మాజీ మంత్రి మాటల మర్మమేమిటి..! జగన్ ఓడిపోతారని పరోక్ష జోస్యమా
జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులోని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన శనివారం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
తమపై సీఎంకి ప్రేమ లేదని ఒప్పుకోలా
రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన బాలినేని వ్యాఖ్యలు
జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులోని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన శనివారం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సీనియర్ నేత అసలింతకీ ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది పలువురికి అంతుచిక్కకుంది. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత ఆయనపై పలు ఊహాగానాలు వచ్చాయి. తెదేపా, జనసేనతో కలిసి నడుస్తారని, వైకాపాను వీడబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు షికారు చేశాయి. వైకాపా నుంచి పోటీ చేసినా ఒంగోలును వీడి పశ్చిమ ప్రాంతానికి వెళ్తారంటూ కూడా వచ్చాయి. వీటన్నింటినీ బాలినేని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వచ్చారు. తాజా వ్యాఖ్యల్లోనూ తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని, కాకపోతే నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలవకపోతే బరిలో నిలవననీ, ప్రస్తుత రాజకీయాలంటే తనకు, తన కుటుంబానికీ వెగటు పుడుతోందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. అసలు పార్టీలో అంతర్లీనంగా ఏం జరుగుతోంది. వైకాపా అధిష్ఠానంతో బాలినేని సఖ్యత చెడిందా.. జగన్పై మాకు అపారమైన ప్రేమ ఉన్నా.. మాపైన ఆయనకు ఉండొద్దా.. అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటనే చర్చా సాగుతోంది.
న్యూస్టుడే, ఒంగోలు నేరవిభాగం
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తుందని ఊహించా.. రూ.50 లక్షలు పందెం కూడా కాశా. అక్కడ బీఆర్ఎస్ గెలిస్తేనే ఇక్కడ వైకాపా గెలుస్తుందనే భావనలో ఉన్న మా అబ్బాయి చెప్పాడని డబ్బు వచ్చే అవకాశం ఉన్నా పందెం నుంచి ఆ తర్వాత తప్పుకొన్నా. మాకు జగన్ అంటే అంత ప్రేమ. ఆయనకు కూడా ఉండాలిగా, ఉండాలనే కోరుకుంటున్నా..
ఎమ్మెల్యే, మంత్రిగా బాలినేని మూడు దశాబ్దాలపాటు పలు ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఫలితాలపై ఆయనకు ముందుగానే కొంత అవగాహన ఉండొచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తేనే రాష్ట్రంలో వైకాపా గెలుస్తుందని తన తనయుడు ప్రణీత్ రెడ్డి చెప్పారని.. డబ్బులు వస్తాయని తెలిసి కూడా తాను కాంగ్రెస్ గెలుపుపై కాసిన రూ.50 లక్షల పందేన్ని వెనక్కు తీసుకున్నట్లు బహిరంగంగా వెల్లడించారు. రాష్ట్రంలో జగన్ గెలవాలని తన కుమారుడు కోరుకుంటున్నాడని, తనకి జగన్ అంటే అంతపిచ్చి అని చెప్పారు. అంటే అక్కడ కాంగ్రెస్ గెలుపులో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ జగన్ ఓడిపోతారనేది బాలినేని జోస్యమా అనే చర్చ సాగుతోంది. ‘మాకు ఆయనపై అంత అభిమానం ఉంది. మాపైన ఆయనకు ఉండొద్దా..? ఉండాలని కోరుకుంటున్నా’.. అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కొత్త ఊహాగానాలకు తావిస్తున్నాయి.
నా కుమారుడి(ప్రణీత్రెడ్డి)ని రాజకీయాల్లోకి తీసుకురావాలా.. వద్దా.! అని ఆలోచిస్తున్నా. మన పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు కనీసం ఓటర్ల జాబితాలు కూడా పరిశీలించటం లేదు. మీరందరూ కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తానంటేనే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా. అయిదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా పనిచేశాను. నాకు పోయేదేమీలేదు’.
వేరు కుపంట్లతోనే వెగటా..: ‘నాకే కాదు, నా కుటుంబ సభ్యులకు కూడా రాజకీయాలంటే వెగటు పుడుతోంది. నా కుమారుడ్ని రాజకీయాల్లోకి తేవాలా..? వద్దా..? అనే ఆలోచనలో ఉన్నాను’ అంటూ బాలినేని (Balineni Srinivasa Reddy) చేసిన వ్యాఖ్యల పైనా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక బాలినేని కుమారుడు ప్రణీత్రెడ్డి పాత్ర జిల్లాలో పలు సందర్భాల్లో వినిపించింది. తమిళనాడులో పట్టుబడిన రూ.అయిదు కోట్ల నగదు నుంచి పలు భూ వివాదాలు, ప్రైవేట్ సెటిల్మెంట్లలో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. దీంతో సహజంగానే విపక్షం ఆయన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. సొంత పార్టీలో కూడా బాలినేని, ఆయన తనయుడిపై అధిష్ఠానానికి కొందరు ఫిర్యాదులు చేశారు. విలేకరుల సమావేశంలో తనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర చేస్తున్నారని, సొంత పార్టీలోని నాయకులు, తాను టిక్కెట్లు ఇప్పించిన వ్యక్తులే తనపై అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నారంటూ బాలినేని భావోద్వేగానికి గురై కంట నీరు కూడా పెట్టుకున్నారు. తాజాగా మరోసారి తన తనయుడి రాజకీయ రంగప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు చర్చకు తావిచ్చాయి.
అయిదుసార్లు ఎమ్మెల్యేని, రెండుసార్లు మంత్రిగా చేశా. ఒంగోలు ఎమ్మెల్యేగా ఎక్కడా రూపాయి తీసుకోలేదు. ఇక్కడ నేనెప్పుడూ అవినీతికి పాల్పడలేదు. అలాగని నేను నీతిమంతుడ్ని అని చెప్పను. మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం డబ్బులు తీసుకున్నా. నాకూ ఖర్చులుంటాయి కదా’..
శ్రేణులు సహకరించడం లేదా...: ‘రానున్న ఎన్నికల్లో ఒక సామాజిక వర్గం ఒంగోలులో నేరుగా రోడ్డు మీదకు వస్తుంది. దీటుగా ఎదుర్కోవాలంటే మీరంతా కలిసికట్టుగా పనిచేయాలి. ఎన్నిసార్లు చెప్పినా కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు ఓటర్ల జాబితాలను కూడా పరిశీలించటం లేదు. మీరు నాకు అండగా నిలిస్తేనే నేను రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తా.. లేదంటే తప్పుకొంటా’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైకాపా శ్రేణుల్లో తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ అంటూ కోతలు.. రోడ్ల మీదే ఆటలు
[ 29-04-2024]
ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్ బయటకొస్తాడు.. స్టాన్స్ ఎలా తీసుకోవాలి..ఫుట్వర్క్ ఎలా ఉండాలి..డ్రైవ్ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు. -
అన్నం పెట్టే చదువులకు.. అన్నే ఓ చెద
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్, బైజూస్ అంటూ జగన్ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ -
గద్దెనెక్కి గొప్పలు.. గోతులతోనే ముగింపు
[ 29-04-2024]
తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం మద్దిపాడు మండలంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అవాంతరాలు తలెత్తుతూ సమస్యలు ఎదురవుతున్నాయి. -
3న జిల్లాకు జనసేనాని
[ 29-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మే 3న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. -
తెదేపా అధినేత పర్యటన వాయిదా
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
69,918 మందికి ఇళ్ల వద్దే పింఛను
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది. -
జనం ‘చెవి’లో ప్రలోభాల పువ్వులు
[ 29-04-2024]
రాజకీయ బదిలీపై రాయలసీమ నుంచి నుంచి అధిష్ఠానం ఆ నేతను జిల్లాకు బలవంతంగా పంపింది. వస్తూనే ఏకంగా జిల్లా పోలీసు బాస్నే వెంట తెచ్చుకున్నారు. -
వైకాపాకు ఓట్లేయాలని చర్చిలో ప్రసంగం
[ 29-04-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. -
జిల్లాలో సైకిల్ జోరు
[ 29-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. వైకాపాకు చెందిన పలువురు నేతలు, అభిమానులు సైకిలెక్కుతున్నారు. -
తగాదా అడ్డుకోబోతే కడతేర్చారు
[ 29-04-2024]
సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 29-04-2024]
బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. -
అత్యవసరంపై.. అంతులేని నిర్లక్ష్యం
[ 29-04-2024]
అర్థవీడుకు అత్యవసర సేవలు దూరమాయ్యాయి. ఏళ్ల కాలంగా ఉన్న ఒక్క అత్యవసర వాహనం అర్థవీడుకు పరిమితమైంది. లోయ గ్రామీణులకు అత్యవసర వైద్యం అందాలన్న..
తాజా వార్తలు (Latest News)
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం