logo

పేదల సంక్షేమంలో తెరాస విఫలం

పేదల సంక్షేమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్ర మరిపెడ మండలం అబ్బాయిపాలెం, మరిపెడ, గుండెపుడి

Updated : 20 May 2022 05:56 IST

మాట్లాడుతున్న ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

మరిపెడ, న్యూస్‌టుడే: పేదల సంక్షేమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్ర మరిపెడ మండలం అబ్బాయిపాలెం, మరిపెడ, గుండెపుడి గ్రామాల్లో కొనసాగింది. ఆయా గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో ప్రజల స్థితిగతులు, సమస్యలను పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. పలుచోట్ల ఇళ్లు లేక, పింఛన్‌లు రాక, వైద్య సదుపాయం అందక అవస్థలు పడుతున్నామని తెలిపారు. యాత్రలో ఆయన ప్రసంగిస్తూ బహుజన రాజ్యాధికారంతోనే తమ కష్టాలు తీరుతాయన్నారు. ఓటును అమ్ముకోకుండా ప్రజల కోసం పాటుపడే వారిని ఆదరించాలని కోరారు. ఏడు దశాబ్ధాలుగా కాంగ్రెస్‌, తెదేపా, తెరాస హయాంలో రాని ప్రజాస్వామ్య మార్పును తాము చేసి చూపిస్తామన్నారు. కుటుంబాన్ని వదిలి బహుజనులు, పేదల కోసమే తాను యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పార్టీ జెండాలను ఆవిష్కరించి స్థానికులకు పార్టీని పరిచయం చేసేందుకు పర్యటిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని