పెళ్లిళ్లు వందల్లో... నమోదు పదుల్లోనే
మూడు ముళ్లు, ఏడడుగుల బంధంతో యువతీయువకులు వైవాహిక జీవితంలోకి ఆనందంగా అడుగు పెడతారు. పెళ్లి తంతును బంధుమిత్రుల సమక్షంలో సంబరంగా జరుపుకొంటారు.
ధ్రువీకరణ తప్పనిసరి అంటున్న అధికారులు
కొత్తగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కు అవకాశం
ఏలూరు వన్టౌన్, న్యూస్టుడే
మూడు ముళ్లు, ఏడడుగుల బంధంతో యువతీయువకులు వైవాహిక జీవితంలోకి ఆనందంగా అడుగు పెడతారు. పెళ్లి తంతును బంధుమిత్రుల సమక్షంలో సంబరంగా జరుపుకొంటారు. ఆ జ్ఞాపకాలను ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరచుకుంటారు. కానీ, అంతే ప్రాధాన్యమున్న వివాహ ధ్రువీకరణపత్రాలు పొందే విషయంలో మాత్రం చాలామంది నిర్లిప్తంగా ఉంటున్నారు. పెళ్లి జరిగిన తర్వాత సబ్రిజిస్ట్రార్ కార్యాలయం, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఏలూరు నియోజకవర్గ పరిధిలో గత అయిదు నెలల్లో 500కు పైగా పెళ్లిళ్లు జరిగాయి. మార్చి నెలాఖరు నాటికి మరో 200 వరకు జరగవచ్చని పురోహితులు అంచనా వేస్తున్నారు. చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆసక్తి చూపలేదు. నియోజకవర్గం(ఏలూరు నగరం)లో అక్టోబరు 59, నవంబరు 41, డిసెంబరులో 54 మంది చొప్పున వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు పొందారు. నగర పరిధిలోనే ఇలా ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే వివాహాలను నమోదు చేయించుకోవాల్సి వచ్చేది. ప్రభుత్వం ప్రస్తుతం సచివాలయాల్లోనూ ఈ అవకాశం కల్పించింది. వివాహం చేసుకున్న నవ దంపతులు మూడు నెలల్లోపు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నెలలోపు చేస్తే ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. నెల దాటితే రూ.100 చలానా కట్టాలి. మూడు నెలలు దాటితే సమీపంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్లో చేయించుకుంటే మేలు
‘ప్రస్తుతం వందల సంఖ్యలో వివాహాలు జరుగుతున్నా విదేశాలకు వెళ్లేవారు, లీగల్ అవసరాలున్నవారు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ప్రతి జంట వివాహ బంధాన్ని చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. భవిష్యత్తులో వీటితో ఎన్నో ఉపయోగాలున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ విధానం అమలులోకి వచ్చిందని, స్లాట్ బుక్ చేసుకుంటే సంబంధిత తేదీ, సమయంలో వచ్చి ధ్రువపత్రాలు పొందవచ్చు’ అని ఏలూరు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ అడ్డాల వెంకటేశ్వరరావు తెలిపారు.
రిజిస్ట్రేషన్తో ప్రయోజనాలు
విదేశాలకు వెళ్లే దంపతులకు పాస్ పోర్టు, వీసా, వర్క్ పర్మిట్, బీమా తదితర విషయాల్లో వివాహ ధ్రువపత్రం ఉపయోగపడుతుంది. ఈ పత్రం ఉంటే ఉద్యోగులు తమ భార్య లేదా భర్తను నామినీగా నమోదుచేయించుకోవడానికి వీలుంటుంది. భవిష్యత్తులో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎదురైతే కేసులు, కోర్టులో సాక్ష్యాల విషయంలో ఇది ఉపయోగపడుతుంది. వివరాలతో నింపిన దరఖాస్తుతోపాటు దంపతులిద్దరి ఆధార్ నకళ్లు, జనన ధ్రువీకరణ పత్రాలు, పదో తరగతి మార్కులు జాబితాలు, పాస్పోర్టు సైజ్ ఫొటోలు, శుభలేఖ, తాళి కడుతున్న చిత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్