logo

సమాజ సేవలతో సుస్థిర స్థానం

సమాజానికి సేవలు అందించిన వారు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోతారని పలువురు వక్తలు అన్నారు.

Published : 23 Mar 2023 04:38 IST

ఆదినారాయణ దంపతులకు సత్కారం

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: సమాజానికి సేవలు అందించిన వారు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోతారని పలువురు వక్తలు అన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యనిపుణుడు సుంకర వెంకట ఆదినారాయణరావు ఆత్మీయ సత్కార సభను సుంకర ట్రస్టు ఆధ్వర్యంలో భీమవరం టౌన్‌ హాల్‌లో బుధవారం రాత్రి నిర్వహించారు. ట్రస్టు అధ్యక్షుడు సుంకర వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆదినారాయణ రావు వేలాది మంది పోలియో బాధితులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అనంతరం ట్రస్టు, ఐఎంఏ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆదినారాయణరావు, శశిప్రభ దంపతులను ఘనంగా సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని