వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులు బలి
నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు.
అర్థవీడు, న్యూస్టుడే
కాకర్ల వెలిగొండ ఆనకట్ట మునక ప్రాంతంలోని మొట్టిగొంది
నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు. ఆ మాంసాన్ని రెండు గ్రామాల్లో విక్రయించిన ఘటన బుధవారం తాజాగా వెలుగు చూసింది.
వెలుగొండ ఆనకట్ట ఆవాసం..: వెలుగొండ ప్రాజెక్ట్ కాకర్ల ఆనకట్ట సమీపంలోని మొట్టిగొంది మునక ప్రాంతం వేటగాళ్లకు ఆవాసంగా మారింది. ఇక్కడి వ్యవసాయ పొలాల్లో ఉన్న 11 కేవీ విద్యుత్తు పరివర్తకాల త్రీపేజ్ సరఫరాతో విద్యుత్తు కంచెలను ఏర్పాటు చేసి తాగునీటి కోసం పంట పొలాల వైపు వచ్చే మూగజీవాలను మట్టుబెడుతున్నారు. తాజాగా సోమవారం రాత్రి కాకర్లకు చెందిన కొందరూ వేటగాళ్లు మొట్టిగొంది సమీపంలో విద్యుత్తు కంచె ఏర్పాటు చేసి రెండు చుక్కల దుప్పులను చంపారు. అక్కడే మాంసం తయారు చేసి కాకర్ల, నాగులవరం గ్రామాల్లో మంగళవారం ఉదయం కిలో రూ.400తో గోప్యంగా విక్రయించారు. మాంసం విక్రయిస్తున్నారన్న సమాచారం తెలియడంతో కొందరూ ద్విచక్రవాహనాలపై మొట్టిగొంది ప్రాంతానికి వెళ్లినట్టు సమాచారం. గత నెలలో కూడా ఇదే తరహాలో దుప్పి మాంసం మొట్టిగొంది పొలాల్లోనే విక్రయించినట్లు కూడా సమాచారం.
నాగులవరం విద్యుత్తు ఉపకేంద్రం
విద్యుత్తు సిబ్బంది సహకారంతో..: వన్య ప్రాణుల వేటగాళ్లకు నాగులవరం విద్యుత్తు ఉపకేంద్రంలో పనిచేసే సిబ్బంది సహకారంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపకేంద్రం పరిధి గ్రామాల్లో తొమ్మిది గంటల త్రీపేజ్ విద్యుత్తు పగటి పూట మాత్రమే ఇస్తున్నారు. కానీ సోమవారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జాము వరకు రెండు పీడర్లలో త్రీపేజ్ విద్యుత్తు సరఫరా ఉందని రైతులు అంటున్నారు. అయితే వన్య ప్రాణులను విద్యుత్తుతో చంపాలంటే త్రీపేజ్ సరఫరా అవసరం. ఈ నేపథ్యంలో మొట్టిగొందిలో సోమవారం రాత్రి రెండు దుప్పులను చంపిన ఉదంతంలో అనుమతి లేకుండా త్రీపేజ్ కరెంటు రాత్రంతా ఇవ్వడంలో ఉపకేంద్రం సిబ్బంది పాత్రపై అనుమానం తలెత్తుతుంది. దీనిపై విద్యుత్తుశాఖ అధికారులు సైతం రికార్డుల్లో సోమవారం రాత్రి త్రీపేజ్ విద్యుత్తు ఇచ్చినట్లు లేదని..ఎమ్ఆరై నివేదికల్లో చూడాలంటూ మాట దాటవేశారు. నాగులవరం బీటు పరిధి అటవీశాఖ అధికారులు దీనిపై నోరెత్తకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బానిస పోలీసులపై వేటు
[ 01-05-2024]
పోలీసు శాఖ నుంచి వేతనం తీసుకుంటున్న కానిస్టేబుల్ ఒకరు అధికార పార్టీకి చెందిన యువనేతకు ప్రైవేట్ వ్యక్తిగత అంగరక్షకుడిలా మారారు. మరొకరు ఏళ్ల తరబడి స్టేషన్ ముఖం చూడకుండానే వ్యక్తిగత సేవలో తరిస్తున్నారు. -
భరోసాల తెదేపా... ప్రలోభాల వైకాపా
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గెలుపే ధ్యేయంగా నాయక గణం ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. -
దుకాణాల మూత.. అక్రమంగా చేరవేత
[ 01-05-2024]
ఎన్నికల వేళ అధికార వైకాపా బరితెగించింది. ఓటర్లను మద్యం మత్తులో ముంచి లబ్ధి పొందే కుటిల యత్నాలకు తెర లేపింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాము నియమించిన సిబ్బందిని వినియోగించుకుని ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమంగా నిల్వ చేసింది. -
మీకంటే రౌడీషీటర్లు నయం
[ 01-05-2024]
‘ఎన్నికల ప్రక్రియలో మీరు ఘోరంగా విఫలమవుతున్నారు. నామినేషన్ల వేళే మీ సామర్థ్యం ఏంటో తెలిసింది. వంద మీటర్ల పరిధి దాటకుండా పార్టీల కార్యకర్తల్ని అడ్డుకోలేకపోయారు. మీతో పోల్చుకుంటే గ్రామాల్లో రౌడీషీటర్లే ప్రజలను నియంత్రిస్తున్నారు. -
ఉపాధి హరీ.. శ్రమజీవికి ఉరి
[ 01-05-2024]
శ్రమను పెట్టుబడిగా..స్వేదాన్ని ఇంధనంగా మార్చి పారిశ్రామిక వెలుగులు పూయించిన కార్మిక వర్గం నేడు చీకట్లో మగ్గుతోంది. తెదేపా హయాంలో మద్దిపాడు గ్రోత్ సెంటర్..గెలాక్సీపురిలో గ్రానైట్ యూనిట్లు..మార్కాపురంలో పలకల పరిశ్రమలు శ్రమజీవులతో కళకళలాడేవి. -
ప్రాజెక్టులు, పాత హామీల దాటవేత
[ 01-05-2024]
అసలే వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గం..దానికితోడు గత అయిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం టంగుటూరులో ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు. -
ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ పన్నాగాలు
[ 01-05-2024]
ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడుకునేందుకు సమర్థులకు మద్దతుగా నిలవాలని తెదేపా హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కోరారు. మర్రిపూడిలో మంగళవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. -
రాష్ట్రంలో ఒంగోలు నుంచే మార్పు మొదలు
[ 01-05-2024]
‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా గాలి వీచినా.. ఉమ్మడి ప్రకాశంలో తెదేపా నెగ్గింది. మీరంతా కలిసి పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి పార్టీకి నాలుగు స్థానాలిచ్చారు. ఒంగోలు మహానాడు విజయవంతం నుంచి యువగళం పాదయాత్ర వరకు అన్నింటా అండగా నిలిచారు. -
నిలువునా ఎండిన ఉద్యాన తోటలు
[ 01-05-2024]
చినుకు జాడ లేదు.. అడుగంటిన భూగర్భ జలం.. ఫలితంగా బోరు బావుల్లో నీళ్లు లేక ఉద్యాన తోటలు నిలువెల్లా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు.