logo

భార్యతో వివాహేతర సంబంధం.. వ్యక్తిని చంపి మూటకట్టి చెరువులో పడేసి..

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్యచేసి.. చేపల వలలో మూటకట్టి చెరువులో పడేసిన సôఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లిలో మంగళవారం వెలుగుచూసింది

Updated : 30 Aug 2023 09:02 IST

కరుణాకర్‌(పాతచిత్రం)

స్టేషన్‌ఘన్‌పూర్‌, న్యూస్‌టుడే : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్యచేసి.. చేపల వలలో మూటకట్టి చెరువులో పడేసిన సంఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లిలో మంగళవారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివునిపల్లి గ్రామానికి చెందిన తీగల కరుణాకర్‌(36) అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన చిక్కుడు నాగరాజు, కరుణాకర్‌ వ్యవసాయ బావులు పక్కపక్కనే ఉంటాయి.

ఈ నేపథ్యంలో నాగరాజు భార్య, కరుణాకర్‌ల మధ్య స్నేహం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.. ఈ నెల 25న ఉదయం కరుణాకర్‌ ఫోన్‌ చేయగా నాగరాజు లిఫ్ట్‌ చేశాడు.. నాగరాజు భార్య అనుకొని వారి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడాడు.. సాయంత్రం తోట వద్ద కలుసుకునే విషయం తెలుసుకున్న నాగరాజు భార్య వెనకాలే వెళ్లాడు. తోట వద్ద కరుణాకర్‌పై కత్తితో దాడిచేసి హతమార్చాడు. వెంటనే చేపల వలలో మూటకట్టి నమిలిగొండ గ్రామ చెరువులో పడేశాడు. మృతదేహం పైకి తేలకుండా చెట్లకు తాళ్లతో కట్టాడు.

మృతుడి కుటుంబ సభ్యులు కరుణాకర్‌ కనిపించడం లేదంటూ ఆరా తీస్తున్న విషయం తెలుసుకున్న నాగరాజు మంగళవారం ఉదయం పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. నిందితుడి సమాచారం మేరకు పోలీసులు చెరువులోని మృతదేహాన్ని వెలికితీశారు. నిందితుడితో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు. హత్య వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడికి భార్య కవిత, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని