ఇకనైనా దాహార్తి తీరేనా!
ఏళ్ల కిందట నిర్మించిన రక్షిత పథకాల మరమ్మతులు.. పెరుగుతున్న జనాభా.. వెరసి ఏడాది పొడవునా పట్టణాల్లో తాగునీటి ఇక్కట్లు సర్వసాధారణం అవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలకు ‘అమృత్’లో రూ.92 కోట్లు మంజూరు
న్యూస్టుడే-పాలకొండ: ఏళ్ల కిందట నిర్మించిన రక్షిత పథకాల మరమ్మతులు.. పెరుగుతున్న జనాభా.. వెరసి ఏడాది పొడవునా పట్టణాల్లో తాగునీటి ఇక్కట్లు సర్వసాధారణం అవుతున్నాయి. వేసవి వస్తే ఈ సమస్య మరింత అధికంగా ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో నీటి సమస్య పరిష్కారానికి అమృత్ పథకంలో భాగంగా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.10.38 కోట్లు, విజయనగరం జిల్లాకు రూ.81.62 కోట్లు ఇటీవల విడుదల చేసింది.
ఏయే ప్రాంతాలకు కేటాయిస్తారు
పట్టణాల్లో బలహీన, వెనుకబడిన వర్గాలు నివాసం ఉండే ప్రాంతాల్లో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు. అవసరమైన చోట్ల రక్షిత పథకాల నిర్మాణం, పైపులైన్లు విస్తరించనున్నారు. ముందుగా వీటికి డీపీఆర్లు రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అనంతరం పాలకవర్గాల అనుమతితో ఏయే ప్రాంతాలకు అవసరమో గుర్తిస్తారు. అనంతరం టెండర్లు పూర్తయిన తర్వాత పనులు ప్రారంభిస్తారు.
జగనన్న కాలనీలకు ప్రాధాన్యం
ఇప్పటికే పట్టణాలకు నాన్ అమృత్ పథకంలో భాగంగా నిధులు మంజూరయ్యాయి. దీంతో ప్రస్తుతం మంజూరైన అమృత్ నిధులను అధికంగా జగనన్న కాలనీలకు కేటాయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విజయనగరం, రాజాం, పాలకొండకు సంబంధించి ఆయా పట్టణాల్లోని బలహీన వర్గాల ప్రాంతాల్లో నిధులు వెచ్చించనున్నారు. పాలకొండతో పాటు మిగిలిన పట్టణాలకు సంబంధించి జల జీవన్ మిషన్ పథకంలో జగనన్న లేఅవుట్లలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి.
డీపీఆర్లు సిద్ధం చేస్తున్నాం
- దక్షిణామూర్తి, ఈఈ, పబ్లిక్ హెల్త్, విజయనగరం
కేంద్ర ప్రభుత్వం బలహీన వర్గాల ప్రాంతాల్లోని తాగునీటి అవసరాలకు నిధులు ఖర్చు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా డీపీఆర్లు సిద్ధం చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హలో చీపురుపల్లి.. బై బై బొత్స
[ 10-05-2024]
ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం సాయంత్రం చీపురుపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. -
అయిదేళ్లు చూశారు.. గొంతెత్తారు
[ 10-05-2024]
అయిదేళ్లు ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మారు.. తమకిచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఎదురుచూశారు. జగన్ ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో చివరకు వారంతా పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. -
విశాఖ ఎంపీగా భరత్ను గెలిపించండి
[ 10-05-2024]
విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం తెదేపా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన భర్త ఎం.శ్రీభరత్ను గెలిపించాలంటూ అతని భార్య, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజశ్విని కోరారు. -
పిడుగుపాటుతో మహిళ మృతి
[ 10-05-2024]
వంగర మండలం బంగారువలస గ్రామానికి చెందిన బౌరౌతు సత్తెమ్మ (57) గురువారం సాయంత్రం వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో.. -
అన్నదాతకు ఇక సంక్షేమమే
[ 10-05-2024]
వ్యవసాయాన్ని బంగారం చేసేందుకు, రైతులను ఆదుకునేందుకు ఎన్టీయే కూటమి ముందుకు వచ్చింది. సేద్యానికి పూర్వవైభవం తెచ్చేందుకు నడుము బిగించింది. -
అతిరథుల మార్గం.. అడుగడుగునా అధ్వానం!
[ 10-05-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు నెల్లిమర్ల, రాజాం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిత్యం రాకపోకలు సాగించేది విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపైనే. రాజాం, గరివిడి, గర్భాం, పాలకొండ వంటి పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ఈ మార్గమే ఆధారం. -
సకల జనుల సంక్షేమానికే.. సూపర్-6
[ 10-05-2024]
‘వైకాపా అయిదేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.. దాడులు, దౌర్జన్యాలతోనే కాలం వెల్లదీశారు.. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీలను ఎక్కడా అమలు చేయలేదు.. -
వద్దంటే వద్దు..
[ 10-05-2024]
ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవసరమైన స్లిప్పులను తీసుకునేందుకు భోజరాజపురం గ్రామస్థులు నిరాకరించారు. -
అప్పుల మావయ్య.. ఈ తిప్పలు చాలయ్యా
[ 10-05-2024]
ఆటో, మ్యాక్సీ క్యాబ్ చోదకులను ఆదుకుంటామని చెప్పిన వైకాపా ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి వారిని నిండా ముంచేసింది. -
వారిది అభివృద్ధి మాట.. వీరిది మద్యం బాట
[ 10-05-2024]
పోలింగ్కు మరో మూడు రోజులే ఉంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల నాయకులు ప్రచార జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదునుపెట్టారు. -
309 పోస్టల్ బ్యాలెట్ల నమోదు
[ 10-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 309 బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు సంబంధించి 42 మంది ఓట్లు నమోదయ్యాయి. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
[ 10-05-2024]
సాధారణ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టరు నిశాంత్కుమార్ ఆదేశించారు. -
అమాత్యా.. అయిదేళ్లలో ఏం చేశారు..?
[ 10-05-2024]
సాలూరు పట్టణంలో అధ్వాన పరిస్థితులు వైకాపా అయిదేళ్ల పాలనకు అద్దం పడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేయలేదు.. సరికదా గుంతలు కూడా పూడ్చలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం