logo

వైకాపాకు మరో అవకాశం ఇస్తే విధ్వంసమే : తెదేపా

‘ఇదేం కర్మ..ఈ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా డిసెంబరు 2న తాడేపల్లిగూడెంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటన ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు.

Updated : 26 Nov 2022 06:29 IST

మాట్లాడుతున్న సీతారామలక్ష్మి, పక్కన రామరాజు, రామానాయుడు తదితరులు

తాడేపల్లిగూడెం టూటౌన్‌, న్యూస్‌టుడే : ‘ఇదేం కర్మ..ఈ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా డిసెంబరు 2న తాడేపల్లిగూడెంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటన ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. బహిరంగ సభకు అనువైన ప్రాంతాలను శుక్రవారం ఆమెతోపాటు తెదేపా నాయకులు పరిశీలించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ అధ్యక్షుడు వలవల మల్లికార్జునరావు (బాబ్జీ) ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిసెంబరు 2న సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబునాయడు ప్రసంగిస్తారన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ వైకాపాకు మరో అవకాశం ఇస్తే విధ్వంసం, అరాచకం, దౌర్జన్యాలు పెరిగిపోతాయన్నారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ ఆక్వా రైతులు, వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వ పాలనపై విసుగెత్తిపోయారన్నారు. తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం పేరుతో ప్రభుత్వం ప్రజల్ని నిలువుదోపిడీ చేస్తుందన్నారు. మంత్రి కారుమూరి  తన శాఖను తప్పించి మిగిలిన అన్నికార్యక్రమాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు.  గొర్రెల శ్రీధర్‌, పాతూరి రాంప్రసాద్‌చౌదరి, పట్నాల రాంపండు, పరిమి రవికుమార్‌, పోతుల అన్నవరం, షేక్‌ బాజీ, కాకర్ల సుభద్ర, కృష్ణమోహన్‌, మద్ధిపాటి ధర్మేంద్ర  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని