logo

Warangal: చికెన్ ఉద్దెర ఇస్తావా.. చస్తావా? భయభ్రాంతులకు గురిచేసిన అగంతుకుడు

నేను చికెన్‌ ఉద్దెరకు అడిగితే ఇవ్వవా.. నిన్ను చంపేస్తా.. అంటూ బెదిరిస్తూ ఓ అగంతకుడు భయభ్రాంతులకు గురిచేసిన ఉదంతం బుధవారం ఉదయం వరంగల్‌ కాశీబుగ్గలో వెలుగుచూసింది.

Updated : 02 Mar 2023 08:52 IST

ఇంటి ఎదుట బైక్‌పై కత్తి గుచ్చిన అగంతకుడు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: నేను చికెన్‌ ఉద్దెరకు అడిగితే ఇవ్వవా.. నిన్ను చంపేస్తా.. అంటూ బెదిరిస్తూ ఓ అగంతుకుడు భయభ్రాంతులకు గురిచేసిన ఉదంతం బుధవారం ఉదయం వరంగల్‌ కాశీబుగ్గలో వెలుగుచూసింది. కాశీబుగ్గకు చెందిన మధుకర్‌ హనుమకొండ అలంకార్‌ సమీపంలోని ఓ చికెన్‌ సెంటర్‌లో పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే విధులకు వెళ్లి వచ్చి తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదుట పార్కు చేశారు. బుధవారం ఉదయం లేచి చూసేసరికి బైక్‌ సీటుకు ఓ నాటు కత్తి గుచ్చి ఉంది. కత్తికి ఓ సిమ్‌కార్డు వేలాడుతూ కనిపించింది. సిమ్‌ చరవాణిలో వేసి వినగా, ‘తను ఉద్దర అడిగితే చికెన్‌ ఇవ్వవారా? నువ్వెట్ల చికెన్‌ సెంటర్‌కు వస్తావో చూస్తా. పెద్దమ్మగడ్డ మోరీ దాటి రారా.. నిన్ను దుకాణంలోనే యాసిడ్‌ పోసి హత్య చేస్తా అంటూ’ అగంతకుడు బూతు పదజాలంతో హెచ్చరిస్తూ మాట్లాడిన మాటలు వినిపించాయి. వేలి ముద్రలు గుర్తు పట్టకుండా వెంట తెచ్చిన తెల్లరంగును బైక్‌పైన, ఘటనా స్థలంలో చల్లాడు. పోలీసులు ఘటనా స్థలి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. మంగళవారం అర్ధరాత్రి 1.25 గంటల సమయంలో ఒక బైక్‌పై ముగ్గురు వ్యక్తులు అటుగా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి ఉన్నారు. ఈ ఘటనకు వారే బాధ్యులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని