logo

‘ఏ పార్టీలో ఉన్నా.. క్రమశిక్షణకు కట్టుబడి ఉంటా’

నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు కట్టుబడి కార్యకర్తలను కాపాడుకుంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

Published : 10 May 2024 02:11 IST

ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, చిత్రంలో ఇందిర

స్టేషన్‌ఘన్‌పూర్‌, న్యూస్‌టుడే : నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు కట్టుబడి కార్యకర్తలను కాపాడుకుంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో గురువారం నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో టీపీˆసీసీˆ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిరతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.. ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల మందు ఇప్పగూడెం గ్రామానికి వచ్చి అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. మీరు నమ్మి నాకు ఓటు వేసి గెలిపిస్తే.. నేను ఎమ్మెల్యేగా గెలిచిన భారాస మాత్రం కాంగ్రెస్‌ పార్టీ గాలిలో కొట్టుకుపోవడం జరిగిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చేసేదేమి లేక నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చేందుకు వేరే మార్గం లేక కాంగ్రెస్‌లో చేరడం జరిగిందన్నారు. గత ఎమ్మెల్యే రాజయ్య నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయకుండా పనులు, పదవులు, దళితబంధుతో సహా అన్ని అమ్ముకోవడం జరిగిందని విమర్శించారు. ఈ పదేళ్ల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఒరగబెట్టిందేమి లేదన్నారు. దేవాదుల ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించి.. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గొడుగు రాజయ్య, ఓరుగంటి వెంకటేశ్వర్లు, నాయకులు బెలిదె వెంకన్న, శిరీష్‌రెడ్డి, వెంకటేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని