VK Sasikala: మళ్లీ అన్నాడీఎంకేలోకి చిన్నమ్మ?
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే వరుస ఓటములు ఎదుర్కొంది. ఇందుకు కారణం పార్టీలో నెలకొన్న వర్గపోరే అని పార్టీ కార్యకర్తలు...
పన్నీర్సెల్వం సమక్షంలో తీర్మానం
పార్టీలో అనూహ్య పరిణామాలు
సైదాపేట, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే వరుస ఓటములు ఎదుర్కొంది. ఇందుకు కారణం పార్టీలో నెలకొన్న వర్గపోరే అని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఓపీఎస్, ఈపీఎస్ ద్వంద్వ నాయకత్వంతో ఇకపై లాభం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎడప్పాడి పళనిస్వామికి ఎక్కువగా పలుకుబడి ఉండే కొంగు మండలం, పన్నీర్సెల్వానికి పలుకుబడి ఉండే దక్షిణ మండలాల్లోనూ అన్నాడీఎంకేకు ఊహించని ఓటమి ఎదురైంది. దీంతో నాయకత్వాన్ని మార్చాలన్న డిమాండ్ అధికమైంది. అదికూడా జయలలితకు నీడలా వ్యవహరించిన శశికళే పార్టీకి నేతృత్వం వహించాలని దక్షిణ మండల అన్నాడీఎంకే వర్గాలు మాట్లాడుతున్నారు. ఇందుకు ఓపీఎస్ కూడా అంగీకరిస్తారని కొన్ని రోజులుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుకోని మలుపు అన్నాడీఎంకేలో చోటు చేసుకుంది. తేని జిల్లా పెరియకుళం కైలాసపట్టిలోని అన్నాడీఎంకే సమన్వయకర్త ఓ.పన్నీర్ సెల్వానికి సొంతమైన ఫామ్ హౌస్లో బుధవారం సమావేశం జరిగింది. ఇందులో తేని జిల్లా అన్నాడీఎంకే ముఖ్య నిర్వాహకులు అనేక మంది పాల్గొన్నారు.
శశికళ చేరికపై అధిష్టానానికి తీర్మానం
పన్నీర్ సెల్వంతో పార్టీ నిర్వాహకులు ఎన్నికల్లో ఓటమి గురించి చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ ఓటమికి వర్గపోరే కారణమని నిర్వాహకులు ఓపీఎస్ ఎదుట ఆరోపించినట్లు సమాచారం. అన్నాడీఎంకే, ఏఎంఎంకే, శశికళ ఒక్కటయితే తప్ప అన్నాడీఎంకే విజయం సాధించటం సాధ్యం కాదని నిర్వాహకులు, కార్యకర్తలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 5వ తేదీ శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకోవటం గురించి తీర్మానం ఆమోదించి పార్టీ అధిష్టానానికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తేని జిల్లాలో తీసుకున్న నిర్ణయం లాగానే మిగతా జిల్లాల్లో కూడా తీర్మానం ఆమోదిస్తారని తెలుస్తోంది. ప్రారంభం నుంచే శశికళను పార్టీలోకి చేర్చుకోవాలనే అభిప్రాయంలోనే ఓపీఎస్ ఉన్నారు. పార్టీ వ్యవహారాల్లో ఎడప్పాడి పళనిస్వామిది పైచేయిగా ఉండటంతో ఓపీఎస్ వ్యాఖ్యలు సద్దుమణిగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. స్థానిక ఓటమి నేపథ్యంలో ఎడప్పాడి వర్గం కొన్ని రోజులుగా మౌనం వహిస్తోంది. తేని జిల్లాలో తీసుకున్న నిర్ణయంపై ఎడప్పాడి వర్గం ఎలా స్పందిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఓపీఎస్ సమక్షంలో ఆమోదించిన తీర్మానంతో అన్నాడీఎంకేలో అంతర్గత రాజకీయాలు మళ్లీ వేడెక్కడం ప్రారంభించాయి.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ గురువారం పన్నీర్సెల్వంతో సమావేశమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీరు అందించనున్న తిరునిండ్రవూరు చెరువు
[ 06-05-2024]
స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండు చేస్తున్న ఆవడి వాసులకు జలమండలి విభాగం శుభవార్త చెప్పింది. తిరునిండ్రవూరు చెరువు నీటిని తాగునీరుగా శుద్ధి చేసి ఆవడి కార్పొరేషన్, చెన్నైకి పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. -
పోలండ్ యువతిని పెళ్లాడిన కృష్ణగిరి యువకుడు
[ 06-05-2024]
కృష్ణగిరి జిల్లా వేప్పన్హళ్లి సమీపం కురియనప్పళ్లి గ్రామానికి చెందిన తిమ్మప్ప, పద్మమ్మ కుమారుడు రమేష్ (33) ఉన్నత విద్య కోసం పోలండ్ వెళ్లాడు. -
ఒకే పాఠశాల పేరుతో రెండు నీట్ కేంద్రాలు
[ 06-05-2024]
తంజావూర్, కుంభకోణంలో ఒకే పేరుతో రెండు పరీక్ష కేంద్రాలు ఉండటంతో గందరగోళానికి గురైన విద్యార్థిని పరీక్ష రాయలేక వెనుదిరిగింది. తంజావూర్ జిల్లాలో తామరై ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో తంజావూర్, కుంభకోణంలో రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. -
‘విలేజ్ కుకింగ్’ తాత ఆరోగ్యంపై రాహుల్గాంధీ ఆరా
[ 06-05-2024]
విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ తాత పెరియతంబి ఆరోగ్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు సమాచారం. విలేజ్ కుకింగ్ ఛానల్కు 22 మిలియన్ చందాదారులు ఉన్నారు. -
వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు
[ 06-05-2024]
వర్షం కోసం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తమిళనాడు తౌహీద్ జమాత్ కాంచీపురం జిల్లా శాఖ తరపున ఆదివారం కాంచీపురం వలి ముహమ్మద్పేటలోని మున్సిపల్ కార్పొరేషన్ మిడిల్ పాఠశాల ప్రాంగణంలో సుమారు 500 మందికిపైగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
కాలుష్యం.. కాస్త నయం!
[ 06-05-2024]
వాహనాలు, పరిశ్రమలు, అభివృద్ధి పనులు.. నగరవ్యాప్తంగా కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ఈ ఇక్కట్లు చెన్నై వాసులు నిత్యం అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చి చూస్తే చెన్నై కొంత నయమన్నట్లుగానే ఉందనే భావన కలుగుతోంది. -
ముగిసిన జయకుమార్ అంత్యక్రియలు
[ 06-05-2024]
అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కాంగ్రెస్ నెల్లై తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ అంత్యక్రియలు సొంతూరు కరైసుత్తుపుదూరులో ఆదివారం జరిగాయి. -
పోలీసుశాఖ వెబ్సైట్ హ్యాక్
[ 06-05-2024]
తమిళనాడు పోలీసుశాఖ వెబ్సైట్ హ్యాక్ అయింది. ఈ విషయమై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు పోలీసులు నిందితులు, ఫిర్యాదుల డేటా నిల్వ చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. -
ప్రదీప్ రంగనాథన్ చిత్రానికి డ్రాగన్గా టైటిల్
[ 06-05-2024]
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఏజీఎస్ సంస్థ గత నెల యూట్యూబ్లో విడుదల చేసింది. -
రాష్ట్రానికి భారీ వర్ష సూచన
[ 06-05-2024]
రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఆదివారం వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... -
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
[ 06-05-2024]
మద్యం మత్తులో దాడిచేసిన కుమారుడిపై తల్లి, అతని పెద్దమ్మ మరిగిన నూనె పోసి హతమార్చారు. పోలీసుల కథనం మేరకు.. తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపం తెన్నాంగూర్ గ్రామానికి చెందిన సురేష్ (35) మద్యానికి బానిసయ్యాడు.
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్