పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు.
పెరుగుతున్న మూత్రపిండ వ్యాధిగ్రస్తులు
డయాలసిస్ కేంద్రాల కొరత.. పట్టించుకోని ప్రభుత్వం
‘దశాబ్దాల పాటు పాలించిన పాలకులు కిడ్నీ బాధితుల గురించి పట్టించుకోలేదు. మేం అలా కాదు. మూత్రపిండ బాధితుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాం, వ్యాధి విస్తరణకు మూలాలు ఏమిటో కనుక్కొంటాం. సమూల నిర్మూలనకు చర్యలు తీసుకుంటాం. డయాలసిస్ కేంద్రాల పనితీరును మెరుగుపరుస్తాం. మూత్రపిండ సంబంధిత వ్యాధి బాధితులకు అండగా నిలుస్తాం.
డయాలసిస్ రోగులను ఉద్దేశించి గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన హామీ ఇది.
ఈనాడు డిజిటల్, భీమవరం, నరసాపురం, తణుకు గ్రామీణ న్యూస్టుడే: డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. భీమవరం 2, తణుకు 2, తాడేపల్లిగూడెం 1, ఏలూరు 4 ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా రోజూ సుమారు 480 మందికి మాత్రమే డయాలసిస్ సేవలందుతున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో డయాలసిస్ యంత్రాలను బట్టి ఇప్పటికే నిర్ణీత రోగుల సంఖ్య ఉండటంతో కొత్తగా వచ్చిన వారికి సేవలందడం లేదు. పెరుగుతున్న రోగుల సంఖ్యకనుగుణంగా వైద్యసేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఉదాహరణకు భీమవరం ఆసుపత్రిలో 23 యంత్రాలుండగా, 15 మంది సిబ్బంది అయిదు షిఫ్ట్ల్లో 24 గంటలు పనిచేస్తున్నా గరిష్ఠంగా 65 మందికి మాత్రమే సేవలందుతున్నాయి. వ్యాధి తీవ్రతను బట్టి ఒక్కొక్కరికి రెండున్నర నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. సుమారు 180 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందుతుండగా, నిరీక్షణ జాబితాలో 45 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మిగిలిన అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉండటంతో రాజమహేంద్రవరం, విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి వారు ఆర్థికంగా కుదేలవుతున్నారు.
ఆర్థిక భారం.. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెంచామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలను పెంచకపోవడంపై రోగులు, వారి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి వారానికి రెండు నుంచి నాలుగు సార్లు డయాలసిస్ చేయించాలి. ఒక్కసారికి కనీసం రూ.8వేల నుంచి రూ.12వేల వరకు ఖర్చవుతుంది. ఒక ఇంజెక్షన్ ఖరీదు రూ.2వేల వరకు ఉంటుంది. పైగా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొనుగోలు చేస్తుండటంతో ఆర్థికంగా మరింత భారమవుతోందని బాధితులు వాపోతున్నారు.
- రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నా. వ్యవసాయ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే నేను ప్రైవేటుగా డయాలసిస్ చేయించుకోలేను. ఆరోగ్యశ్రీలో చేయించుకుందామని ఆసుపత్రికి వెళ్తే స్లాట్ ఖాళీ లేదని చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకునేందుకు వేల రూపాయలు ఖర్చువుతున్నాయని భీమవరానికి చెందిన వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు.
- ఆరేళ్ల క్రితం మా అమ్మ అనారోగ్యానికి గురైంది. ఉన్నట్టుండి కాళ్లు వాపులు రావడంతో స్థానిక వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించగా మూత్రపిండాలు చెడిపోయినట్లు తేలింది. మొదట్లో మందులు వాడినా తగ్గకపోవడంతో డయాలసిస్ చేయించుకోవాలని సూచించారు. స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో వారానికి రెండు సార్లు భీమవరం వెళ్లి డయాలసిస్ చేయించే వాడినని, ఆర్థికంగా చితికిపోయామని నరసాపురానికి చెందిన లక్ష్మి కుమారులు వాపోయారు.
ప్రభుత్వ తిరకాసు.. ఆరోగ్యశ్రీలో డయాలసిస్ చేయించుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం పింఛను ఇస్తుంది. అత్యవసరమై ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారికి పింఛను అందడం లేదని, నిబంధనల్లో తిరకాసుతో రోగుల్లో కొందరికే రూ.10వేల పింఛను అందుతోందని కొంతమంది వాపోతున్నారు.
ప్రతిపాదనలకే పరిమితం.. నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. సామాజిక బాధ్యతలో భాగంగా ఓఎన్జీసీ గతంలో వైద్యశాఖకు రూ.15 లక్షలు అందజేసింది. అవి ఖాతాలో మూలుగుతున్నాయి. నరసాపురం నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలోనూ బాధితులున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్ సేవలందుతున్నా ఆరోగ్యశ్రీ అమలులో లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్