logo

గుండెపోటుతో సి.ఐ. మృతి

సీబీఐలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్‌.వెంకటశర్మ (54) సోమవారం ఉదయం కార్యాలయ ఆవరణలో షటిల్‌కోర్టులో ఇతర ఉద్యోగులతో కలిసి ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

Published : 21 Mar 2023 03:28 IST

వెంకటశర్మ (పాతచిత్రం)

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: సీబీఐలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్‌.వెంకటశర్మ (54) సోమవారం ఉదయం కార్యాలయ ఆవరణలో షటిల్‌కోర్టులో ఇతర ఉద్యోగులతో కలిసి ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు శోకసంద్రంలో మునిగిపోయారు. సి.ఐ.ఎస్‌.ఎఫ్‌.లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఆయన ఐదేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై సీబీఐకి వచ్చారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తాడేపల్లిగా చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని