భక్తి, ప్రేమ, త్యాగాల.. సమ్మిళతమే రంజాన్...
అందరూ కలిసి మెలిసి ఉండాలి. కష్టం వచ్చినప్పుడు పొరుగు వారిని ఆదుకోవాలన్నదే సర్వమతాల సారాంశం. భక్తి, ప్రేమ, త్యాగాల.. సమ్మిళతమే రంజాన్.
నేటి నుంచి ఉపవాస నెల ప్రారంభం
పవిత్ర మాస ప్రార్థనలకు ఏర్పాట్లు
ఆగిరిపల్లిలో సిద్ధమైన మసీదు
ఆగిరిపల్లి, న్యూస్టుడే : అందరూ కలిసి మెలిసి ఉండాలి. కష్టం వచ్చినప్పుడు పొరుగు వారిని ఆదుకోవాలన్నదే సర్వమతాల సారాంశం. భక్తి, ప్రేమ, త్యాగాల.. సమ్మిళతమే రంజాన్. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు నిర్వహించుకునే అతి పెద్ద పండగ ఇది. ఆ పవిత్ర మాస శుభఘడియలు రానే వచ్చాయి. నెలవంక దర్శనంతో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు మసీదులను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.
ప్రాథమిక విధులకు ప్రాధాన్యం
ప్రతి ముస్లిం ఐదు ప్రాథమిక విధుల ద్వారా ముందుకు పయనిస్తారు. కలిమా చదవడం, రోజూ ఐదు సార్లు నమాజ్ చేయడం, రంజాన్ నెలలో ఉపవాసం, తాను సంపాదించిన దాంట్లో కొంత భాగం దానం చేయడం(జకాత్), హజ్ చేయడం. వీటిల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న ఉపవాసాల నెలే రంజాన్. నెల రోజుల ఉపవాస దీక్షతో శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుందన్నది వారి విశ్వాసం.
అందరి విధి
పవిత్ర ఖురాన్ ప్రకారం ప్రతి ముస్లిం రంజాన్ నెలలో ఉపావసం ఉండటం విధి. దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు తప్పనిసరిగా పాటించాలి. అనారోగ్యంతో బాధపడే వారు, బాలింతలు, గర్భిణులకు మినహాయింపు ఉంటుంది. అయితే వారు తమ సమస్యలు తీరాక ఖజా ఉపవాసాలు ఉండాలి.
ఆధ్యాత్మిక జీవన విధానంపై శిక్షణ
ఉపవాసం సందర్భంగా శరీరం, మనసును పవిత్రంగా ఉంచుకొని ఉదయం సూర్యోదయం లోపు, సూర్యాస్తమయం తరువాత మాత్రమే ఆహారం తీసుకోవడం ప్రధాన విషయం. ఉపవాసం ఆచరిస్తున్న సమయంలో అసత్యం పలకరాదు, అధర్మంగా ప్రవర్తించరాదు. తద్వారా దైవంపై ప్రేమ అధికమవుతుంది. తదుపరి జీవితానికి ఈ నెల ఒక ‘శిక్షణ’గా ఉపయోగపడుతుంది. రంజాన్ నెల ప్రధాన ధ్యేయం ఇదే.
జకాత్, ఫిత్రా తప్పనిసరి
దానం చేయగలిగిన స్థితిలో ఉన్న ప్రతి ముస్లిం తన మిగులు సంపాదనలో కొంత పేదలకు పంచిపెట్టడమే జకాత్. ధన వ్యామోహాన్ని దూరం చేయడం, పేదవారు కూడా పండుగను సంతోషంగా చేసుకోవడానికే అల్లాహ్ జకాత్ను తప్పనిసరి చేశారు. ఇది ఏటా కొనసాగాలి. అదే విధంగా అప్పుడే పుట్టిన బిడ్డతో సహా అందరూ ఫిత్రాను పేదవారికి ఇవ్వాలి.
ఎతికాఫ్..
రంజాన్ నెలలో మరో పవిత్ర అంశం ఎతికాఫ్. ఈ నెలలో చివరి పది రోజులు కుటుంబాన్ని తాత్కాలికంగా వదిలి మసీదుల్లో దైవ ప్రార్థనలతో గడపటమే. అతి పవిత్రమైన లైలతుల్ ఖద్ర్ ఈనెలలోనే వస్తుంది. ఈ మాసంలోనే 27వ రోజు రాత్రిని పుణ్యరాత్రిగా పరిగణిస్తారు. ఆ రాత్రి జాగారం ఉండి దైవ ప్రార్థనలతో గడుపుతారు. నెల రోజుల పాటు చదివిన ఖురాన్ చివరి అంకాన్ని ఆ రాత్రి ముగిస్తారు. అల్లాహ్ కృప కోసం ప్రత్యేకంగా దువా చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అతడు చాలా సేపు బంతిని బౌండరీ దాటించలేకపోయాడు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్