logo

Student Murder: ఏలూరులో నాలుగో తరగతి విద్యార్థి హత్య

ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో దారుణ హత్య జరిగింది. పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమశాఖ వసతిగృహంలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.

Updated : 11 Jul 2023 12:19 IST

బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో దారుణ హత్య జరిగింది. పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమశాఖ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్‌(9)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత విద్యార్థి హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఎవరు.. ఎందుకు హత్య చేశారనే కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే వసతిగృహ సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న బుట్టాయగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని