్పుడు ఇస్తారోనని లబ్ధిదారులు రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది డిసెంబరు నెల 27, తర్వాత జనవరి మొదటి వారం, తర్వాత అదేనెల 30న ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోవడంతో డబ్బులు ఎప్పుడొస్తాయా...? అని అధికారులను అడుగుతున్నారు.
లబ్ధిదారుల జాబితా చూస్తున్న సంఘ సభ్యులు
విజయనగరం మయూరి కూడలి, న్యూస్టుడే: వైఎస్సార్ ఆసరా మూడో విడత ఎప్పుడు ఇస్తారోనని లబ్ధిదారులు రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది డిసెంబరు నెల 27, తర్వాత జనవరి మొదటి వారం, తర్వాత అదేనెల 30న ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోవడంతో డబ్బులు ఎప్పుడొస్తాయా...? అని అధికారులను అడుగుతున్నారు. అధికారులు కూడా స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు.
రెండు విడతల్లో చెల్లింపు: 2019 ఏప్రిల్ 11 నాటికి బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకుని చెల్లిస్తున్న స్వయం సహాయక సంఘాల వారికి ఆసరా పథకాన్ని వర్తింపజేశారు. సభ్యులు చెల్లిస్తున్న అప్పును నాలుగు విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా ఇప్పటికి రెండు విడతల్లో 31,070 సంఘాలకు రూ.427.66 కోట్లు ఉమ్మడి జిల్లాలో చెల్లించింది. మూడో విడత బయోమెట్రిక్ హాజరును సిబ్బంది తీసుకున్నారు. సభ్యులు చనిపోతే వారి స్థానంలో లబ్ధిదారుల కుటుంబంలో నామినీకి అవకాశం కల్పించారు. మూడో విడత ఆసరా మొత్తాన్ని జనవరి 30న ఇస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గంట్యాడలో జరిగిన సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని డీఆర్డీఏ పీడీ కల్యాణ్ చక్రవర్తి ‘న్యూస్టుడే’కు తెలిపారు. వివరాలు రాగానే కార్యాచరణను సిద్ధం చేస్తామని, అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపామన్నారు.
పాత జిల్లాల వారీగా 31,070 సంఘాల్లో.....: ప్రభుత్వం ప్రకటించిన తేదీ నాటికి పాత జిల్లాల ప్రకారం 31,070 సంఘాల్లో 3,58,108 మంది సభ్యులు ఉన్నారు. వారి నుంచి క్షేత్రస్థాయిలో సేకరించిన డాటా ఆధారంగా సామాజిక ఆడిట్ ప్రక్రియను కూడా పూర్తిచేశారు. అనంతరం ఆ జాబితాను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. దీని ఆధారంగా సంఘ పొదుపు ఖాతాలకు మూడో విడత ప్రభుత్వం జమచేయనున్నట్లు తెలిపింది. మూడు విడతలో రూ.213.83 కోట్లు రావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదు పదుల వయసులోనూ పది పరీక్షకు హాజరు
[ 19-03-2024]
చదువుకోవాలనే తపన ఉండాలే కాని వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు గుమ్మలక్ష్మీపురం మండలంలోని మూలపాడుకు చెందిన పెద్దమ్మి. -
జీవనాధారం కల్పించండి సారూ!
[ 19-03-2024]
మన్యం జిల్లాలో ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదేళ్లుగా జిల్లా నుంచి కదలకపోవడంతో రైతులతో పాటు పలు వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
కళ్లికోటలో కరిరాజుల అలజడి
[ 19-03-2024]
కొమరాడ మండలంలోని కళ్లికోట సమీపంలో కరిరాజుల గుంపు సంచరిస్తోంది. -
బిందెడు నీటికి ఎన్ని బాధలో..
[ 19-03-2024]
పార్వతీపురం మండలంలోని చినబొండపల్లిలో పరిస్థితి ఇది. గ్రామంలో ఇంటికో కుళాయి వేశారు. డి.శిర్లాం పైలెట్ ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా చేసేవారు. -
96.99 శాతం హాజరు
[ 19-03-2024]
జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 66 కేంద్రాల్లో 10,746 మందికి గాను 10,423 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఈ కష్టాలు ఎప్పుడు తీరేనో..?
[ 19-03-2024]
-
దోపిడీలకు దారొదిలేశారు!!
[ 19-03-2024]
గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస కూడలి వద్ద ఓ రైస్ మిల్లు యజమాని తన భార్యతో కలిసి నివాసముంటున్నారు. గత నెల 26న ఉదయం సదరు వ్యక్తి మోటారు వేసేందుకు బయటకు వచ్చారు. -
ఐదేళ్లు ఊరుకున్నారు.. చివరిలో జారుకున్నారు!
[ 19-03-2024]
బొబ్బిలి పట్టణంలోని రామన్నదొరవలస వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాల్లో కొన్నింటిని ఎట్టకేలకు పూర్తి చేశారు. మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు. -
ఎమ్మెల్యే సారూ..90 రోజుల్లో ఇల్లెక్కడ
[ 19-03-2024]
నిజంగా ప్రభుత్వం ఇస్తుందేమోనని కొందరు స్థలం కోసం, ఇంకొందరు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటామని ముందుకొచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
అమృత్ అందలే
[ 19-03-2024]
పురపాలక సంఘాల్లో మరో 20 ఏళ్ల వరకు దాహార్తి సమస్య లేకుండా చేయాలన్నది అమృత్ 2.0 ఉద్దేశం. పార్కులు, మురుగునీటి శుద్ధి ప్లాంటు వంటి పనులు ప్రతిపాదించారు. తీరా ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే బిల్లులు వస్తాయా? -
వదలా.. బొమ్మాళీ
[ 19-03-2024]
అధికారంలో ఉన్నాం.. మమ్మల్నెవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో అధినేత జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల ఫ్ల్లెక్సీలను విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. -
పట్టా పుట్టించారు.. సాయం పెంచేశారు
[ 19-03-2024]
ఓట్ల వేటలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు లేని పట్టాలను పుట్టిస్తోంది వైకాపా ప్రభుత్వం. వివిధ పథకాల కింద అందిన సొమ్ము సైతం ఎక్కువ అందినట్లు చెబుతూ ప్రచారం చేసుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
-
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆదుకుంటామని హామీ
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్