ముగ్గురి పాలిట మృత్యువు
మృత్యువు ఒకేసారి మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. కన్నవారు లేకపోయినా తోడబుట్టిన వారికి అండగా ఉన్న మరొకరిని బలితీసుకుంది..
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ద్విచక్ర వాహనాల ఢీ
సాలూరు, జన్నివలసలో అలుముకున్న విషాదం
పురుషోత్తం, యశోద కృష్ణ (పాతచిత్రాలు), శ్రీను మృతదేహం
మృత్యువు ఒకేసారి మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. కన్నవారు లేకపోయినా తోడబుట్టిన వారికి అండగా ఉన్న మరొకరిని బలితీసుకుంది.. అప్పటికే ఇద్దరు కన్నబిడ్డల్ని పోగొట్టుకుని వేదనలో ఉన్న తల్లికి అండగా ఉన్న ఒక్క కుమారుడ్ని శాశ్వతంగా దూరం చేసింది...
రామభద్రపురం, సాలూరు, న్యూస్టుడే: సాలూరు-రామభద్రపురం 26వ జాతీయ రహదారిపై కొట్టక్కి వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సును తప్పించబోయే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు, రామభద్రపురం సీఐ తిరుమలరావు వివరాల మేరకు.. రామభద్రపురం మండలం జన్నివలసకు చెందిన జొన్నాడ పురుషోత్తం (25), గెద్ద రాంప్రసాద్, గణేష్లు ఒక ద్విచక్ర వాహనంపై సాలూరు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. వీరు కొట్టక్కి వంతెన వద్ద సాలూరు పట్టణానికి చెందిన గండుబోయిన యశోద కృష్ణ(25), జి. శ్రీను (47) బైక్ను ఢీకొన్నారు. ప్రమాదంలో పురుషోత్తం అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శ్రీను, యశోదకృష్ణను సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి, రాంప్రసాద్, గణేష్ను బాడంగి సీహెచ్సీకి 108 వాహనాల్లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీను, యశోద కృష్ణ మృతి చెందారు. మిగిలిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించారు. దీనిపై రామభద్రపురం ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సాలూరు పట్టణ సీఐ, ఎస్ఐలు వాసునాయుడు, ఎస్వీ సురేష్, సీతారాం, సిబ్బంది క్షతగాత్రులకు సహాయక చర్యలు అందించారు.
మృతదేహంపై పడి రోదిస్తున్న పురుషోత్తం తల్లిదండ్రులు
జీవనాధారం కోల్పోయారు..
జన్నివలస గ్రామానికి చెందిన పురుషోత్తం రాజమండ్రిలోని ఓ సీడ్ కంపెనీలో పనిచేస్తూ.. తల్లిదండ్రులు తౌడమ్మ, అప్పారావును పోషిస్తున్నాడు. కుమార్తెకు వివాహం చేయగా.. కుమారుడు ఇంటికి పెద్దదిక్కుగా ఉండేవాడని, ఇంటి దీపం ఆరిపోయిందని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. పురుషోత్తం రాజమహేంద్రవరం నుంచి ఇంటికి బైక్పై గురువారం వచ్చాడు. ఆ సమయంలో జన్నివలస గ్రామంలో డీఎస్పీ, సీఐలు రోడ్డు ప్రమాదాలు, ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు. సాలూరుకు వెళ్లి వస్తానని చెప్పిన పురుషోత్తం మిత్రులతో కలిసి ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సాలూరు పట్టణం గొల్లవీధికి చెందిన అవివాహితుడు యశోద కృష్ణ తల్లిదండ్రులు చనిపోయారు. అక్క, ఇద్దరు సోదరులున్నారు. చికెన్ సెంటర్లో పనిచేస్తూ కుటుంబానికి సాయంగా ఉండేవాడు. కొద్ది సేపటి ముందే ఇంట్లోని పిల్లలు పానీపూరీ కావాలంటే ఇచ్చి, బయటికి వచ్చాడని.. తమ్ముడిని ఇలా విగతజీవిగా చూస్తామని అనుకోలేదని సోదరి, సోదరులు బోరున విలపించారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు
ఒంటరిగా మారిన తల్లి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీనుకు తల్లి సూరమ్మ, ఇద్దరు సోదరులున్నారు. మూడేళ్ల కిందట ఇద్దరు కుమారులు అనారోగ్యంతో చనిపోయారు. ఉన్న ఒక్క కొడుకు శ్రీనును మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో తీసుకుపోయిందని ఆ తల్లి పడుతున్న బాధ వర్ణనాతీతంగా మారింది. శ్రీను భార్య అతనిని విడిచిపెట్టింది. సున్నం, పెయింటింగ్ పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
[ 28-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పరిశ్రమలను సైతం మూసేసి చెరకు రైతుల నోట్లో మట్టికొట్టారు. పనిచేస్తున్న కార్మికులను పస్తుల్లో ఉంచారు. చెరకు పంట సాగు ప్రశ్నార్థకంగా మారేలా చేశారు. -
అందలంపై నీవు.. అంధకారంలో మేము
[ 28-04-2024]
గతంలో చీకటి రాజ్యాలుండేవి.. జగనన్న రాజ్యంలో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. గత ఐదేళ్లలో వీధుల్లో గాఢాంధకారమే నెలకొంది.. వెలుగులిస్తామని చెప్పిన ఈ పరదాల వీరుడు ప్రతి వీధిలోనూ చీకట్లనే నింపారు.. -
రూపాయి రుణమివ్వని జగన్
[ 28-04-2024]
బీసీల్లో వివిధ వర్గాలకు చెందిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు గత ప్రభుత్వం కాపు, కుమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణ, వాల్మీకి, బోయి తదితర కులాలతో పాటు ఈబీసీ, ఎంబీసీ(సంచార జాతులు), వైశ్య తదితర కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. -
కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్
[ 28-04-2024]
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. -
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు
[ 28-04-2024]
స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. -
వైకాపాను ఛీకొట్టి.. ఓటుకు జైకొట్టి
[ 28-04-2024]
ఇళ్ల వద్ద ఓటు వినియోగించే వృద్ధులు, దివ్యాంగులను మాయ చేయాలని చూసిన వైకాపా నాయకుల వికృత ఆలోచనకు ఎదురు దెబ్బ తగిలింది. -
జిల్లా ఓటర్లు 7,83,440
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. -
టోల్ తీస్తారు
[ 28-04-2024]
విజయనగరం జిల్లాలో మూడు ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు త్వరలో ప్రారంభించనున్నారు. -
కోలగట్ల ఎమ్మెల్యే అయితే భూములు మాయం
[ 28-04-2024]
విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రభుత్వ భూములతో పాటు నగరవాసుల భూములు కూడా మాయమవుతాయని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు. -
ఇది జగనన్న చీకటి రాజ్యం..!!
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలకు అంధకారమే మిగిలింది. ఎక్కడ చూసినా వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది. -
సర్కార్ తెచ్చిన నీటి కరవు
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల లోపం.. ప్రజల పాలిట శాపంగా మారింది. నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా చేయడంతో బొబ్బిలి పట్టణ వాసుల గొంతులు ఎండిపోతున్నాయి. -
పెద్దపల్లికి పెద్దగెడ్డ నీరు తెస్తా
[ 28-04-2024]
పెద్దపల్లిలో చెరువుకు వెళ్లే దారిలో వంతెన నిర్మిస్తామని, పెద్దగెడ్డ నీరు తీసుకువచ్చి రైతుల కాళ్లు కడుగుతానని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్