logo

‘కావాలనే తప్పుడు కేసులతో వేధింపులు’

ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీపై భాజపా ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా విజ్ఞాన్‌

Published : 24 Jun 2022 03:18 IST

కరపత్రాలను పంపిణీ చేస్తున్న డీసీసీ అధ్యక్షురాలు సత్యవతి, చిత్రంలో కాంగ్రెస్‌ నాయకులు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీపై భాజపా ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గాంధీ కుటుంబాన్ని మాత్రం ఈడీను అడ్డం పెట్టుకుని కావాలనే తప్పుడు కేసులతో వేధిస్తున్నారని చెప్పారు. అనంతరం సత్యమేవ జయతే కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. సమావేశంలో డీసీసీ నాయకులు అన్నాజీరావు, గోవింద మల్లిబాబు, కృష్ణారావు, నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని