వైఎస్సార్ బీమా.. ఏదీ ధీమా..
కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుంఖంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
లబ్ధిదారులను ఆదుకోవడంలో తీవ్ర జాప్యం చేసిన జగన్
కంటితుడుపు పథకంగా మారిపోయిందన్న ప్రజలు
న్యూస్టుడే, పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం: కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుంఖంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వైఎస్సార్ బీమా పథకం కంటితుడుపు పథకంగా మారిపోయింది. తెదేపా హయాంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలు చేసిన చంద్రన్న బీమా పథకానికి జగన్ పేర్లు మార్చి నిబంధనలు కఠినతరం చేస్తూ పథకాన్ని నిర్వీర్యం చేశారు. గతంలో నమోదు, సహాయం కోసం ప్రతి మండలానికీ ఒక బీమా మిత్రను ఏర్పాటు చేశారు. ఎవరికైనా మరణం సంభవిస్తే దహన సంస్కారాల కోసం తక్షణమే కుటుంబ సభ్యులకు రూ.5 వేలు అందించేవారు. అనంతరం పదిహేను రోజుల్లోగా క్లెయిములు చెల్లించి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసేవారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ బీమా పథకం అసలు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
క్లెయిముల కోసం ఎదురు చూపులు: గత ప్రభుత్వంలో చంద్రన్న బీమా పథకం ఎంతో సమర్థంగా అమలయ్యేది. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ బీమా క్లెయిములు అందక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల పెందుర్తిలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మరణించాడు. రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ బీమా క్లెయిము అందలేదు. ఇలాంటి బాధితులు చాలా మందే ఉన్నారు. బీమా రక్షణ లేకపోతే ప్రజల జీవితానికి భరోసా ఎలా కల్పిస్తారు.
రెడ్డి నారాయణరావు, రాంపురం
ఒక్క పైసా కూడా ఇవ్వలేదు: మాది పేద దళిత కుటుంబం. కూలీ నాలీ చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి. నా భర్త రెండేళ్ల క్రితం పశువులు తోలుకుని వెళ్లి చెరువులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. నాకు ఇద్దరు సంతానం. వైఎస్సార్ బీమా పథకానికి దరఖాస్తు చేసినా ఇంతవరకు ఒక్క పైసా కూడా రాలేదు. సచివాలయం అధికారులను పలుమార్లు విన్నవించినా సమాధానం లేదు. స్పందన కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులను రెండు సార్లు కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.
నేతల ఈశ్వరమ్మ, భరణికం
కుటుంబం గడవడం కష్టంగా మారింది..: నా భర్త గ్రామాల్లో పాల వ్యాపారం చేసి తమను పోషించేవాడు. రెండేళ్ల క్రితం ఇంటిబోరు వద్ద పాలక్యాన్లు శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మాకు ఇద్దరు సంతానం. వైఎస్సార్ బీమాకు దరఖాస్తు చేశాను సచివాలయ సిబ్బంది వచ్చి రూ.10 వేలు ఇచ్చారు. మిగతా సొమ్ము రూ.4.90 లక్షలు ఇప్పటికీ రాలేదు. సచివాలయ సిబ్బందిని అడిగితే రిపోర్టులు పంపించాం వస్తుందని చెబుతున్నారే తప్ప రెండేళ్లయినా రాలేదు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఇక్కట్లు పడుతున్నాం.
జనపాల సంతోషి, మరిశవానిపాలెం
ప్రత్యేక విభాగం పనిచేసేది..: గతంలో చంద్రన్న బీమా నమోదుకు ప్రత్యేక విభాగం 24 గంటలు పని చేసేది. ఎవరైనా చనిపోతే కాల్ సెంటరుకు ఫోన్ చేస్తే వెంటనే స్థానిక ఆరోగ్య సహాయ కార్యకర్తకు సమాచారం వచ్చేది. ఆ కార్యకర్త మరణించిన వారి కుటుంబాల వద్దకు వెళ్లి వారిని ఓదార్చి తక్షణ సహాయం కింద రూ.5 వేలు అందజేసేవారు. దరఖాస్తులు ఎలా, ఎక్కడ చేయాలనే విషయాలను వారికి వివరించి మిగిలిన నగదు అందేలా చేసేవారు. వైకాపా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినా ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయారు.
పొలమరశెట్టి పెద్దినాయుడు, చింతలగ్రహారం
ఈ పథకం గురించి చాలామందికి తెలీదు..: గతంలో అమలు చేసిన చంద్రన్న బీమా పథకం కుటుంబానికి భరోసాగా ఉండేది. కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినా రూ.5 లక్షలు బీమా కింద చెల్లించేవారు. ఆ మొత్తాన్ని పెట్టుబడి పెట్టుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహాయ పడేది. ప్రస్తుతం వైఎస్సార్ బీమా పథకం గురించి చాలా మందికి తెలీదు. గతంలో ఎవరైనా చనిపోతే వారి డబ్బులు అందితే ఊరంతా చెప్పుకునేవారు. ఇప్పుడు ఎవరికీ ఇవ్వకపోవడంతో ప్రజలకు తెలియడం లేదు.
ఎం.ఎం.కె. ప్రవీణ్, బాటజంగాలపాలెం
గతంలో వెంటనే నగదు జమయ్యేది..: చంద్రబాబు హయాంలో బీమా సొమ్ము వెంటనే వారి కుటుంబ సభ్యుల ఖాతాలో జమ చేసేవారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పథకం రూపురేఖలే మార్చేశారు. దీంతో చాలామంది లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి మంచి పథకాలను అటకెక్కేంచేసి సంక్షేమం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు.
ఆళ్ల తాతారావు, లక్ష్మీపురం
కుటుంబాలు వీధిన పడుతున్నాయి..: కుటుంబాలకు ఎంతో భరోసాగా నిలుస్తున్న బీమా పథకాలను జగన్ సక్రమంగా అమలు చేయకపోవడంతో చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గతంలో ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.5 లక్షలు, సాధారణ మృతి అయితే రూ.2 లక్షలు ఇచ్చేవారు. ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేది. కుటుంబ యజమాని చనిపోతే వారిపై ఆధారపడిన వారు ఈ పథకం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకునేవారు.
కర్రి నర్సింగరావు, అసకపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
[ 20-05-2024]
కోడి మాంసం ధర వినియోగదారులకు చుక్కలు చూపెడుతోంది. సామాన్యుడు మాంసం కొనుగోలు చేయడానికి భయపడుతున్నాడు. జిల్లాలో వందల సంఖ్యలో దుకాణాలు ఉండగా, రోజూ వేలాది కేజీల మాంసం విక్రయాలు సాగుతుంటాయి. -
ఏమిటీ చెల్లింపులు.. ఎన్నికల విధుల పట్ల ఉద్యోగుల పెదవి విరుపు
[ 20-05-2024]
ఎన్నికల విధుల పట్ల ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. కష్టానికి తగ్గట్టుగా చెల్లింపులు చేయలేదని, పైగా అల్పాహారాలు భోజనాలు సకాలంలో రాకపోవడమే కాకుండా, రుచికరంగా లేవంటూ నిట్టూర్చుతున్నారు. -
మెట్ల మార్గానికి మోక్షమెప్పుడో!
[ 20-05-2024]
సింహాచలం కొండ మీదకు వెళ్లే మెట్ల మార్గం శిథిలావస్థకు చేరింది. స్వామి దర్శనానికి వెళ్లే ఈ ప్రత్యామ్నాయ మెట్ల మార్గానికి కొన్నేళ్లుగా మోక్షం కలగడం లేదు. కనీసం ప్రసాద్ పథకంలో భాగంగానైనా ప్రాధాన్యంగా చేస్తారంటే అదీ కనిపించడం లేదు. -
సొమ్ములు పోశారు.. కళ్లప్పగించారు!!
[ 20-05-2024]
రైతు బజార్లలో భారీగా ఖర్చు చేసిన పరికరాలు ఒక్కసారి మూలుకు చేరితే చాలు... వాటి సంగతి ఇక అంతే. బాగు చేద్దాం.. అందుబాటులోకి తెద్దాం అనే ఆలోచనే అధికారులకు లేదు. మార్కెటింగ్శాఖ నిర్లక్ష్యంతో అటు రైతులు... ఇటు వినియోగదారులు ఎన్నో ప్రయోజనాలకు దూరమవుతున్నారు. -
వైకాపా నాయకుడి దౌర్జన్యంపై ఫిర్యాదు
[ 20-05-2024]
పప్పుశెట్టిపాలెం సర్పంచి భర్త వైకాపా నాయకుడు రామకృష్ణ నాయుడు తమపై దౌర్జన్యం చేశారని తెదేపా మండల కమిటీ సభ్యుడు బెల్లం కొండలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలు.. రూ.కోట్ల సొత్తు స్వాధీనం
[ 20-05-2024]
ఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా జూన్ నాటికి రైతులకు అవగాహన కల్పించాలి. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. 2023 ఆగస్టు నుంచి సిబ్బంది జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. -
రెచ్చిపోతే చిక్కులే..
[ 20-05-2024]
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలన్నీ స్ట్రాంగ్రూమ్ల్లో భద్రంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు వరకు గెలుపోటములు ఎవరివో చెప్పలేం. అయినప్పటికీ ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతోంది. -
కిక్కిరిసిన తీరం
[ 20-05-2024]
ఆదివారం సెలవు కావడంతో ఆర్కే బీచ్లో సేద తీరేందుకు పర్యాటకులు, నగర వాసులు పోటెత్తారు. పిల్లలకు వేసవి సెలవులు కావడం, ఎన్నికలు కూడా ముగియడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగి బీచ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. కూలీలు పనులకు రాకుండానే దొంగ మస్తర్లు వేస్తున్నారని మాజీ సర్పంచి ఏడువాక లక్ష్మణకుమార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
ఆకట్టుకున్న నాటికలు
[ 20-05-2024]
అనకాపల్లిలోని వీవీ రమణ రైతుభారతిలో నిర్వహిస్తున్న జ్యోతి సరళ స్మారక కళాపరిషత్ రాష్ట్రస్థాయి నాటిక ప్రదర్శన ఆకట్టుకుంది. -
రెండవ రోజు కొనసాగిన చందనం అరగదీత
[ 20-05-2024]
వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈనెల 23వ తేదీన అప్పన్న స్వామికి రెండవ విడత చందన సమర్పణ జరగనుంది. ఆ మేరకు సింహగిరిపై జరుగుతున్న చందనం అరగదీత కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు, తలనొప్పి వంటి వాటితో బాధపడుతూ చికిత్స కోసం కేజీహెచ్కు వచ్చే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక