‘ఆసరా’ ఎప్పుడు దొరికేది...?
వైఎస్సార్ ఆసరా మూడో విడత ఎప్పుడు ఇస్తారోనని లబ్ధిదారులు రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది డిసెంబరు నెల 27, తర్వాత జనవరి మొదటి వారం, తర్వాత అదేనెల 30న ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోవడంతో డబ్బులు ఎప్పుడొస్తాయా...? అని అధికారులను అడుగుతున్నారు.
లబ్ధిదారుల జాబితా చూస్తున్న సంఘ సభ్యులు
విజయనగరం మయూరి కూడలి, న్యూస్టుడే: వైఎస్సార్ ఆసరా మూడో విడత ఎప్పుడు ఇస్తారోనని లబ్ధిదారులు రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది డిసెంబరు నెల 27, తర్వాత జనవరి మొదటి వారం, తర్వాత అదేనెల 30న ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోవడంతో డబ్బులు ఎప్పుడొస్తాయా...? అని అధికారులను అడుగుతున్నారు. అధికారులు కూడా స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు.
రెండు విడతల్లో చెల్లింపు: 2019 ఏప్రిల్ 11 నాటికి బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకుని చెల్లిస్తున్న స్వయం సహాయక సంఘాల వారికి ఆసరా పథకాన్ని వర్తింపజేశారు. సభ్యులు చెల్లిస్తున్న అప్పును నాలుగు విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా ఇప్పటికి రెండు విడతల్లో 31,070 సంఘాలకు రూ.427.66 కోట్లు ఉమ్మడి జిల్లాలో చెల్లించింది. మూడో విడత బయోమెట్రిక్ హాజరును సిబ్బంది తీసుకున్నారు. సభ్యులు చనిపోతే వారి స్థానంలో లబ్ధిదారుల కుటుంబంలో నామినీకి అవకాశం కల్పించారు. మూడో విడత ఆసరా మొత్తాన్ని జనవరి 30న ఇస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గంట్యాడలో జరిగిన సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని డీఆర్డీఏ పీడీ కల్యాణ్ చక్రవర్తి ‘న్యూస్టుడే’కు తెలిపారు. వివరాలు రాగానే కార్యాచరణను సిద్ధం చేస్తామని, అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపామన్నారు.
పాత జిల్లాల వారీగా 31,070 సంఘాల్లో.....: ప్రభుత్వం ప్రకటించిన తేదీ నాటికి పాత జిల్లాల ప్రకారం 31,070 సంఘాల్లో 3,58,108 మంది సభ్యులు ఉన్నారు. వారి నుంచి క్షేత్రస్థాయిలో సేకరించిన డాటా ఆధారంగా సామాజిక ఆడిట్ ప్రక్రియను కూడా పూర్తిచేశారు. అనంతరం ఆ జాబితాను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. దీని ఆధారంగా సంఘ పొదుపు ఖాతాలకు మూడో విడత ప్రభుత్వం జమచేయనున్నట్లు తెలిపింది. మూడు విడతలో రూ.213.83 కోట్లు రావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి
[ 10-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమితోనే సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు. -
హలో చీపురుపల్లి.. బై బై బొత్స
[ 10-05-2024]
ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం సాయంత్రం చీపురుపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. -
అయిదేళ్లు చూశారు.. గొంతెత్తారు
[ 10-05-2024]
అయిదేళ్లు ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మారు.. తమకిచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఎదురుచూశారు. జగన్ ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో చివరకు వారంతా పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. -
విశాఖ ఎంపీగా భరత్ను గెలిపించండి
[ 10-05-2024]
విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం తెదేపా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన భర్త ఎం.శ్రీభరత్ను గెలిపించాలంటూ అతని భార్య, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజశ్విని కోరారు. -
పిడుగుపాటుతో మహిళ మృతి
[ 10-05-2024]
వంగర మండలం బంగారువలస గ్రామానికి చెందిన బౌరౌతు సత్తెమ్మ (57) గురువారం సాయంత్రం వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో.. -
అన్నదాతకు ఇక సంక్షేమమే
[ 10-05-2024]
వ్యవసాయాన్ని బంగారం చేసేందుకు, రైతులను ఆదుకునేందుకు ఎన్టీయే కూటమి ముందుకు వచ్చింది. సేద్యానికి పూర్వవైభవం తెచ్చేందుకు నడుము బిగించింది. -
అతిరథుల మార్గం.. అడుగడుగునా అధ్వానం!
[ 10-05-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు నెల్లిమర్ల, రాజాం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిత్యం రాకపోకలు సాగించేది విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపైనే. రాజాం, గరివిడి, గర్భాం, పాలకొండ వంటి పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ఈ మార్గమే ఆధారం. -
సకల జనుల సంక్షేమానికే.. సూపర్-6
[ 10-05-2024]
‘వైకాపా అయిదేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.. దాడులు, దౌర్జన్యాలతోనే కాలం వెల్లదీశారు.. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీలను ఎక్కడా అమలు చేయలేదు.. -
వద్దంటే వద్దు..
[ 10-05-2024]
ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవసరమైన స్లిప్పులను తీసుకునేందుకు భోజరాజపురం గ్రామస్థులు నిరాకరించారు. -
అప్పుల మావయ్య.. ఈ తిప్పలు చాలయ్యా
[ 10-05-2024]
ఆటో, మ్యాక్సీ క్యాబ్ చోదకులను ఆదుకుంటామని చెప్పిన వైకాపా ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి వారిని నిండా ముంచేసింది. -
వారిది అభివృద్ధి మాట.. వీరిది మద్యం బాట
[ 10-05-2024]
పోలింగ్కు మరో మూడు రోజులే ఉంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల నాయకులు ప్రచార జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదునుపెట్టారు. -
309 పోస్టల్ బ్యాలెట్ల నమోదు
[ 10-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 309 బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు సంబంధించి 42 మంది ఓట్లు నమోదయ్యాయి. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
[ 10-05-2024]
సాధారణ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టరు నిశాంత్కుమార్ ఆదేశించారు. -
అమాత్యా.. అయిదేళ్లలో ఏం చేశారు..?
[ 10-05-2024]
సాలూరు పట్టణంలో అధ్వాన పరిస్థితులు వైకాపా అయిదేళ్ల పాలనకు అద్దం పడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేయలేదు.. సరికదా గుంతలు కూడా పూడ్చలేదు.
తాజా వార్తలు (Latest News)
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!