తెదేపాలోకి జోరుగా చేరికలు
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి.
కోటబొమ్మాళి: అచ్చెన్న సమక్షంలో పార్టీలో చేరిన రైతుపురం వైకాపా శ్రేణులు
ఆమదాలవలస పట్టణం, కోటబొమ్మాళి, న్యూస్టుడే: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఆమదాలవలస పురపాలిక పరిధిలోని లక్ష్ముడుపేటకు చెందిన 10 కుటుంబాలు శుక్రవారం వైకాపాను వీడి తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు వేసి తెదేపాలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఆర్థిక సమతుల్యతతో కూడిన పాలన అందిస్తుందన్నారు. తెదేపా, భాజపా, జనసేన కూటమిని ఆదరించి రాష్ట్రంలోని అరాచక పాలన తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తమ్మినేని విద్యాసాగర్, సంపతిరావు మురళి, నూక రాజు, సనపల ఢిల్లేశ్వరావు, బొర గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ్ర తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో నందిగాం మండలం సైలాడ పంచాయతీ రౌతుపురానికి చెందిన 25 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలోకి చేరాయి. గ్రామానికి చెందిన వెంకటేష్, వెంకటమణ, కోదండ, కృష్ణారావు, చిన్నారావు, శంకరరావు తదితర కుటుంబాలు కోటబొమ్మాళి పార్టీ కార్యాలయంలో తెదేపా తీర్థం పుచ్చుకోవడంతో అచ్చెన్న వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ నందిగాం మండల అధ్యక్షుడు అజయ్కుమార్ తదితరులు ఉన్నారు. ్ర కోటబొమ్మాళి మేజర్ పంచాయతీకి చెందిన వైకాపా శ్రేణులు దేవాది రాజు, లచ్చయ్య తదితరులు కూడా అచ్చెన్న సమక్షంలో తెదేపాలోకి చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్, మాజీ సర్పంచి దేవాది సింహాద్రి ఉన్నారు.
తెదేపాలో చేరిన వారితో కూన రవికుమార్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న మాయ‘దారి’ పాలన..!
[ 29-04-2024]
వైకాపా పాలకులు అయిదేళ్ల పాటు కళ్లకు గంతలు కట్టుకున్నారేమో.. అందుకే రోడ్లపై అడుగడుగునా ఏర్పడిన గుంతలు వారికి కనిపించలేదు. పల్లెదారులు రాళ్లు తేలినా పట్టించుకోలేదు. -
తెదేపాలోకి వరం కుటుంబం
[ 29-04-2024]
-
ఐదేళ్లలో జిల్లాకు ఏం చేశారు..
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లాకు ఏం చేసిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. టెక్కలి ఇందిరా కూడలిలో ఆదివారం నిర్వహించిన న్యాయయాత్ర సభలో ఆమె మాట్లాడారు. -
పచ్చదనం గాలికొదిలేశారు.. ప్రజాధనం వృథా చేశారు..!
[ 29-04-2024]
జగనన్న ఏలుబడిలో మొక్కలకూ రక్షణ కరవైంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘జగనన్న హరిత నగరాలు-గ్రీన్ సీటీ ఛాలెంజ్’ కార్యక్రమం ఆదిలోనే తుస్సుమంది. -
ఉద్దానం రైతులను ఏం ఉద్ధరించారు..
[ 29-04-2024]
ఉద్దానం ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది పలాస ప్రాంతం. ఉద్యాన పంటలకు పేరు పొందిన ఈ ప్రాంతంలో వర్షాభావంతో రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. -
తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు
[ 29-04-2024]
జి.సిగడాం మండలంలో వైకాపాకు కంచుకోటగా ఉన్న వాండ్రంగి గ్రామంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. -
మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్
[ 29-04-2024]
జిల్లాలోని మాజీ సైనికోద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మెహన్నాయుడు ప్రకటించారు. -
సీఎం సభలో విద్యుత్తు స్తంభాలు పడి ఇద్దరికి గాయాలు
[ 29-04-2024]
ఈ నెల 24న టెక్కలి సమీపంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో లైటింగ్ పోల్స్ మీద పడి ఇద్దరు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
పిల్లల చదువులపై పక్షపాతమెందుకు..?
[ 29-04-2024]
విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, పాఠశాల భవనాలను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నాడు- నేడు పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది. -
అడ్డదారిలో అద్దెకు..!
[ 29-04-2024]
కాశీబుగ్గ నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే స్థలమది. గతంలో గ్రామ పరిపాలనాధికారుల (వీఆర్వో) సంఘానికి కేటాయించారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్