రూ.2 కోట్లు బూడిదలో పోసినట్టేనా..
మహా విశాఖ నగరపాలక సంస్థ మెకానికల్ విభాగం ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.2 కోట్ల విలువైన వాహనాలు తుప్పుపట్టి పోతున్నాయి.
తుప్పల్లో ‘సీసీఎస్’ వాహనాలు
కార్పొరేషన్, న్యూస్టుడే
ముడసర్లోవ యార్డు తుప్పల్లో క్లోజ్డ్ కాంపాక్షన్ వాహనాలు
మహా విశాఖ నగరపాలక సంస్థ మెకానికల్ విభాగం ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.2 కోట్ల విలువైన వాహనాలు తుప్పుపట్టి పోతున్నాయి. రెండేళ్ల క్రితం వీటిని కొనుగోలు చేసినా వినియోగించకుండా మూలన పెట్టారు. మరో పక్క అద్దె ప్రాతిపదికన వాహనాలను తీసుకుని గుత్తేదారుకు ఏడాదికి రూ.70లక్షలు చెల్లిస్తుండడం గమనార్హం.
* నగరంలో పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి జోన్-2 పరిధి ముడసర్లోవలో సీసీఎస్(క్లోజ్డ్ కాంపాక్షన్ సిస్టమ్) కేంద్రాన్ని నిర్మించి చెత్త బయటకు కనిపించకుండా నిల్వ చేసి, తరలించే ప్రాజెక్టును రెండున్నరేళ్ల క్రితం రూ.8.5 కోట్ల వ్యయంతో జీవీఎంసీ ప్రారంభించింది. ప్రాజెక్టులో భాగంగా క్లాప్ వాహనాలు చెత్తను సీసీఎస్ కేంద్రానికి తీసుకొస్తాయి. అక్కడ నిల్వ ఉంచిన చెత్తను తరలించడానికి నాలుగు క్లోజ్డ్ కాంపాక్షన్ వాహనాలను గుత్తేదారు సమకూర్చాల్సి ఉంటుంది.
* ఏటా రూ.70లక్షల నష్టం: రెండేళ్ల కిందట నాలుగు సీసీఎస్ వాహనాల కొనుగోలు సందర్భంగా కంపెనీ ఇచ్చిన మరమ్మతుల గ్యారంటీ గడువు పూర్తయింది. ప్రస్తుతం ప్రాజెక్టు తిరిగి ప్రారంభమైన దృష్ట్యా మూలనపెట్టిన వాహనాలను వినియోగిస్తారా లేదా అనే అంశంపై ఇంకా అధికారులు నిర్ణయం తీసుకోలేదు. వాటిని అందుబాటులోకి తెస్తే ఇన్నాళ్లు పక్కన పెట్టినందుకు ఇంజినీరింగ్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొత్త వాహనాలను నిరుపయోగంగా మూలన పెట్టిన అధికారులు మరో వైపు చెత్తను తరలించడానికి అవసరమైన వాహనాల కోసం టెండరు ఆహ్వానించారు. దీనికిగాను గుత్తేదారులకు ఏటా రూ.70లక్షలు ఇవ్వడానికి అంగీకరించడం గమనార్హం. కొందరికి లాభం చేకూర్చడానికే సీసీఎస్ వాహనాలను వినియోగంలోకి తీసుకురాకుండా వ్యూహాత్మకంగా పక్కన పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల తీరు కారణంగా జీవీఎంసీకి ఏటా రూ.70 లక్షల నష్టం వాటిల్లుతోంది. ఈ ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రాజెక్టును మధ్యలో ఆపేసిన గుత్తేదారు
* ప్రాజెక్టును దక్కించుకున్న గుత్తేదారు 20శాతం మేర సీసీఎస్ కేంద్రం పనులు చేశారు. నాలుగు వాహనాలను కూడా కొనుగోలు చేశారు. అనంతరం బిల్లుల కోసం జీవీఎంసీని సంప్రదించగా మధ్యలో నిధులు ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. దీంతో గుత్తేదారు ప్రాజెక్టును మధ్యలో వదిలేశారు. కొనుగోలు చేసిన వాహనాలను జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించగా, వాటిని ముడసర్లోవ సమీపంలోని స్కిల్ డెవలప్మెంటÂ కేంద్రం పక్కనున్న యార్డులో ఉంచారు. అలా రెండేళ్లపాటు అవి నిరుపయోగంగా మారి తుప్పు పట్టిపోతున్నాయి. తాజాగా అధికారులు గుత్తేదారుతో సంప్రదించి ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరారు. దీంతో సీసీఎస్ కేంద్రం నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.