అందరూ ఓటేస్తేనే.. ఐదేళ్ల అరాచక పాలన అంతం
ఈనెల 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని, 95 శాతం పోలింగ్ నమోదు చేయాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు.
మార్పునకు నాంది పలకండి విశాఖపై నా ప్రేమ శాశ్వతం
‘ప్రజాగళం’ సభలో తెదేపా అధినేత చంద్రబాబు
మాట్లాడుతున్న చంద్రబాబు
ఈనాడు, ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, న్యూస్టుడే, సీతంపేట, గురుద్వారా: ఈనెల 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని, 95 శాతం పోలింగ్ నమోదు చేయాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు. సీతంపేట కూడలిలో గురువారం రాత్రి నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పాల్గొని మాట్లాడారు.
ఓటు వేయకపోతే ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అధికారం కోల్పోతారని చంద్రబాబు వివరించారు. ఎండ ఎక్కువగా ఉందని ఇంట్లో కూర్చోకుండా.. బాధ్యత గల పౌరునిగా ప్రతి ఒక్కరూ ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని, మార్పునకు నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేయించారు. మంచి వ్యక్తులు అధికారంలోకి వస్తే జీవితాలు బాగుపడతాయని, చెడ్డ వ్యక్తుల ద్వారా నాశనమవుతాయని వివరించారు. ఓటుతోనే ఐదేళ్ల వైకాపా అరాచక పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు అభివాదం చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
హైదరాబాద్కు దీటుగా మారుస్తా
‘విశాఖ నగరంపై నా ప్రేమ శాశ్వతం. అందమైన...నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతా. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నగరంలో ఎక్కడా గుంతలు లేకుండా రోడ్లు నిర్మాణం చేపడతాం. ఉత్తర నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి ఎన్ఎస్టీఎల్ వరకు 60 అడుగుల రోడ్డు పూర్తి చేస్తాం. ఇక్కడ నీటి ఎద్దడి లేకుండా చూసే బాధ్యత నాది. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత నీరు సరఫరా చేస్తాం. కొండవాలు ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు రోడ్లు, నీరు, విద్యుత్తు సదుపాయాలు కల్పిస్తాం. ‘తూర్పు’లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసి మురుగు సమస్య నివారిస్తాం. హుద్హుద్ సమయంలో తెదేపా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను బాధితులందరికీ అందజేస్తాం. పట్టాలు లేనివారికి ఇళ్ల పట్టాలు ఇస్తాం. ‘దక్షిణం’లో ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. పోర్టు నుంచి వచ్చే కాలుష్యాన్ని నివారించి విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజలకు శిరస్సు వంచి వందనం చేస్తున్న చంద్రబాబునాయుడు
మహిళలకు వడ్డీ లేని రుణాలు..
‘ప్రధాని మోదీ సహకారంతో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. పట్టణ ప్రాంత మహిళలకు ఆదాయం పెంచుతాం. ప్రతి నెలా 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు రూ.1500, ‘తల్లికి వందనం’ కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున అందజేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే రూ.4 వేల పింఛను అందజేస్తాం’ అని చంద్రబాబు వివరించారు.
తెదేపా అధినేతతో కలిసి ఎన్నికల గుర్తు చూపుతున్న ఉత్తరం అభ్యర్థి విష్ణుకుమార్రాజు
మంచిని గెలిపించండి
‘ఉత్తరం’లో భాజపా అభ్యర్థి విష్ణుకుమార్రాజు ఓ రౌడీపై పోరాడుతున్నారని, మంచిని గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీభరత్, తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం, భీమిలి అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ, గంటా శ్రీనివాసరావులను పరిచయం చేశారు. సైకిల్, గాజుగ్లాసు, కమలం పువ్వు గుర్తులకు ఓటేసి కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మీ ఓటుతో దిమ్మదిరిగే సమాధానం చెప్పాలన్నారు. ‘ప్రజాగళం’ సభకు తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో ఆ కూడలి జనసంద్రమైంది. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ తదితరులు పాల్గొన్నారు. ః ప్రజాగళం సభ తరువాత గురువారం రాత్రి చంద్రబాబు నగరంలోని పార్టీ కార్యాలయంలోనే బస చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులందరితో విడివిడిగా మాట్లాడారు.
ఎమ్మెల్యే అభ్యర్థులు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి, గణబాబు, వంశీకృష్ణలను పరిచయం చేస్తున్న చంద్రబాబు
చంద్రబాబుతో విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
[ 20-05-2024]
కోడి మాంసం ధర వినియోగదారులకు చుక్కలు చూపెడుతోంది. సామాన్యుడు మాంసం కొనుగోలు చేయడానికి భయపడుతున్నాడు. జిల్లాలో వందల సంఖ్యలో దుకాణాలు ఉండగా, రోజూ వేలాది కేజీల మాంసం విక్రయాలు సాగుతుంటాయి. -
ఏమిటీ చెల్లింపులు.. ఎన్నికల విధుల పట్ల ఉద్యోగుల పెదవి విరుపు
[ 20-05-2024]
ఎన్నికల విధుల పట్ల ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. కష్టానికి తగ్గట్టుగా చెల్లింపులు చేయలేదని, పైగా అల్పాహారాలు భోజనాలు సకాలంలో రాకపోవడమే కాకుండా, రుచికరంగా లేవంటూ నిట్టూర్చుతున్నారు. -
మెట్ల మార్గానికి మోక్షమెప్పుడో!
[ 20-05-2024]
సింహాచలం కొండ మీదకు వెళ్లే మెట్ల మార్గం శిథిలావస్థకు చేరింది. స్వామి దర్శనానికి వెళ్లే ఈ ప్రత్యామ్నాయ మెట్ల మార్గానికి కొన్నేళ్లుగా మోక్షం కలగడం లేదు. కనీసం ప్రసాద్ పథకంలో భాగంగానైనా ప్రాధాన్యంగా చేస్తారంటే అదీ కనిపించడం లేదు. -
సొమ్ములు పోశారు.. కళ్లప్పగించారు!!
[ 20-05-2024]
రైతు బజార్లలో భారీగా ఖర్చు చేసిన పరికరాలు ఒక్కసారి మూలుకు చేరితే చాలు... వాటి సంగతి ఇక అంతే. బాగు చేద్దాం.. అందుబాటులోకి తెద్దాం అనే ఆలోచనే అధికారులకు లేదు. మార్కెటింగ్శాఖ నిర్లక్ష్యంతో అటు రైతులు... ఇటు వినియోగదారులు ఎన్నో ప్రయోజనాలకు దూరమవుతున్నారు. -
వైకాపా నాయకుడి దౌర్జన్యంపై ఫిర్యాదు
[ 20-05-2024]
పప్పుశెట్టిపాలెం సర్పంచి భర్త వైకాపా నాయకుడు రామకృష్ణ నాయుడు తమపై దౌర్జన్యం చేశారని తెదేపా మండల కమిటీ సభ్యుడు బెల్లం కొండలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలు.. రూ.కోట్ల సొత్తు స్వాధీనం
[ 20-05-2024]
ఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా జూన్ నాటికి రైతులకు అవగాహన కల్పించాలి. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. 2023 ఆగస్టు నుంచి సిబ్బంది జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. -
రెచ్చిపోతే చిక్కులే..
[ 20-05-2024]
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలన్నీ స్ట్రాంగ్రూమ్ల్లో భద్రంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు వరకు గెలుపోటములు ఎవరివో చెప్పలేం. అయినప్పటికీ ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతోంది. -
కిక్కిరిసిన తీరం
[ 20-05-2024]
ఆదివారం సెలవు కావడంతో ఆర్కే బీచ్లో సేద తీరేందుకు పర్యాటకులు, నగర వాసులు పోటెత్తారు. పిల్లలకు వేసవి సెలవులు కావడం, ఎన్నికలు కూడా ముగియడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగి బీచ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. కూలీలు పనులకు రాకుండానే దొంగ మస్తర్లు వేస్తున్నారని మాజీ సర్పంచి ఏడువాక లక్ష్మణకుమార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
ఆకట్టుకున్న నాటికలు
[ 20-05-2024]
అనకాపల్లిలోని వీవీ రమణ రైతుభారతిలో నిర్వహిస్తున్న జ్యోతి సరళ స్మారక కళాపరిషత్ రాష్ట్రస్థాయి నాటిక ప్రదర్శన ఆకట్టుకుంది. -
రెండవ రోజు కొనసాగిన చందనం అరగదీత
[ 20-05-2024]
వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈనెల 23వ తేదీన అప్పన్న స్వామికి రెండవ విడత చందన సమర్పణ జరగనుంది. ఆ మేరకు సింహగిరిపై జరుగుతున్న చందనం అరగదీత కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు, తలనొప్పి వంటి వాటితో బాధపడుతూ చికిత్స కోసం కేజీహెచ్కు వచ్చే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
-
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
-
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్