Balineni: నా కుమారుడికిస్తే నెత్తికెత్తుకుంటా
ఒంగోలు ఎంపీ స్థానంపై అధికార పార్టీ వైకాపా మల్లగుల్లాలు పడుతోంది. అభ్యర్థిగా రోజుకో పేరును తెర పైకి తెస్తూ శ్రేణుల్ని అయోమయానికి గురిచేస్తోంది. తమ పార్టీలోని పరిస్థితిపై ఆ పార్టీ కార్యకర్తలే గందరగోళానికి గురయ్యేలా చేస్తోంది
ఎంపీ స్థానంపై బాలినేని ప్రతిపాదన
విజయసాయిరెడ్డితో మాజీ మంత్రి చర్చ
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ఒంగోలు ఎంపీ స్థానంపై అధికార పార్టీ వైకాపా మల్లగుల్లాలు పడుతోంది. అభ్యర్థిగా రోజుకో పేరును తెర పైకి తెస్తూ శ్రేణుల్ని అయోమయానికి గురిచేస్తోంది. తమ పార్టీలోని పరిస్థితిపై ఆ పార్టీ కార్యకర్తలే గందరగోళానికి గురయ్యేలా చేస్తోంది. జిల్లాలో సరైన అభ్యర్థులే లేరని భావించిన అధిష్ఠానం తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మంత్రి ఆర్.కె.రోజా పేర్లను ఇటీవల ప్రతిపాదించింది. వీరు స్థానికేతరులు కావడంతో నెగ్గుకురాలేరంటూ పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరో కొత్త చర్చకు తెర లేపారు. సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అవసరం లేదని భావిస్తే ఆ స్థానంలో తన కుమారుడు ప్రణీత్రెడ్డి పేరును పరిశీలించాలని పార్టీ పెద్దల ఎదుట నూతన ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం.
సీఎంవోకు వెళ్లి.. మళ్లీ సాయిరెడ్డి వద్దకు...
బాలినేని సోమవారం ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో పర్యటించారు. అనంతరం తన తనయుడు ప్రణీత్రెడ్డి, మరికొందరు ముఖ్య అనుచరులతో కలిసి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఉండగా.. కాస్త ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సీఎం ఇతర పనుల్లో ఉండటంతో కలవడం సాధ్యపడలేదు. దీంతో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు. జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటను అంగీకరించకపోతే స్థానికేతరులు ఎవరు పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని బాలినేని సూచించినట్లు సమాచారం. సదరు స్థానం నుంచి తన కుమారుడు ప్రణీత్రెడ్డికి అవకాశం కల్పించాలని కోరారని.. అలా అయితే పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతను తాను నెత్తికెత్తుకుంటానని చెప్పినట్లు తెలిసింది.
ఆశావహులు X అన్నా వర్గీయులు...
గిద్దలూరు రాజకీయం రసవత్తరంగా మారింది. జిల్లాలో ఇప్పటికే అయిదు నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం పూర్తయింది. మరో మూడు స్థానాలపై సందిగ్ధం నెలకొంది. వీటిలో ప్రధానంగా అందరి దృష్టీ గిద్దలూరు నియోజకవర్గంపై ఉంది. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ సిటింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటన చేసి కలకలం సృష్టించారు. అదే సమయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై ఆరోపణలతో ప్రకంపనలు రేపారు. స్వయంగా ఎమ్మెల్యే తాను పోటీ చేయడం లేదని ప్రకటించడంతో ఈ నియోజకవర్గం నుంచి ఆరేడు మంది ఆశావహులు సీటు తమకివ్వాలంటే తమకంటూ పోటీ పడుతున్నారు. సీఎంతో అన్నా రాంబాబు భేటీ తర్వాత గిద్దలూరు, మార్కాపురం అభ్యర్థులను పరస్పరం మారుస్తారనే ప్రచారం సాగింది. దీంతో ఆశావహులంతా ఒక్కటయ్యారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూనే.. మాజీ మంత్రి బాలినేనికిస్తే పనిచేస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఈ సమావేశం తర్వాత రోజే బేస్తవారపేటలో అన్నా రాంబాబు వర్గం స్పందించింది. ఆయనకే టికెట్ కేటాయించాలంటూ శుక్రవారం రాత్రి ప్రదర్శన నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.
అధిష్ఠానానికి శ్రేణుల ఝలక్...
కనిగిరి నియోజకవర్గంపై వైకాపా అధిష్ఠానం పునరాలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను పక్కనబెట్టి హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణ యాదవ్ను సమన్వయకర్తగా నియమించింది. దీంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా కలకలం రేగింది. బుర్రా వర్గానికి చెందిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఒకానొక దశలో కాంగ్రెస్లో చేరాలంటూ బుర్రాపై ఒత్తిడి తెచ్చారు. తాజాగా సోమవారం ఆయన తాడేపల్లిలో పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. ఇక్కడ పార్టీ పునరాలోచన చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
సమన్వయకర్తలకు సహకారంపై ఆరా...
జిల్లాలో నూతన సమన్వయకర్తల నియామకం అనంతరం పార్టీ పరిస్థితిపై వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి ఆరా తీశారు. తిరుపతి నుంచి విజయవాడ వెళ్తూ ఆదివారం రాత్రి ఒంగోలు సమీపంలోని వల్లూరు వద్దనున్న ఓ ప్రైవేట్ హోటల్ వద్ద ఆగారు. ముందుగానే సమాచారం ఉండటంతో కనిగిరి నియోజకవర్గ నూతన సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్, రెడ్డి కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి, పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఆయన్ను కలిశారు. జిల్లాలో నూతన సమన్వయకర్తల నియామకం అనంతరం పార్టీ పరిస్థితిపై ఆయన వారి వద్ద ఆరా తీసినట్లు తెలిసింది. సిటింగ్ ఎమ్మెల్యేలు, వారి అనుచరగణం నుంచి నూతన సమన్వయకర్తలకు ఎటువంటి సహకారం అందుతోంది, పార్టీ తరఫున ఎటువంటి సహాయం అవసరం అనే అంశాలను ఆయన నాయకులతో చర్చించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ అంటూ కోతలు.. రోడ్ల మీదే ఆటలు
[ 29-04-2024]
ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్ బయటకొస్తాడు.. స్టాన్స్ ఎలా తీసుకోవాలి..ఫుట్వర్క్ ఎలా ఉండాలి..డ్రైవ్ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు. -
అన్నం పెట్టే చదువులకు.. అన్నే ఓ చెద
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్, బైజూస్ అంటూ జగన్ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ -
గద్దెనెక్కి గొప్పలు.. గోతులతోనే ముగింపు
[ 29-04-2024]
తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం మద్దిపాడు మండలంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అవాంతరాలు తలెత్తుతూ సమస్యలు ఎదురవుతున్నాయి. -
3న జిల్లాకు జనసేనాని
[ 29-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మే 3న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. -
తెదేపా అధినేత పర్యటన వాయిదా
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
69,918 మందికి ఇళ్ల వద్దే పింఛను
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది. -
జనం ‘చెవి’లో ప్రలోభాల పువ్వులు
[ 29-04-2024]
రాజకీయ బదిలీపై రాయలసీమ నుంచి నుంచి అధిష్ఠానం ఆ నేతను జిల్లాకు బలవంతంగా పంపింది. వస్తూనే ఏకంగా జిల్లా పోలీసు బాస్నే వెంట తెచ్చుకున్నారు. -
వైకాపాకు ఓట్లేయాలని చర్చిలో ప్రసంగం
[ 29-04-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. -
జిల్లాలో సైకిల్ జోరు
[ 29-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. వైకాపాకు చెందిన పలువురు నేతలు, అభిమానులు సైకిలెక్కుతున్నారు. -
తగాదా అడ్డుకోబోతే కడతేర్చారు
[ 29-04-2024]
సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 29-04-2024]
బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. -
అత్యవసరంపై.. అంతులేని నిర్లక్ష్యం
[ 29-04-2024]
అర్థవీడుకు అత్యవసర సేవలు దూరమాయ్యాయి. ఏళ్ల కాలంగా ఉన్న ఒక్క అత్యవసర వాహనం అర్థవీడుకు పరిమితమైంది. లోయ గ్రామీణులకు అత్యవసర వైద్యం అందాలన్న..
తాజా వార్తలు (Latest News)
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ