logo

దళితులకు అన్యాయం చేసిన వైకాపాను ఓడించాలి

దళితులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్రవ్యాప్తంగా దళితసేన, ప్రజాసంఘాలతో కలసి మే 13న జరిగే ఎన్నికల్లో ఓడిస్తామని రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు పేర్కొన్నారు.

Published : 10 May 2024 04:13 IST

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: దళితులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్రవ్యాప్తంగా దళితసేన, ప్రజాసంఘాలతో కలసి మే 13న జరిగే ఎన్నికల్లో ఓడిస్తామని రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు పేర్కొన్నారు. పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం దళిత, ప్రజా సంఘాల నాయకులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ ఇచ్చి దళితులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుడు సుధాకర్‌ను అన్యాయంగా చంపేశారన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళితున్ని చంపి డోర్‌ డెలివరీ చేస్తే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కొణతాల రామకృష్ణ, సీఎం రమేశ్‌ల గెలుపునకు అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. దళితసేన నాయకులు నక్కెళ్ల నాగమణి, వసంతం అప్పారావు, పావడ కామరాజు, ఈశ్వరరావు, భాస్కరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని