logo

పాలిసెట్‌లో శశి విద్యార్థి ప్రతిభ

ఏపీ పాలిసెట్‌-24 ఫలితాల్లో సంగివలస శశి విద్యార్థి శీలం శ్రీరామ్‌ భవదీప్‌ 120/120 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించాడు.

Published : 09 May 2024 04:21 IST

రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు

తగరపువలస, న్యూస్‌టుడే: ఏపీ పాలిసెట్‌-24 ఫలితాల్లో సంగివలస శశి విద్యార్థి శీలం శ్రీరామ్‌ భవదీప్‌ 120/120 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన ఈ విద్యార్థి తండ్రి శ్రీను వెల్ఫేరు అసిస్టెంట్‌ కాగా తల్లి గృహిణి. ఐఐటీ ముంబాయిలో సీటు సాధనే లక్ష్యమని చెప్పాడు. ఎస్‌.ఐశ్వర్య 119 మార్కులతో ఏడో ర్యాంకు, ఆర్‌.దర్శన్‌ 22వ ర్యాంకు, కె.తరుణ్‌తేజ 24వ ర్యాంకు, బి.సందీప్‌, బి.సాయివంశీ, ఆర్‌.దిలీప్‌కుమార్‌ 32వ ర్యాంకు, వీబీ గోపాలస్వామి, బి.శశాంక్‌ 42వ ర్యాంకు పొందారు. 100లోపు ర్యాంకులను 19 మంది సాధించారని కళాశాల ఛైర్మన్‌ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్‌ ఛైర్మన్‌ మేకా నరేంద్రకృష్ణ తెలిపారు. విజేతలను వారు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని