మీనాక్షి అమ్మవారి కరుణ ఎవరికో?
వైగై నది ప్రహించే నగరం.. పాండ్యరాజుల రాజధాని ఉన్న నగరం.. తమిళ సంఘంతో భాషను అభివృద్ధి చేసిన ప్రాంతం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నగరం మదురై. జల్లికట్టుకు పేరొందింది.
మదురై మీనాక్షి దేవాలయం
ప్యారిస్, న్యూస్టుడే: వైగై నది ప్రహించే నగరం.. పాండ్యరాజుల రాజధాని ఉన్న నగరం.. తమిళ సంఘంతో భాషను అభివృద్ధి చేసిన ప్రాంతం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నగరం మదురై. జల్లికట్టుకు పేరొందింది. మీనాక్షి సుందరేశ్వరర్, అళగర్ తదితర ప్రసిద్ధ చెందిన ఆలయాలు ఉన్నాయి. రాష్ట్రంలో చెన్నై తర్వాత రెండో అతిపెద్దది. రాజకీయపరంగా ప్రముఖమైదని. తమ బలాన్ని నిరూపించుకునేందుకు రాజకీయ పార్టీలు మహాసభలు, సమావేశాలకు మదురైనే ఎంచుకుంటారు. అప్పట్లో గ్రామాలతో కూడిన నియోజకవర్గంగా ఉన్న మదురై లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పెద్ద నగరాలు ఉన్న స్థానంగా మారింది. మదురైలో విజయం పార్టీ బలోపేతానికి పునాదిలాంటిదని అన్ని పార్టీలు ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటాయి. ఒక్క పార్టీకే మద్దతివ్వకుండా రాజకీయ పరిణామాలకు తగ్గట్లు నేతలను ఇక్కడి ప్రజలు ఎన్నుకుంటారు.
మారుతున్న ఫలితాలు..
2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మేలూర్, మదురై ఈస్ట్, మదురై నార్త్, మదురై సౌత్, మదురై సెంట్రల్, మదురై వెస్ట్ తదితర నియోజకవర్గాలు స్థానం పొందాయి. పునర్విభజన తర్వాత 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి ఎంకే అళగిరి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో అన్నాడీఎంకే అభ్యర్థి గోపాలకృష్ణన్ విజయం సాధించగా 2019లో డీఎంకే కూటమి నుంచి బరిలో నిలిచిన సీపీఎం అభ్యర్థి సు.వెంకటేశన్ 1,39,395 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
సు.వెంకటేశన్, శరవణన్, రామ శీనివాసన్
పోటా పోటీగా ప్రచారం..
ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. డీఎంకే కూటమిలో సిట్టింగ్ ఎంపీ, సీపీఎం అభ్యర్థి సు.వెంకటేశన్, అన్నాడీఎంకే తరఫున శరవణన్, భాజపా అభ్యర్థి రామ శీనివాసన్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి సత్యాదేవి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సు. వెంకటేశన్కు మద్దతుగా సీపీఎం నేతలతోపాటు మంత్రులు మూర్తి, పళనివేల్ త్యాగరాజన్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి, ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్హాసన్ కూటమి పార్టీల నేతలు ప్రచారం చేసి ఆయనకు అదనపు బలాన్ని ఇచ్చారు. అన్నాడీఎంకే అభ్యర్థి డాక్టర్ శరవణన్ కోసం మాజీ మంత్రి సెల్లూర్రాజుతో పాటు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. డాక్టర్ శరవణన్ సినిమాల్లో నటించడంతో పాటు నిర్మించడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు మద్దతుగా ఓట్లు సేకరిస్తున్నారు. భాజపా అభ్యర్థి రామ. శీనివాసన్కి మద్దతుగా కేంద్రమంత్రి అమిత్ షా, టీటీవీ దినకరన్ తదితరులు ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఓట్లు తనకు వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి సత్యాదేవి పార్టీ నేతలతో తీవ్రంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
దీర్ఘకాలిక డిమాండ్లు..
పర్యాటకం, వైద్యం, వ్యవసాయం, ఆహార పదార్థాల తయారీ, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు, చేనేత, వర్తకం మొదలైనవి ముఖ్య వృత్తులుగా ఉన్నాయి. మదురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయిలో మెరుగుపరచడం, ఉపాధి పెంచే పెద్ద సంస్థలు, ఫ్యాక్టరీలు లేకపోవడం ఈ ప్రాంతం అభివృద్ధికి ఆటంకంగా ఉంది. విద్యావంతులైన యువత ఉపాధికి బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు తదితర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉంది. మదురైకి ప్రకటించిన ఎయిమ్స్ నిర్మాణం, మెట్రో రైలు, ఐటీ పార్క్ మొదలైనవి ఇంకా ఆచరణలోకి రాకపోవడం ఆ ప్రాంత ప్రజలను నిరాశకు గురిచేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
[ 29-04-2024]
నెల్లై జిల్లా కల్లిడైకురిచ్చికి చెందిన వేల్మురుగన్ టీ దుకాణం నడుపుతున్నాడు. ఇతని కుమారుడు పేచ్చి ఇటీవల విడుదలైన యూపీఎస్సీ పరీక్షల ఫలితాల్లో 567వ స్థానంలో నిలిచి ప్రతిభ కనబర్చాడు. -
వరాలిచ్చినా వనితల ఓటు పడలేదు!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తలపడిన మూడు ప్రధాన కూటములు ప్రత్యేకించి మహిళా ఓటర్ల మీద పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. -
గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదు
[ 29-04-2024]
రాష్ట్రానికి చెందిన భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదును ముఖ్యమంత్రి అందించారు. -
తాగునీటి సమస్య తలెత్తదు
[ 29-04-2024]
చెన్నై మహానగరంలో సెప్టెంబర్ వరకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెన్నై తాగునీటి బోర్డు తెలిపింది. -
ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలి
[ 29-04-2024]
ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పోలైన ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు. -
పనిలేక పస్తులు
[ 29-04-2024]
జాలర్లు సంద్రంలోకి వెళ్లి చేపలు పట్టడంపై ప్రస్తుతం ప్రభుత్వం నిషేధం విధించింది. -
విజయ్ పుట్టినరోజున గోట్ రెండో సింగిల్
[ 29-04-2024]
విజయ్ 68వ చిత్రంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) రూపొందుతున్న విషయం తెలిసిందే. -
ఐఎస్ఐ మద్దతుదారుడి అరెస్టుకు ప్రతీకారంగానే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర
[ 29-04-2024]
ఐఎస్ఐ మద్దతుదారుడిని అరెస్టు చేసినందుకే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిసింది. -
వాహనాలపై స్టిక్కర్లు అంటించడంపై నిషేధం
[ 29-04-2024]
ప్రజలు తమ వాహనాలపై మీడియా, పోలీసు, న్యాయశాఖ, ఆర్మీ అని పలు శాఖలు, సంస్థల పేర్లను అతికించడానికి గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్