logo

ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో

ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది.

Updated : 18 Apr 2024 09:09 IST

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని ఎన్నికల సంఘం కోరడంతో మూడో పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఒక అధికారి న్యాయ కళాశాలకు వెళ్లి అధికారులను విచారించినట్లు తెలిసింది. సమసిపోయిందనుకుంటున్న సమస్య మళ్లీ తెరపైకి వచ్చిందంటూ ఏయూ అధికారులు వాపోతున్నట్లు సమాచారం. ఎన్నికల అధికారులు ఆదేశిస్తే పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా ఈ వ్యవహారాన్ని తేలిగ్గా వదలకూడదని ఎన్నికల అధికారులు భావిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని