ఉన్నది ఇద్దరే తనిఖీ మొక్కుబడే
ఏలూరు, భీమవరం, తణుకు, నరసాపురం తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పాలకొల్లు.. వంటి ఒక్కో పట్టణంలో రెండొందల నుంచి అయిదొందల వరకు ఆహార విక్రయ కేంద్రాలు(హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు) ఉన్నాయి. ఇతర చెప్పుకోదగ్గ ఒక్కో పట్టణంలోనూ
ఆహార విక్రయాలపై కొరవడిన నిఘా
ఈనాడు డిజిటల్, ఏలూరు, తాడేపల్లిగూడెం, న్యూస్టుడే
ఏలూరు, భీమవరం, తణుకు, నరసాపురం తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పాలకొల్లు.. వంటి ఒక్కో పట్టణంలో రెండొందల నుంచి అయిదొందల వరకు ఆహార విక్రయ కేంద్రాలు(హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు) ఉన్నాయి. ఇతర చెప్పుకోదగ్గ ఒక్కో పట్టణంలోనూ వంద నుంచి 200 వరకు ఇవి కనిపిస్తాయి. కొన్ని గ్రామాల్లోనూ పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఆహార భద్రత అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నవి పదిశాతానికి మించదు. పొందిన కేంద్రాల్లోనూ రెన్యువల్ చేయించుకున్నవి సగానికి సగమే ఉంటాయి. పెద్ద హోటళ్లకు కూడా దీనిపై శ్రద్ధ లేదంటే ఆహార భద్రత.. జిల్లాలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
* ఏలూరు సత్రంపాడు సెంటర్లో కొన్ని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు సాయంత్రం అయిదు గంటల నుంచి పదకొండు గంటల వరకు నిరాటంకంగా నడుస్తాయి. వందల మంది భోజనం చేస్తారు. మురుగు కాలువల పక్కన, నోరు తెరుచుకున్న బోదెల పైనా ఏర్పాటు చేసిన ఆ ఫాస్ట్ఫుడ్ సెంటర్ల వద్ద పరిశుభ్రత, నాణ్యత.. కనుచూపు మేరలో కనిపించవు.
* ఏలూరు బస్టాండు సెంటర్లో మూడు ఆహార విక్రయ వ్యాన్లు రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టి ఉంటాయి. విక్రయాలు సైతం జోరుగా సాగుతుంటాయి. విక్రయానికి ఎలాంటి అనుమతులూ లేవు.
* తాడేపల్లిగూడెంలో పెద్దభోజన హోటళ్లు 18, చిన్నవి 22 ఉన్నాయి. ఇవి కాకుండా 19 కర్రీపాయింట్లు, దాబాహోటళ్లు 12ఉన్నాయి. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, ఇతర ఫుడ్ అవుట్లెట్లు.. అన్నీ కలిపి కలిపి దాదాపు 200కు పైగా ఉంటాయి. వీటిలో లైసెన్సు పొందినవి పదహారే. గత తొమ్మిది నెలలుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు లేవు. కనీసం పర్యవేక్షణ చేసిన దాఖలాలు కూడా లేవు.
2021-22 సంవత్సరానికి ఫుడ్ లైసెన్సుల సంఖ్య సుమారు 2,000
వసూలు చేసిన అపరాధ రుసుము సుమారు రూ. 15 నుంచి 20 లక్షలు
ఇదీ పరిస్థితి
* ఉమ్మడి జిల్లాలో మొత్తం 45 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్ల అవసరముంది. ఉన్నది జిల్లాకొక్కరు చొప్పున ఇద్దరే. వీరితో తనిఖీలు నామమాత్రమే.
* ఏలూరు, భీమవరం వంటి ఒక్కో పట్టణంలోనే హోటళ్లు, ఫాస్ట్ఫుడ్, టిఫిన్, బిర్యానీ సెంటర్లు.. ఇతర అన్ని రకాల ఆహార పదార్థాలను విక్రయించే ఫుడ్ అవుట్లెట్లు.. కలిపి రెండు వేలకు పైగా ఉంటాయి. అంటే మిగతా చోట్ల ఉన్నవన్నీ అనధికారిక ఆహార విక్రయ కేంద్రాలే.
* ఎవరైనా అనుమతులు లేకుండా ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారని తెలిస్తే తొలుత నోటీసులిస్తారు. ఆ తరువాత సైతం అలాగే కొనసాగిస్తే రూ.అయిదు లక్షలు జరిమానాతోపాటు సదరు వ్యక్తులకు ఆరు నెలలు జైలు శిక్ష వేసే అవకాశముంది. కానీ 2021-22 సంవత్సరానికి నమోదు చేసిన కేసులు 25 మాత్రమే. దీంతో ఆహార భద్రత విభాగం పనితీరును అంచనా వేయొచ్చు.
* చాలా ఆహార విక్రయ కేంద్రాలకు లైసెన్సులు లేవు. వీధి విక్రయ కేంద్రాల్లోనే కాదు. చాలా హోటళ్లలో ఎలాంటి నిబంధనలూ పాటించట్లేదు. ఆయా మార్గదర్శకాలను పాటిస్తున్నామని పేర్కొంటూ దరఖాస్తు చేసుకుంటే అధికారులు తనిఖీ చేసి లైసెన్సు మంజూరు చేస్తారు. కానీ ఉభయ జిల్లాల్లో అసలు లైసెన్సుతో పనిలేకుండా.. వేల కొద్దీ ఆహార విక్రయ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిని పట్టించుకునే నాథుడు లేరు.
* చాలా హోటళ్లలో అనారోగ్యకర పరిస్థితుల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. జాతీయరహదారి పక్కనే డ్రమ్ముకు పొయ్యిలు ఏర్పాటు చేసి వాటితోనే వండుతూ ఉంటారు. పక్కనే మురుగు పారుతుంటుంది. మరోవైపు ఆయా పదార్థాలను దుమ్ముధూళి మధ్యే బహిరంగంగా వండుతూ ఉంటారు. ప్టాస్టిక్ కవర్లలో వేడి వేడి కూరలు వేసి ఇస్తుంటారు.
* ఉన్న సిబ్బందితోనే చేస్తున్నాం.. ‘ఉమ్మడి జిల్లాలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న అధికారులతోనే సాధ్యమైనంత మేర తనిఖీలు చేస్తున్నాం. ఫుడ్లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు అంతా కలిపి 7 వేలకు పైగా ఇచ్చాం. ఆహార పదార్థాలు విక్రయించేవారు తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాలి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు’ అని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాబందులే నయం.. పీక్కు తినడమే ఈ నేతల పని!
[ 10-05-2024]
వైకాపా నేతల కమీషన్ల కక్కుర్తి పరాకాష్టకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో వసూళ్ల దందా చేస్తూ సామాన్యులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. -
జగన్ సాగుబడిలో.. అన్నదాతకు అష్టకష్టాలు
[ 10-05-2024]
‘సేద్యం చేసే రైతు చేయి పట్టి నడిపిస్తా. పంటకు పెట్టుబడి సాయమందిస్తా’ అని అధికారం చేపట్టిన సీఎం జగన్ అయిదేళ్ల పాలనలో అన్నదాతను అష్టకష్టాలు పెట్టారు. -
ఉద్యోగాలేవి జగన్
[ 10-05-2024]
ఆశలు ఆవిరై.. బతుకు భారమైన వేళ నిరుద్యోగులందరూ ఆవేదనతో రగిలిపోతున్నారు. అరకొర జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. -
నేడు ఉండిలో ప్రజాగళం సభ
[ 10-05-2024]
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఉండిలో శుక్రవారం ఉదయం ప్రజాగళం సభలో పాల్గొంటారు. -
కొండంత రాగం తీసి... అన్నీ కోతేశారు
[ 10-05-2024]
రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాలో అధికంగా పండించే ఆయిల్పామ్ పంటను జగన్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
చివరి అస్త్రాలకు పదును
[ 10-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
తాయిలాల పంపిణీ లేకుండా నిఘా : కలెక్టర్
[ 10-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో 72 గంటల పాటు అమల్లో ఉంటుందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
తెరుచుకున్న రామలింగేశ్వరస్వామి ఆలయం
[ 10-05-2024]
నత్తారామేశ్వరం క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామి గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. -
జగన్ గారడీ..బీఎల్వోలకు బురిడీ!
[ 10-05-2024]
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా వృద్ధులు మృతిచెందితే వారి ఓట్లు తొలగించేలా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్వోలను సీఎం జగన్ బురిడీ కొట్టించారు. -
మూడు రోజుల్లో సైకో పాలనకు చరమగీతం
[ 10-05-2024]
అయిదేళ్లుగా సైకోపాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మరో మూడు రోజుల్లో వైకాపా పాలనకు చరమగీతం పాడనున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎంపీ అభ్యర్ధి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
కూటమి గెలుపుతోనే భవిష్యత్తు: దేవినేని
[ 10-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
గుక్కెడు నీటికీ యాతనే!
[ 10-05-2024]
ఏలూరు జిల్లాలోని పురపాలక సంఘ ప్రజలను తాగునీటి కష్టాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. -
అరాచక పాలకులు మనకొద్దు: రఘురామ
[ 10-05-2024]
అరాచక పాలకులు మనకొద్దని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్ను రాజకీయాలకు శాశ్వతంగా దూరం చేద్దామని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
11న సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలు
[ 10-05-2024]
ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 నుంచి 14న సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ