దళిత హక్కులపై సినిమాలు నిర్మించాలి
ప్రస్తుతం దళిత హక్కుల గురించి మాట్లాడే సినిమాలను నిర్మించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.రాజు రాసిన ‘ది దళిత్ ట్రూత్’ ఆంగ్ల పుస్తకాన్ని చెన్నై పెరియార్ గ్రౌండ్లో మంగళవారం సాయంత్రం ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు వంటివి ఏ మేరకు నెరవేరాయనే
సీఎం స్టాలిన్ సూచన
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి, తదితరులు
చెన్నై, న్యూస్టుడే: ప్రస్తుతం దళిత హక్కుల గురించి మాట్లాడే సినిమాలను నిర్మించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.రాజు రాసిన ‘ది దళిత్ ట్రూత్’ ఆంగ్ల పుస్తకాన్ని చెన్నై పెరియార్ గ్రౌండ్లో మంగళవారం సాయంత్రం ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు వంటివి ఏ మేరకు నెరవేరాయనే విషయాన్ని అధ్యయనం చేసి పుస్తకంలో పొందుపరిచారని పేర్కొన్నారు. విద్యావేత్తలు, యువ రాజకీయ నేతలు, ఉత్తమ నిర్వాహకులు, పరిశోధకులు, సామాజిక స్పృహకలిగిన సినిమా దర్శకులు తదితర 13 మంది వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయని తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎస్సీ, ఎస్టీ ప్రజల సామాజిక న్యాయం కోసం డీఎంకే పోరాడుతోందని పేర్కొన్నారు. భారతదేశంలో దళిత్ సినిమా అనే వ్యాసంలో సామాజిక ఆధిక్యతకు వ్యతిరేకంగా ద్రావిడ ఉద్యమ సినిమాలు ఉన్నాయంటూ సినీ దర్శకుడు రంజిత్ ఉటంకించారని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి, విప్లవ ప్రగతిశీల భావజాలాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు సినిమా రంగం ఓ సాధనంగా ఉపయోగపడిందని పేర్కొన్నారు. కలైజ్ఞర్ కరుణానిధి వారపత్రికకు రాసిన ‘ఒరే రత్తం’ ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో బానిసత్వానికి వ్యతిరేకంగా ‘నందకుమార్’ పాత్రలో నటించానని గుర్తు చేసుకున్నారు. తన తనయుడు ఉదయనిధి నటించిన ‘నెంజుక్కు నీది’ చిత్రం 20న విడుదల కానుందని తెలిపారు. ఆ చిత్రం దళితులకు జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా ఉంటుందని పేర్కొన్నారు. అందరూ రాజ్యాంగాన్ని అనుసరించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేఎన్ నెహ్రూ, శేఖర్బాబు, టీఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, సీఎల్పీ నేత సెల్వపెరుందగై, సీపీఐ ప్రధానకార్యదర్శి డి.రాజా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్, వీసీకే శాసనసభపక్ష నేత చిందనైసెల్వన్, ఎండీఎంకే కార్యదర్శి దురై వైగో, ద్రావిడర్ కళగం ఉపాధ్యక్షుడు కలి.పూంగుండ్రన్, తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం ప్రధానకార్యదర్శి అబ్దుల్ సమద్, గ్రేటర్ చెన్నై మేయర్ ప్రియ తదితరులు పాల్గొన్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ప్రోత్సాహంతో అత్యుత్తమ విజయం
[ 05-05-2024]
ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించింది ఆ యువతి. తల్లి ప్రోత్సాహం అండగా నిలిచింది. ప్రజా గ్రంథాలయం తోడ్పాటు అందించింది. -
కాంగ్రెస్ నాయకుడి అనుమానాస్పద మృతి
[ 05-05-2024]
కాంగ్రెస్ జిల్లా నాయకుడి అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు కేపీకే జయకుమార్ ధనసింగ్(60) స్థానిక దిసయన్విలైలో నివాసం ఉంటున్నారు. -
పుదుచ్చేరిలో వడగాల్పులు
[ 05-05-2024]
పుదుచ్చేరిలో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వడగాల్పులతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. -
నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
[ 05-05-2024]
సముద్రంలో 1.8 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడుతుండటంతో కన్నియాకుమరి, తూత్తుక్కుడి, తిరునెల్వేలి, రామనాథపురం జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. -
చేపలవేట నిషేధకాలంలో ఆర్థికసాయం పెంచాలి
[ 05-05-2024]
చేపలవేట నిషేధ కాలంలో ఆర్థికసాయం పెంచి ఇవ్వాలని పుదుచ్చేరి అన్నాడీఎంకే కార్యదర్శి అన్బళగన్ కోరారు. శనివారం ముఖ్యమంత్రి రంగసామిని కలిసి వినతిపత్రం అందించారు. -
రసవాతి ఫస్ట్ సింగిల్ విడుదల
[ 05-05-2024]
శాంతకుమార్ దర్శకత్వంలో అర్జున్దాస్, తన్యా రవిచంద్రన్ జంటగా రూపొందిన చిత్రం ‘రసవాతి’. రమ్యా సుబ్రమణియన్, జి.ఎం.సుందర్, సుజిత్ శంకర్, రేష్మా వెంకటేశ్, సుజాత, రిషికాంత్ తదితరులు ఇతర తారాగణం. -
బడిబాట పట్టాల్సిందే!
[ 05-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బడి మానేయకుండా చూడటానికి విద్యాశాఖ కొత్త ప్రయత్నం ప్రారంభిస్తోంది. 70వేల మంది వరకు బడి మానేశారని, ఇంకా 3 లక్షల మేరకు అదే జాబితాలో చేరే అవకాశాలున్నట్లు విద్యాశాఖ చేపట్టిన సర్వేలో తేలింది. -
నాకు సంబంధం లేదు
[ 05-05-2024]
అనుమానాస్పద స్థితిలో మరణించిన కాంగ్రెస్ పార్టీ తిరునెల్వేలి తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మరణంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని తిరునెల్వేలి జిల్లా నాంగునేరి కాంగ్రెస్ శాసనసభ్యుడు రూబి మనోహరన్ పేర్కొన్నారు. -
పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ
[ 05-05-2024]
ఈసీఆర్ రోడ్డులోని ‘తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఆధ్వర్యంలో నడుస్తున్న ముట్టుక్కాడులో పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త డబుల్ డెక్కర్ ఫ్లోటింగ్ రెస్టారెంట్(నీటిలో తేలియాడే)అందుబాటులోకి రానుంది.