ప్రతి ముగ్గురిలో ఒక్కరికి కోవిడ్
నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. 229 రోజుల తర్వాత గరిష్ఠ స్థాయిలో శుక్రవారం కేసులు నమోదయ్యాయి. గతేడాది మే 30న 1,035 కేసులు వచ్చాయి. గురువారంతో పోల్చితే కేసులు ఒక మాదిరిగా పెరిగాయి.
వన్టౌన్, న్యూస్టుడే: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. 229 రోజుల తర్వాత గరిష్ఠ స్థాయిలో శుక్రవారం కేసులు నమోదయ్యాయి. గతేడాది మే 30న 1,035 కేసులు వచ్చాయి. గురువారంతో పోల్చితే కేసులు ఒక మాదిరిగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3045 మందికి పరీక్షలు చేయగా 992 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పాజిటివిటీ రేటు ఏకంగా 32.58 శాతానికి పెరిగింది. పరీక్షలు చేయించుకున్న ప్రతీ ముగ్గురిలో ఒకరికి కొవిడ్ నిర్దరణ అవుతోంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆసుపత్రుల్లో 37 మంది ఐసీయూలో, 86 మంది ఆక్సిజన్ పడకలపై చికిత్స తీసుకుంటున్నారు. కొత్తగా వస్తున్న కేసుల్లో అత్యధికశాతం మందికి స్వల్ప లక్షణాలు ఉంటున్నాయి. ఇళ్ల వద్ద 3,535 మంది చికిత్స పొందుతున్నారు.
కలెక్టరేట్లో కలకలం: కలెక్టరేట్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు, అధికారులు కొవిడ్ బారిన పడ్డారు. కలెక్టర్ సహాయ సిబ్బందికి కరోనా నిర్దరణ కావడంతో వారంతా హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న కలెక్టరేట్లో జరగనున్న స్పందన కార్యక్రమం నిర్వహణపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.
నిబంధనలు పాటించడం మరవొద్దు: సీపీ
ఎం.వి.పి.కాలనీ, న్యూస్టుడే: కొవిడ్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని నగర పోలీసు కమిషనర్ మనీష్కుమార్ సిన్హా ఒక ప్రకటనలో కోరారు. విధిగా మాస్క్ను ధరించాలన్నారు. నగరవాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య: 1,58,514
చికిత్స పొందుతున్న వారు: 3658
మొత్తం మృతులు: 1,112
ఒకేరోజు 992 మందికి కరోనా
32.58 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు
బాధితుల సంఖ్య: 1,63,284
శుక్రవారం కోలుకున్నవారు: 80
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రమోదీయం.. జనామోదం
[ 07-05-2024]
ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. -
విత్తు ధర పెంచి చిత్తు చేశావు!
[ 07-05-2024]
కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది. -
జగన్ ఏలుబడిలో... అంగన్వాడీల అగచాట్లు
[ 07-05-2024]
అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏ వర్గాన్నీ విడిచిపెట్టకుండా చిత్రహింసలకు గురి చేసింది. ఇందులో అంగన్వాడీలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. -
ఉద్యోగులపై వైకాపా ప్రలోభాల వల
[ 07-05-2024]
ఈ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో అధికార వైకాపా నాయకులు వారిని పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
వైకాపా హయాంలో..అన్నీ నేరాలే!
[ 07-05-2024]
వైకాపా హయాంలో విశాఖను గంజాయి హబ్గా మార్చారని విశాఖపట్నం కూటమి తెదేపా ఎంపీ అభ్యర్థి భరత్ విమర్శించారు. -
మూడు పార్టీల కూటమితోనే ఉత్తరాంధ్ర ప్రగతి
[ 07-05-2024]
‘యువత సైకిల్ ఎక్కాలి. భాజపా, తెదేపా, జనసేన జెండాలు కట్టుకోవాలి. ఒక చేత్తో గాజు గ్లాసు పట్టుకొని, కమలం పువ్వును సైకిల్ మీద ఉంచి వారం రోజుల పాటు పనిచేయాలని’ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
సమస్యల్లో పరవాడ ‘మేజర్’
[ 07-05-2024]
పరవాడ మేజర్ పంచాయతీలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. -
శిశువులపై జగన్ కర్కశత్వం
[ 07-05-2024]
జగన్ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు ఎవరినీ విడిచిపెట్టకుండా కర్కశత్వాన్ని ప్రదర్శిస్తోంది. -
చీకట్లో పోలింగ్ కేంద్రాలు.. కనిపించని గుర్తులు
[ 07-05-2024]
ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కరవయ్యాయి. -
పింఛన్ లబ్ధిదారులకు తీరని అవస్థలు
[ 07-05-2024]
పింఛన్ బట్వాడా విషయంలో ప్రభుత్వ తీరుతో పేదల కష్టాలు కొనసాగుతున్నాయి. -
మాజీ పోలీసు ఇంట్లో రూ.9.99 లక్షలు స్వాధీనం
[ 07-05-2024]
జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా నిల్వ చేసిన నగదును సార్వత్రిక ఎన్నికల ఫ్లైయింగ్ సర్వేలైన్ టీం(ఎఫ్ఎస్టీ) స్వాధీనం చేసుకుంది. -
చందనోత్సవం భక్తులకు మెరుగైన సదుపాయాలు
[ 07-05-2024]
ఈనెల 10వ తేదీన సింహగిరిపై జరగనున్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్ వలవన్ సూచించారు. -
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
[ 07-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తామని పెందుర్తి నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య