వజ్రోత్సవ సంబరం..
స్వాతంత్య్రం సిద్ధించిన తొలి నాళ్లలో మన అక్షరాస్యత ఆరు శాతమే. ఇప్పుడు సగటున 70 శాతం. 75 వసంతాల్లో ఉమ్మడి వరంగల్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి ఫలాలు సాధించింది. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే 2021-22 ప్రకారం మన ప్రగతి చక్రంపై ప్రత్యేక కథనం..
ఈనాడు, వరంగల్, డోర్నకల్, న్యూస్టుడే
స్వాతంత్య్రం సిద్ధించిన తొలి నాళ్లలో మన అక్షరాస్యత ఆరు శాతమే. ఇప్పుడు సగటున 70 శాతం. 75 వసంతాల్లో ఉమ్మడి వరంగల్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి ఫలాలు సాధించింది. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే 2021-22 ప్రకారం మన ప్రగతి చక్రంపై ప్రత్యేక కథనం..
* కాకతీయ విశ్వవిద్యాలయంతోపాటు, జాతీయ సాంకేతిక సంస్థ (నిట్) మన దగ్గర ఉంది. వైద్య విద్యార్థుల కోసం కాకతీయ వైద్య కళాశాల ఒకటే ఉండేది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఏర్పాటవుతున్నాయి.
* రవాణారంగం ఎంతో అభివృద్ధి చెందింది. కాజీపేట, వరంగల్తోపాటు ఎన్నో రైల్వే స్టేషన్లు, ఉత్తర దక్షిణ భారతాన్ని కలిపేలా కాజీపేట జంక్షన్గా మారింది. మొత్తం 9 బస్సు డిపోలు ఉన్నాయి. అనేక జాతీయ రహదారులు ఉమ్మడి వరంగల్ గుండా వెళుతున్నాయి. త్వరలో భారత్మాలా పరియోజన్ కింద నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు ఎక్స్ప్రెస్ మార్గం రానుంది. మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.
విద్యారంగం అభివృద్ధి పథం
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో నామమాత్ర వసతులు ఉండేవి. ఇప్పుడు విద్యారంగంలో పెనుమార్పులు వచ్చాయి.
అక్షరాస్యత మెరుగు
ఉమ్మడి వరంగల్ జిల్లా అక్షరాస్యత 65.11 శాతం. ఆరేళ్లు పైబడిన జనాభాలో మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అక్షరాస్యత 60 శాతం లోపు ఉంది. హనుమకొండ జిల్లాలో మెరుగ్గా ఉంది.
చదువే కీలకం
- తాటికొండ రమేశ్, ఉపకులపతి, కాకతీయ విశ్వవిద్యాలయం
ఏ సమాజమైనా దేశమైనా ప్రగతి సాధించాలంటే విద్యే కీలకం. ఇప్పుడు మన దేశంలోని యువత అద్భుతాలు సాధిస్తున్నారంటే విద్యా రంగ ప్రగతి వల్లే. దీనికి నిధులు మరిన్ని పెంచితే వందశాతం అక్షరాస్యత, మరింత ప్రగతి సాకారం అవుతుంది.
ఓరుగల్లు ప్రగతి సంతకం
* వైద్యం పేదలకు చేరువయ్యింది. బోధనాసుపత్రి ఎంజీఎంతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా ఆసుపత్రులు, పీహెచ్సీలు ఉన్నాయి. కేఎంసీలో ఇప్పటికే సూపల్ స్పెషాలిటీ ఆసుపత్రి రాగా త్వరలో 24 అంతస్తుల అత్యాధునిక ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తోంది.
* వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు, దేవాదుల లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు మన వద్దే కొలువై ఉన్నాయి. వీటి ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు, తాగు నీరు అందుతోంది.
* పారిశ్రామిక విప్లవం పెద్ద ఎత్తున సాగుతోంది. వేలాది ఎంఎస్ఎంఈలు ఆరు జిల్లాల్లో ఏర్పాటయ్యాయి. ఐటీ పరిశ్రమలకు నిలయంగా ఓరుగల్లు నగరంలో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. మెగా జౌళి పార్కు కూడా రూపుదిద్దుకుంటోంది.
* ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ఉమ్మడి వరంగల్ నుంచి ఆరు జిల్లాలు ఏర్పాటయ్యాయి. వాటిల్లో ఆధునిక పాలనా కేంద్రాలను నిర్మించారు. వరంగల్ మహానగరం దేశంలోనే మూడు పథకాలు మంజూరైన ఏకైక నగరంగా ఘనత సాధించింది.
ఇంటింటా విద్యుత్తు
స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కిరోసిన్ బుడ్లు వెలిగించిన ఇళ్లు అనేకం. ఇప్పుడు అవి కనుమరుగయ్యాయి. మెరుగైన విద్యుత్తు ఉమ్మడి జిల్లా వాసులకు అందుతుంది.
అన్నదాతకు జేజేలు
మిషన్ కాకతీయతో చెరువులు కుంటల అభివృద్ధి, కాళేశ్వరం, ఎస్సారెస్సీ కాల్వల ద్వారా ఊరూరా చేరిన గోదావరి నీళ్లతో నీటి వనరుల్లో ఇప్పుడు పుష్కలమైన నీరు. దీంతో వ్యవసాయం సస్యశ్యామలం అవుతోంది.
పారిశ్రామిక వేత్తలుగా
ఉమ్మడి జిల్లా నుంచి ఎందరో పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. అనామికా పాండే ఎన్ఐటీ పూర్వ విద్యార్థిని. ఉత్తరప్రదేశ్లోని వాస్తుఖండ్. ఇంట్లో తయారు చేసే మసాలాలతో ‘నారియో’ అనే అంకుర సంస్థను స్థాపించారు. అది రూ.కోట్ల టర్నోవర్కు చేరుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?