logo

కాంగ్రెస్‌, భాజపా దొందూ దొందే..

ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు పేదలకు చేసిందేమీ లేదని, ప్రజా వ్యతిరేకతలో కాంగ్రెస్‌, భాజపా దొందూ దొందేనని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆరోపించారు.

Published : 10 May 2024 02:15 IST

వరంగల్‌ వెంకట్రామ కూడలిలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, చిత్రంలో భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌, హరి రమాదేవి

లేబర్‌కాలనీ, న్యూస్‌టుడే: ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు పేదలకు చేసిందేమీ లేదని, ప్రజా వ్యతిరేకతలో కాంగ్రెస్‌, భాజపా దొందూ దొందేనని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి వరంగల్‌ వెంకట్రామ కూడలిలో నిర్వహించిన భారాస కూడలి సమావేశం(కార్నర్‌ మీటింగ్‌)లో సారయ్య మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో ఒక్క ఉచిత బస్సు సౌకర్యం మినహా ఏవీ అమలు కావడం లేదని ఆరోపించారు. ఆలస్యంగా సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌, భాజపాలపై విమర్శలు చేశారు. ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఉద్యమకారుడినైన తనకే ఓట్లడికే హక్కు ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌, రాష్ట్ర నాయకులు మెట్టు శ్రీనివాస్‌, డాక్టర్‌ పులి సురేశ్‌, మసూద్‌ ప్రసంగించారు. నాయకులు గన్నారపు కుమార్‌, కేతిరి రాజశేఖర్‌, రాజేంద్రాచారి, పులి నాగరాజు, పొలెపాక సీతయ్య, దండు ప్రేమ్‌సాగర్‌, పొలెపాక విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని