ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రైవేటు బస్సు
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో దానిపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు మృతిచెందగా ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. ఏలూరు పాతబస్టాండ్ సెంటరు వద్ద బుధవారం అర్ధ రాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు
ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
ఏలూరు నేరవార్తలు, న్యూస్టుడే: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో దానిపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు మృతిచెందగా ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. ఏలూరు పాతబస్టాండ్ సెంటరు వద్ద బుధవారం అర్ధ రాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ సమీపంలోని పోరంకికి చెందిన కాండ్రు దుర్గారావు అనే యువకుడు ఇటీవల సంక్రాంతికి ఏలూరు మండలం పోణంగిలోని తమ బంధువుల ఇంటికి వచ్చాడు. తమ బంధువులైన మరో ఇద్దరు యువకులు కాకొర్ల దుర్గారావు, మత్తి ఆదినారాయణతో కలిసి పోరంకి నుంచి వచ్చిన కాండ్రు దుర్గారావు ద్విచక్ర వాహనంపై ఏలూరు రైల్వేస్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్కు వచ్చారు. బుధవారం అర్ధ రాత్రి దాటాక రైల్వేస్టేషన్ నుంచి పాత బస్టాండ్ వైపు వచ్చే ఫ్లైఓవరు మీదుగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ పోణంగి వెళ్లేందుకు పాతబస్టాండ్ కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి విజయనగరం వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ముగ్గురూ తీవ్ర గాయాలపాలయ్యారు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న టూటౌన్ ఎస్సై నాగబాబు, సిబ్బంది క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పోణంగికి చెందిన కాకొర్ల దుర్గారావు (23) మృతిచెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ముగ్గురూ కూలి పనులు చేస్తుంటారు. టూటౌన్ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగాలు కావాలంటే తెదేపా రావాలి
[ 06-05-2024]
‘జాబ్ క్యాలెండర్ పేరుచెప్పి జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చి యువతను జగన్ నిండా ముంచారు. వైకాపా పాలనకు యువతే చరమగీతం పాడాలి’ అంటూ తెదేపా నేత నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఏలూరులో ఆదివారం నిర్వహించిన యువగళం సభలో విద్యార్థులు, యువతతో ముఖాముఖీ నిర్వహించారు. -
జగన్ జమానాలో నిధులు దోచేసి... అభివృద్ధి ఆపేసి!
[ 06-05-2024]
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు... వైకాపా అధికారంలోకి వచ్చాక... ఆ పట్టుగొమ్మలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొడలిపోటు వేశారు. అయిదేళ్ల జగన్ జమానాలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. -
జాగాలపై జగన్ మూకలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఊరూరా ఆక్రమణలపర్వం
[ 06-05-2024]
‘జాగా కనిపిస్తే..పాగా వేసేయడమే’ అన్నట్లు జగన్ అనుచరగణం ఊరూరా చెలరేగిపోయింది. అయిదేళ్ల జమానాలో మమ్మల్ని ఎవర్రా ఆపేది అన్నట్లు ఆక్రమణల పర్వం సాగింది. ప్రజల సామూహిక అవసరాలకు వినియోగించాల్సిన స్థలాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయాయి. -
కక్ష సాధింపుల్లో.. అధినేతకు పెద్దన్న
[ 06-05-2024]
జిల్లాలో సంపన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన కీలక కేంద్రమది. తొలి నుంచి ప్రశాంత వాతావరణానికి నిలయం. జాతరలైనా, పండుగలైనా లౌకికత గోచరిస్తుంది. ఇలాంటి ప్రాంతం వైకాపా జమానాలో అరాచక పాలనకు, కక్ష సాధింపులకు వేదికైంది. -
బటన్ నొక్కుడు.. వట్టిదేనా జగన్?
[ 06-05-2024]
‘మహిళల సంక్షేమమే నా లక్ష్యం.. అతివల ఆర్థిక స్వావలంబనే నా ధ్యేయం’ అంటూ సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ వేదికలపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. అమలు చేసే విషయంలో మాత్రం ఆయనకు చిత్తశుద్ధి కొరవడింది. దీనికి నిదర్శనమే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం. అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. -
నీట్కు 43 మంది గైర్హాజరు
[ 06-05-2024]
జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు 43 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1361 మంది హాజరు కావాల్సి ఉండగా 1318 మంది హాజరయ్యారు. -
రంగులు మారలే... ప్రలోభాలు తగ్గలే!
[ 06-05-2024]
నరసాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు పట్టణంలోని ఎండీయూ ఆపరేటర్. ఆయన నిత్యం ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉంటారు. ఎన్నికల ప్రచారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
చీకటి పాలన నుంచి త్వరలో విముక్తి : నారా రోహిత్
[ 06-05-2024]
అయిదేళ్ల చీకటి పాలన నుంచి త్వరలోనే విముక్తి పొందుతామని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. తెదేపా యువ నాయకుడు ఆరిమిల్లి నిఖిల్రత్న ఆధ్వర్యంలో స్థానిక భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువ గళం... -
తపాలా బ్యాలెట్ ఓటింగ్లో ఇంకా ఇబ్బందులు
[ 06-05-2024]
తపాలా బ్యాలెట్ వినియోగంలో ఉద్యోగులకు రెండో రోజూ స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యాయి. శనివారం ఫెసిలిటేషన్ కేంద్రాలకు వెళ్లిన అనేక మంది ఉద్యోగులకు వారి ఓట్లు లేవని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. -
అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వైకాపా సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు
[ 06-05-2024]
ఓ తెదేపా మహిళా నాయకురాలిపై అసభ్యకరంగా పోస్టింగులు పెడుతున్న వైకాపా సోషల్ మీడియా ఖాతాదారులపై ఏలూరు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది. -
తపాలా ఓట్ల కోసం పోటా పోటీ
[ 06-05-2024]
ప్రస్తుత ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కానుండటంతో తపాలా ఓట్లను దక్కించుకొనేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో తపాలా బ్యాలెట్ ఓటింగ్ జరగనుంది. -
ఇటు భోజనాలు... అటు సొమ్ములు
[ 06-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. సామాన్య ప్రజలతోపాటు వివిధ వర్గాలను ప్రభావితం చేసేలా చిరుదోగ్యులపై దృష్టి సారించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు