Murder: అనుమానం పెనుభూతమై!.. వివాహిత దారుణహత్య
ప్రశాంత వాతావరణానికి నెలవైన పెనుగొండలో వివాహిత హత్య కలకలం రేపింది. పోలీసులు తొలుత గుర్తుతెలియని మహిళగా దర్యాప్తు చేపట్టినా కొద్ది సేపటికే ఆమె వివరాలు తెలుసుకున్నారు.
పెనుగొండ, మార్టేరు, న్యూస్టుడే: ప్రశాంత వాతావరణానికి నెలవైన పెనుగొండలో వివాహిత హత్య కలకలం రేపింది. పోలీసులు తొలుత గుర్తుతెలియని మహిళగా దర్యాప్తు చేపట్టినా కొద్ది సేపటికే ఆమె వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెనుగొండ - దేవ ఆర్అండ్బీ మార్గంలోని అడ్డపుంత పంట కాలువలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడి చేరుకుని పరిశీలించగా మృతదేహం బోర్లా పడి ఉండటం, దుస్తులు చిరిగి ఉండటంతోపాటు గాయాలు ఉండటంతో వెంటనే అప్రమత్తమయ్యారు. మృతదేహాన్ని గట్టుకు చేర్చి వివాహితగా గుర్తించి, ఎవరనే దానిపై ఆరా తీశారు.
పెనుగొండ మండలం దొంగరావిపాలెం గ్రామానికి చెందిన నందిని(25)గా గుర్తించారు. పదునైన ఆయుధంతో ఆమె వీపు, ఎడమ జబ్బ, ఛాతిపై పొడిచి హత్యచేసిన అనంతరం పంట పొలాల మధ్య ఉన్న కాలువలో పడేసినట్లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కొంత పెనుగులాట జరగడంతో ఆమె వీపుపై ఉన్న దుస్తులు చిరిగిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఎస్పీ యు.రవిప్రకాశ్, నరసాపురం డీఎస్పీ రవిమనోహరచారి ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను సేకరించారు. వీఆర్వో లక్కవరపు ప్రసాద్ ఫిర్యాదు మేరకు సీఐ జీవీవీ.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. డాగ్ స్క్వాడ్తో ఘటనా స్థలంలో తనిఖీలు చేశారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రేమించి పెళ్లి చేసుకుని..
నందిని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో తల్లి వద్ద ఉంటున్న సమయంలో కొఠాలపర్రు గ్రామానికి చెందిన చివటం రాంప్రసాద్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వీరు 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి 18 నెలల బాబు దేవాంత్ ఉన్నాడు. ప్రస్తుతం పెనుగొండలో నివసిస్తున్న రాంప్రసాద్ పెయింటింగ్ పని చేస్తుండగా నందిని గృహణి. కుమారై హత్య సమాచారం తెలుసుకున్న తల్లితోపాటు బంధువులంతా స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకుని బోరున విలపించారు.
గౌరీపట్నం వెళ్దామని చెప్పి..
సోమవారం రాత్రి గౌరీపట్నంలోని తల్లి వద్దకు వెళ్దామని చెప్పి నందినిని బయటకు తీసుకొచ్చిన భర్త రాంప్రసాద్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు పడుతున్నారు. సోమవారం ఉదయం తణుకు వచ్చిన అత్తగారిని కలిసిన రాంప్రసాద్ తన భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ చెప్పగా ఆమె సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. ఈలోగా క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని భావిస్తున్నారు. ఈ హత్య ఉదంతంలో భర్తతోపాటు మరెవరన్నా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. భర్త రాంప్రసాద్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగాలు కావాలంటే తెదేపా రావాలి
[ 06-05-2024]
‘జాబ్ క్యాలెండర్ పేరుచెప్పి జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చి యువతను జగన్ నిండా ముంచారు. వైకాపా పాలనకు యువతే చరమగీతం పాడాలి’ అంటూ తెదేపా నేత నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఏలూరులో ఆదివారం నిర్వహించిన యువగళం సభలో విద్యార్థులు, యువతతో ముఖాముఖీ నిర్వహించారు. -
జగన్ జమానాలో నిధులు దోచేసి... అభివృద్ధి ఆపేసి!
[ 06-05-2024]
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు... వైకాపా అధికారంలోకి వచ్చాక... ఆ పట్టుగొమ్మలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొడలిపోటు వేశారు. అయిదేళ్ల జగన్ జమానాలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. -
జాగాలపై జగన్ మూకలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఊరూరా ఆక్రమణలపర్వం
[ 06-05-2024]
‘జాగా కనిపిస్తే..పాగా వేసేయడమే’ అన్నట్లు జగన్ అనుచరగణం ఊరూరా చెలరేగిపోయింది. అయిదేళ్ల జమానాలో మమ్మల్ని ఎవర్రా ఆపేది అన్నట్లు ఆక్రమణల పర్వం సాగింది. ప్రజల సామూహిక అవసరాలకు వినియోగించాల్సిన స్థలాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయాయి. -
కక్ష సాధింపుల్లో.. అధినేతకు పెద్దన్న
[ 06-05-2024]
జిల్లాలో సంపన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన కీలక కేంద్రమది. తొలి నుంచి ప్రశాంత వాతావరణానికి నిలయం. జాతరలైనా, పండుగలైనా లౌకికత గోచరిస్తుంది. ఇలాంటి ప్రాంతం వైకాపా జమానాలో అరాచక పాలనకు, కక్ష సాధింపులకు వేదికైంది. -
బటన్ నొక్కుడు.. వట్టిదేనా జగన్?
[ 06-05-2024]
‘మహిళల సంక్షేమమే నా లక్ష్యం.. అతివల ఆర్థిక స్వావలంబనే నా ధ్యేయం’ అంటూ సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ వేదికలపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. అమలు చేసే విషయంలో మాత్రం ఆయనకు చిత్తశుద్ధి కొరవడింది. దీనికి నిదర్శనమే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం. అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. -
నీట్కు 43 మంది గైర్హాజరు
[ 06-05-2024]
జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు 43 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1361 మంది హాజరు కావాల్సి ఉండగా 1318 మంది హాజరయ్యారు. -
రంగులు మారలే... ప్రలోభాలు తగ్గలే!
[ 06-05-2024]
నరసాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు పట్టణంలోని ఎండీయూ ఆపరేటర్. ఆయన నిత్యం ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉంటారు. ఎన్నికల ప్రచారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
చీకటి పాలన నుంచి త్వరలో విముక్తి : నారా రోహిత్
[ 06-05-2024]
అయిదేళ్ల చీకటి పాలన నుంచి త్వరలోనే విముక్తి పొందుతామని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. తెదేపా యువ నాయకుడు ఆరిమిల్లి నిఖిల్రత్న ఆధ్వర్యంలో స్థానిక భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువ గళం... -
తపాలా బ్యాలెట్ ఓటింగ్లో ఇంకా ఇబ్బందులు
[ 06-05-2024]
తపాలా బ్యాలెట్ వినియోగంలో ఉద్యోగులకు రెండో రోజూ స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యాయి. శనివారం ఫెసిలిటేషన్ కేంద్రాలకు వెళ్లిన అనేక మంది ఉద్యోగులకు వారి ఓట్లు లేవని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. -
అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వైకాపా సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు
[ 06-05-2024]
ఓ తెదేపా మహిళా నాయకురాలిపై అసభ్యకరంగా పోస్టింగులు పెడుతున్న వైకాపా సోషల్ మీడియా ఖాతాదారులపై ఏలూరు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది. -
తపాలా ఓట్ల కోసం పోటా పోటీ
[ 06-05-2024]
ప్రస్తుత ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కానుండటంతో తపాలా ఓట్లను దక్కించుకొనేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో తపాలా బ్యాలెట్ ఓటింగ్ జరగనుంది. -
ఇటు భోజనాలు... అటు సొమ్ములు
[ 06-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. సామాన్య ప్రజలతోపాటు వివిధ వర్గాలను ప్రభావితం చేసేలా చిరుదోగ్యులపై దృష్టి సారించింది.