తండ్రి పెదకర్మకు ట్రాక్టర్ తీసుకొస్తుండగా ప్రమాదం
తండ్రి పెదకర్మ నేపథ్యంలో భోజనాల ఏర్పాట్లకు అవసరమైన నీళ్ల ట్యాంకర్ కోసం ట్రాక్టర్ తీసుకొస్తుండగా మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో అన్న మృతిచెందగా.. తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.
అన్న మృతి.. తమ్ముడికి తీవ్ర గాయాలు
లింగపాలెం, న్యూస్టుడే: తండ్రి పెదకర్మ నేపథ్యంలో భోజనాల ఏర్పాట్లకు అవసరమైన నీళ్ల ట్యాంకర్ కోసం ట్రాక్టర్ తీసుకొస్తుండగా మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో అన్న మృతిచెందగా.. తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నరసన్నపాలెం పంచాయతీ పరిధి తిమ్మక్కపాలెం గ్రామానికి చెందిన కె.రాంబాబు(35), కె.సర్వేశ్వరరావు అన్నదమ్ములు. వీరి తండ్రి ఇటీవల చనిపోయారు. ఆయన పెదకర్మ బుధవారం నిర్వహించాల్సి ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే భోజనాల కోసం నీళ్ల ట్యాంకర్ అవసరం కాగా.. దానికి సంబంధించి సర్వేశ్వరరావు డ్రైవర్గా పనిచేసే ట్రాక్టర్ను తోచలకరాయుడుపాలెం నుంచి తీసుకొస్తున్నారు. రాంబాబు వాహనం నడుపుతున్నారు. మార్గం మధ్యలో కొత్తపల్లి శివారు పెద్ద చెరువు వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లి తిరగబడింది. ఆ సమయంలో సర్వేశ్వరరావు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు ట్రాక్టర్ను పక్కకు జరిపి ఇద్దరిని బయటకు తీశారు. అయితే రాంబాబు అప్పటికే మృతిచెందగా సర్వేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. రాంబాబుకు భార్య, పాప, బాబు ఉన్నారు.
రహదారి ప్రమాదంలో యువకుడి దుర్మరణం
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన ఘటనపై గ్రామీణ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు..కోనసీమ జిల్లా ఐ.పోలవరం గ్రామానికి చెందిన రూపాకుల అనంత పద్మనాభశర్మ (36) కొన్ని రోజుల కిందట ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా మార్గంమధ్యలో జాతీయ రహదారి 216(ఏ) ఎల్.అగ్రహారం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో యువకుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఏఎస్సై గోపీనాథరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
నకిలీ నగలతో రుణం!
రూ.8 లక్షలు కాజేసిన సంస్థ ఉద్యోగులు
ఏలూరు నేర వార్తలు, న్యూస్టుడే: బంగారు నగలు తాకట్టు పెట్టుకుని వడ్డీకి డబ్బులిచ్చే ఓ సంస్థలో నకిలీ నగలు పెట్టి ఆ సంస్థ ఉద్యోగులే డబ్బు తీసుకున్నారు. విషయం బయటపడటంతో ఏలూరు టూటౌన్ పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు ఆర్ఆర్ పేటలోని కాగుమట్టం ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తుంటారు. సంస్థలో పని చేస్తున్న మేనేజర్ అవినాష్కుమార్, అసిస్టెంట్ మేనేజర్ తలిత, ఎగ్జిక్యూటివ్ శివకుమార్లు ఏకమై నకిలీ నగలు కొన్ని సంస్థలో తాకట్టు పెట్టి ఇటీవల రూ.8.58 లక్షల రుణం తీసుకున్నారు. ఈ విషయం బయటపడటంతో ఫైనాన్స్ సంస్థ హెడ్ కుమార్బాబు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మోసానికి పాల్పడిన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాబందులే నయం.. పీక్కు తినడమే ఈ నేతల పని!
[ 10-05-2024]
వైకాపా నేతల కమీషన్ల కక్కుర్తి పరాకాష్టకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో వసూళ్ల దందా చేస్తూ సామాన్యులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. -
జగన్ సాగుబడిలో.. అన్నదాతకు అష్టకష్టాలు
[ 10-05-2024]
‘సేద్యం చేసే రైతు చేయి పట్టి నడిపిస్తా. పంటకు పెట్టుబడి సాయమందిస్తా’ అని అధికారం చేపట్టిన సీఎం జగన్ అయిదేళ్ల పాలనలో అన్నదాతను అష్టకష్టాలు పెట్టారు. -
ఉద్యోగాలేవి జగన్
[ 10-05-2024]
ఆశలు ఆవిరై.. బతుకు భారమైన వేళ నిరుద్యోగులందరూ ఆవేదనతో రగిలిపోతున్నారు. అరకొర జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. -
నేడు ఉండిలో ప్రజాగళం సభ
[ 10-05-2024]
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఉండిలో శుక్రవారం ఉదయం ప్రజాగళం సభలో పాల్గొంటారు. -
కొండంత రాగం తీసి... అన్నీ కోతేశారు
[ 10-05-2024]
రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాలో అధికంగా పండించే ఆయిల్పామ్ పంటను జగన్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
చివరి అస్త్రాలకు పదును
[ 10-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
తాయిలాల పంపిణీ లేకుండా నిఘా : కలెక్టర్
[ 10-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో 72 గంటల పాటు అమల్లో ఉంటుందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
తెరుచుకున్న రామలింగేశ్వరస్వామి ఆలయం
[ 10-05-2024]
నత్తారామేశ్వరం క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామి గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. -
జగన్ గారడీ..బీఎల్వోలకు బురిడీ!
[ 10-05-2024]
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా వృద్ధులు మృతిచెందితే వారి ఓట్లు తొలగించేలా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్వోలను సీఎం జగన్ బురిడీ కొట్టించారు. -
మూడు రోజుల్లో సైకో పాలనకు చరమగీతం
[ 10-05-2024]
అయిదేళ్లుగా సైకోపాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మరో మూడు రోజుల్లో వైకాపా పాలనకు చరమగీతం పాడనున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎంపీ అభ్యర్ధి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
కూటమి గెలుపుతోనే భవిష్యత్తు: దేవినేని
[ 10-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
గుక్కెడు నీటికీ యాతనే!
[ 10-05-2024]
ఏలూరు జిల్లాలోని పురపాలక సంఘ ప్రజలను తాగునీటి కష్టాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. -
అరాచక పాలకులు మనకొద్దు: రఘురామ
[ 10-05-2024]
అరాచక పాలకులు మనకొద్దని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్ను రాజకీయాలకు శాశ్వతంగా దూరం చేద్దామని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
11న సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలు
[ 10-05-2024]
ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 నుంచి 14న సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్