logo

దివ్యాంగుల రాష్ట్ర క్రికెట్‌ జట్టు ఎంపిక

ఆంధ్రప్రదేశ్‌ దివ్యాంగుల రాష్ట్ర క్రికెట్‌ జట్టును ఎంపిక చేసినట్లు ఏపీడీసీఏ కార్యదర్శి, భారత దివ్యాంగుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ వై.వసంతకుమార్‌ పేర్కొన్నారు. తిరుపతి హోటల్‌ భీమాస్‌ రెసిడెన్సీలో సోమవారం ఏపీడీసీఏ అధ్యక్షుడు భీమాస్‌ అశోక్‌ రాష్ట్ర జట్టును ప్రకటించారు

Published : 28 Jun 2022 06:32 IST

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ దివ్యాంగుల రాష్ట్ర క్రికెట్‌ జట్టును ఎంపిక చేసినట్లు ఏపీడీసీఏ కార్యదర్శి, భారత దివ్యాంగుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ వై.వసంతకుమార్‌ పేర్కొన్నారు. తిరుపతి హోటల్‌ భీమాస్‌ రెసిడెన్సీలో సోమవారం ఏపీడీసీఏ అధ్యక్షుడు భీమాస్‌ అశోక్‌ రాష్ట్ర జట్టును ప్రకటించారు. కెప్టెన్‌గా వి.చిన్నమునుస్వామిరెడ్డి(నెల్లూరు), వైస్‌ కెప్టెన్‌గా శివకోటి(కడప)ని ఎంపిక చేశారు. జట్టు సభ్యులుగా అన్వేష్‌, బాలాజీబాబు(నెల్లూరు), బాలాజీ(కడప), కె.ఎస్‌.ఆర్‌.కె.రెడ్డి, కిర్తీరాజు(పశ్చిమ గోదావరి), ఈశ్వర్‌(విజయనగరం), అంజి నాయుడు, నరేష్‌, నాగరాజు, ఎం.బాలకృష్ణ, పి.మునిశేఖర్‌(చిత్తూరు), గణేష్‌(కృష్ణా), వేణు(అనంతపురం), మోహన్‌, ఎస్‌.కె.అబ్దుల్‌ సలీం, ఆర్‌.తులసీకృష్ణ, ఎస్‌.అభిబుల్లా(తిరుపతి), బాబులా దాస్‌(శ్రీకాకుళం) ఎంపికైనట్లు తెలిపారు. జట్టు ఆగస్టు 7 నుంచి 16వరకు విజయవాడలో జరగనున్న 3వ జాతీయ టీ-20 ఛాలెంజ్డ్‌ ఛాంపియన్‌షిప్‌- 2022 టోర్నీలో పాల్గొంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని