logo

రామచంద్ర హోటల్స్‌ అధినేత కన్నుమూత

గాజువాక లక్ష్మి, లక్ష్మీకాంత్‌ సినీకాంప్లెక్స్‌ థియేటర్స్‌, గ్రూప్‌ ఆఫ్‌ రామచంద్ర హోటల్స్‌ అధినేత, సేవా కార్యకర్త గంటా రామచంద్రరావు (81) ఆదివారం కన్నుమూశారు.

Published : 06 Feb 2023 04:45 IST

రామచంద్రరావు (పాతచిత్రం)

గాజువాక, న్యూస్‌టుడే : గాజువాక లక్ష్మి, లక్ష్మీకాంత్‌ సినీకాంప్లెక్స్‌ థియేటర్స్‌, గ్రూప్‌ ఆఫ్‌ రామచంద్ర హోటల్స్‌ అధినేత, సేవా కార్యకర్త గంటా రామచంద్రరావు (81) ఆదివారం కన్నుమూశారు. వయసురీత్యా కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం గాజువాకలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా అయిదేళ్ల క్రితం గాజువాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.14 లక్షలతో అదనపు పాఠశాల భవనాన్ని నిర్మించారు. కూర్మన్నపాలెంలో కొన్నాళ్లపాటు వృద్ధాశ్రమాన్ని నిర్వహించి, ఆ తర్వాత వివిధ కారణాలతో మూసివేశారు. ఏలూరులో రామచంద్ర ఇంజినీరింగ్‌ కళాశాలను నిర్వహిస్తూ ఎందరికో ఉన్నత విద్యా అవకాశాలు కల్పించారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం గాజువాక శ్మశానవాటికలో రామచంద్రరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని