Vijay: త్వరలో నటుడు విజయ్ కొత్తపార్టీ?
ప్రముఖ నటుడు విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ చిత్రసీమలో నటనతో ప్రజలు, అభిమాన సంఘాలను ఆకట్టుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు.
వేలచ్చేరి, న్యూస్టుడే: ప్రముఖ నటుడు విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ చిత్రసీమలో నటనతో ప్రజలు, అభిమాన సంఘాలను ఆకట్టుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 10, 12 తరగతుల్లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గతేడాది జూన్లో నీలాంగరైలో ప్రశంసాపత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందించారు. విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ తరఫున గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలలు ప్రారంభించారు. గ్రంథాలయాలను ప్రారంభించారు. గతేడాది చెన్నైను మిగ్జాం తుపాను ముంచెత్తడంతో బాధిత ప్రజలకు సంక్షేమ సాయాలు అందించారు. ఈ నేపథ్యంలో గురువారం చెన్నై సమీప పనయూర్లోని తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో సంప్రదింపులు సమావేశం నిర్వహించారు. చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీ ప్రారంభించాలని సమావేశంలో పలువురు డిమాండు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలపై విజయ్ చర్చించినట్లు సమాచారం. మరో నెలరోజుల్లో కొత్తపార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతివ్వాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశలపై మరోసారి నిర్వాహకులతో సంప్రదింపులు జరపనున్నట్లు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంగ నాన్తాన్ కింగు ట్రైలర్ విడుదల
[ 28-04-2024]
ఆనంద్ నారాయణన్ దర్శకత్వంలో సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. ప్రియాలయ, మనోబాలా, తంబి రామయ్య, మునీశ్కాంత్, బాల శరవణన్ తదితరులు ఇతర తారాగణం. -
తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలి
[ 28-04-2024]
వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. -
రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు కేసు చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు
[ 28-04-2024]
బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు దాడి వ్యవహారానికి సంబంధించి చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో గత నెల బాంబు పేలుడు సంభవించింది. -
కరవులో ఆదుకోనున్న క్వారీలు
[ 28-04-2024]
చెంగల్పట్టు జిల్లా పరిధిలోని గ్రామాలకు వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా రాళ్ల క్వారీల నుంచి నీటిని సేకరించేందుకు చెంగల్పట్టు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. -
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు
[ 28-04-2024]
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి అన్యాయం
[ 28-04-2024]
కేంద్రంలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ తమిళనాడుకు నిధులు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు. -
స్పీడ్ పోస్ట్ ద్వారా 2.5 లక్షల ఎల్ఎల్ఆర్లు
[ 28-04-2024]
‘లెర్నర్స్ లైసెన్స్’ (ఎల్ఎల్ఆర్), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను స్పీడ్ పోస్టు ద్వారా పంపడంలో విజయం సాధించినట్టు ‘ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ సేఫ్టీ’ విభాగం పేర్కొంది. -
శ్రీవారిని దర్శించుకున్న దుర్గా స్టాలిన్
[ 28-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల వేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. -
నిరంతర కృషితో ఉన్నత పదవులకు..
[ 28-04-2024]
టీఎన్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో తిరుప్పూర్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగినులు ఉత్తీర్ణత సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!