రామనాథ స్వామి సేవలో జపాన్ భక్తులు
జపాన్కు చెందిన హిందూ సమయం భక్తుడు మసాా(60) మెడికల్ సైన్సులో డిగ్రీ పొందాడు. గత 20 ఏళ్లుగా హిందూ మతం, హిందూ దైవాల గురించి ప్రచారం చేస్తున్నారు.
దర్శనం చేసుకొంటున్న విదేశీయులు
వేలచ్చేరి, న్యూస్టుడే: జపాన్కు చెందిన హిందూ సమయం భక్తుడు మసాహి(60) మెడికల్ సైన్సులో డిగ్రీ పొందాడు. గత 20 ఏళ్లుగా హిందూ మతం, హిందూ దైవాల గురించి ప్రచారం చేస్తున్నారు. మసాహి నేతృతంలో 18 మంది మహిళలతో సహా 37 మంది జపాన్ దేశస్థులు తమిళనాడులోని అనేక ఆలయాలను దర్శిస్తున్నారు. బుధవారం రామనాధపురం జిల్లా రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని జపాన్ భక్తులు ఆలయంలోని తీర్థాల్లో స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో సెంగోల్ను చేత పట్టుకొని స్వామి సన్నిధిని ప్రదక్షిణగా చుట్టి వచ్చారు. ఆలయ పూజారులు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మసాహి మాట్లాడుతూ, దేవుడు ఒక్కడే అనేది మా నమ్మకం. కాని దేవుళ్ల పేర్లు, పూజా పద్ధతులు వేరైనప్పటికీ భారత దేశంలో దైవ భక్తి ఎక్కువ అని నమ్ముతున్నాము. ఈ కారణంగా తాను గత 20 ఏళ్లుగా రామేశ్వరంలో గల రామనాథస్వామి ఆలయానికి వచ్చిన అనుభవం ఉందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ ఉద్యోగంవారికి కలే!
[ 08-05-2024]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లవుతోంది. అన్ని ప్రాంతాలకు చదువు, అభివృద్ధి చేరుతున్నాయిగానీ.. తమిళనాడులోని పళియర్ తెగ ప్రజలకు మాత్రం అవి ఇప్పటికీ కలగానే ఉన్నాయి. వారికి ప్రభుత్వ ఉద్యోగం అంటేనే పెద్దగా అవగాహనలేదు. -
పిరందనాళ్ వళ్తుక్కళ్ ఫస్ట్లుక్ విడుదల
[ 08-05-2024]
సుశీంద్రన్ దర్శకత్వంలోని ‘వెణ్ణిలా కబడ్డీ కుళు’ చిత్రం ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు శివబాలన్ అలియాస్ అప్పుకుట్టి. -
రాష్ట్ర ప్రయోజనాలకు శ్రమిస్తా: స్టాలిన్
[ 08-05-2024]
దేశానికి, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా శ్రమిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. -
ముఖ్యమంత్రితో విద్యార్థులు
[ 08-05-2024]
రాష్ట్రంలో సోమవారం విడుదలైన 12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన నగరానికి చెందిన ట్రాన్స్జెండర్ నివేద, నాంగునేరిలో కులవివక్షకు గురైన చిన్నదురై మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిశారు. -
దర్యాప్తునకు నటి గౌతమి హాజరు
[ 08-05-2024]
స్థల మోసం ఫిర్యాదుపై నటి గౌతమి వద్ద రామనాథపురం పోలీసులు దర్యాప్తు చేశారు. -
ఆత్మహత్యలు అడ్డుకునేందుకు ట్రాక్టర్ల అందజేత
[ 08-05-2024]
అప్పుల బాధ భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడటాన్ని అడ్డుకోవడానికే ట్రాక్టర్లు అందిస్తున్నట్లు ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. -
అర్ధరాత్రి నుంచి అమల్లోకి ఈ-పాస్ విధానం
[ 08-05-2024]
పాఠశాలలకు వేసవి సెలవులు కావడం, ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రాష్ట్రంలోని ప్రముఖ చల్లని పర్యాటక ప్రాంతాలైన ఊటీ, కొడైకెనాల్కు పర్యాటకులు వరుసకట్టారు. -
జయకుమార్ లేఖలో అంశాలు అవాస్తవం
[ 08-05-2024]
తిరునెల్వేలి తూర్పు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. -
పోలీసులు స్వతంత్రంగా పనిచేస్తే నిందితులను గంటలో గుర్తిస్తారు
[ 08-05-2024]
తిరునెల్వేలి కాంగ్రెస్ అధ్యక్షుడిది హత్యా లేదా ఆత్మహత్య అని ఇంకా తేలలేదని మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ అన్నారు.