భవిత అంటేనే అలుసు
ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ప్రభుత్వం నిర్వహణ ఖర్చులు మంజూరు చేయకపోవడంతో కనీస అవసరాలకు సమస్యలు తప్పడం లేదు. పిల్లలకు ఇచ్చే రవాణా ఛార్జీలు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించే ఉపకార వేతనాలను రెండేళ్లుగా ఇవ్వడం లేదు.
అందని నిర్వహణ ఖర్చులు
ఉపకార వేతనాలు, రవాణా ఛార్జీల ఊసే లేదు
కైకలూరు,మండవల్లి, న్యూస్టుడే: ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ప్రభుత్వం నిర్వహణ ఖర్చులు మంజూరు చేయకపోవడంతో కనీస అవసరాలకు సమస్యలు తప్పడం లేదు. పిల్లలకు ఇచ్చే రవాణా ఛార్జీలు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించే ఉపకార వేతనాలను రెండేళ్లుగా ఇవ్వడం లేదు. కొన్ని చోట్ల ప్రతి వారం సేవలందించే ఫిజియోథెరపిస్టులు సక్రమంగా రావడం లేదు.
నిధుల కొరత.. మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్తు ఛార్జీలు, మరుగుదొడ్ల నిర్వహణకు ఒక్కో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు చొప్పున కేటాయిస్తోంది. కరోనా అనంతరం రెండేళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదు. దీంతో పాఠశాల నిర్వహణకు సిబ్బంది తమ సొంత నగదునే ఖర్చు చేసి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి విద్యార్థికి బస్సు లేదా ఆటో ఛార్జీలకు నెలకు రూ.250 చెల్లించాల్సి ఉండగా మూడేళ్లుగా వాటి ఊసే లేదు.
అంతంత మాత్రంగానే
దివ్యాంగుల శాఖ ద్వారా భవిత కేంద్రాల్లో చదివే ఒకటి నుంచి 8 వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ.వెయ్యి, 8వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు రూ.1,200 చొప్పున ఉపకార వేతనాలు ఇస్తున్నారు. మూడేళ్లుగా వీటిని అందించడంలోనూ తీవ్ర జాప్యం నెలకొంది. ఇక ఎస్ఎస్ఏ నిధులతో అవసరమైన వారికి ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, కంటి అద్దాలు ఉచితంగా అందించేవారు. ప్రస్తుతం ఇదీ అంతంతమాత్రంగానే జరుగుతోంది.
దివ్యాంగులైన చిన్నారులకు ఫిజియోథెరపీ సేవలందించడంతోపాటు వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు సమగ్రశిక్షా అభియాన్ ద్వారా భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను వీటిల్లో నియమించి బాలబాలికల్లో ఆసక్తి కలిగించేలా ప్రత్యేక ఉపకరణాల సాయంతో బోధన అందిస్తున్నారు. జన్యుపరమైన లోపాలు, పోలియో లక్షణాలున్న పిల్లలనూ వీటిల్లో చేర్చుకుంటారు.
ప్రతిపాదనలు పంపాం..
భవిత కేంద్రాల నిర్వహణ నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కరోనా అనంతరం నిధుల కొరత ఏర్పడింది. కొన్ని కేంద్రాలకు మాత్రమే ఆటో ఛార్జీలు అందించాం. ఫిజియోథెరపిస్టులు అవసరం మేరకు ప్రతి మండలానికి వెళ్తున్నారు. ఉపకార వేతనాల అంశం దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలో ఉంది. -పి.శ్యామ్సుందర్, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్, పశ్చిమగోదావరి జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాబందులే నయం.. పీక్కు తినడమే ఈ నేతల పని!
[ 10-05-2024]
వైకాపా నేతల కమీషన్ల కక్కుర్తి పరాకాష్టకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో వసూళ్ల దందా చేస్తూ సామాన్యులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. -
జగన్ సాగుబడిలో.. అన్నదాతకు అష్టకష్టాలు
[ 10-05-2024]
‘సేద్యం చేసే రైతు చేయి పట్టి నడిపిస్తా. పంటకు పెట్టుబడి సాయమందిస్తా’ అని అధికారం చేపట్టిన సీఎం జగన్ అయిదేళ్ల పాలనలో అన్నదాతను అష్టకష్టాలు పెట్టారు. -
ఉద్యోగాలేవి జగన్
[ 10-05-2024]
ఆశలు ఆవిరై.. బతుకు భారమైన వేళ నిరుద్యోగులందరూ ఆవేదనతో రగిలిపోతున్నారు. అరకొర జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. -
నేడు ఉండిలో ప్రజాగళం సభ
[ 10-05-2024]
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఉండిలో శుక్రవారం ఉదయం ప్రజాగళం సభలో పాల్గొంటారు. -
కొండంత రాగం తీసి... అన్నీ కోతేశారు
[ 10-05-2024]
రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాలో అధికంగా పండించే ఆయిల్పామ్ పంటను జగన్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
చివరి అస్త్రాలకు పదును
[ 10-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
తాయిలాల పంపిణీ లేకుండా నిఘా : కలెక్టర్
[ 10-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో 72 గంటల పాటు అమల్లో ఉంటుందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
తెరుచుకున్న రామలింగేశ్వరస్వామి ఆలయం
[ 10-05-2024]
నత్తారామేశ్వరం క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామి గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. -
జగన్ గారడీ..బీఎల్వోలకు బురిడీ!
[ 10-05-2024]
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా వృద్ధులు మృతిచెందితే వారి ఓట్లు తొలగించేలా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్వోలను సీఎం జగన్ బురిడీ కొట్టించారు. -
మూడు రోజుల్లో సైకో పాలనకు చరమగీతం
[ 10-05-2024]
అయిదేళ్లుగా సైకోపాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మరో మూడు రోజుల్లో వైకాపా పాలనకు చరమగీతం పాడనున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎంపీ అభ్యర్ధి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
కూటమి గెలుపుతోనే భవిష్యత్తు: దేవినేని
[ 10-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
గుక్కెడు నీటికీ యాతనే!
[ 10-05-2024]
ఏలూరు జిల్లాలోని పురపాలక సంఘ ప్రజలను తాగునీటి కష్టాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. -
అరాచక పాలకులు మనకొద్దు: రఘురామ
[ 10-05-2024]
అరాచక పాలకులు మనకొద్దని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్ను రాజకీయాలకు శాశ్వతంగా దూరం చేద్దామని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
11న సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలు
[ 10-05-2024]
ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 నుంచి 14న సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు