logo

‘న్యాయపరమైన చిక్కులు లేకుండా యాజమాన్యపు హక్కులు’

వి.ఎం.ఆర్‌.డి.ఎ కార్యాలయానికి వచ్చిన దస్త్రాలను వెంటనే పరిష్కరించాలని వి.ఎం.ఆర్‌.డి.ఎ కమిషనర్‌, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. సిరిపురం వి.ఎం.ఆర్‌.డి.ఎ.

Published : 24 Jun 2022 04:55 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : వి.ఎం.ఆర్‌.డి.ఎ కార్యాలయానికి వచ్చిన దస్త్రాలను వెంటనే పరిష్కరించాలని వి.ఎం.ఆర్‌.డి.ఎ కమిషనర్‌, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. సిరిపురం వి.ఎం.ఆర్‌.డి.ఎ. కార్యాలయంలో గురువారం ప్రణాళిక విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు.  పెండింగ్‌లో ఉన్న ఆన్‌లైన్‌, ఈ-ఆఫీసు, ఎల్‌.ఆర్‌.ఎస్‌, ఆర్‌.టి.ఐ, కోర్టు కేసులకు సంబంధించి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్‌.ఆర్‌.ఎస్‌ 2020 పథకం ద్వారా అందిన దరఖాస్తులకు యాజమాన్యపు హక్కులను పరిశీలించి ఆమోదం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. సమీక్ష సమావేశంలో జాయింట్‌ కమిషనర్‌ రవీంద్ర, చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ సురేష్‌కుమార్‌, ప్రణాళిక విభాగపు అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని