హామీలపై జగన్ పార్టీని నిలదీయండి
రాష్ట్రంలో ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకోవడానికే సీఎం జగన్రెడ్డి భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చారని.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, ప్రాణాలకు సైతం రక్షణ ఉండదని నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
రఘురామ
మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజు, పక్కన ఎమ్మెల్యే రామరాజు
పాలకోడేరు, న్యూస్టుడే: రాష్ట్రంలో ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకోవడానికే సీఎం జగన్రెడ్డి భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చారని.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, ప్రాణాలకు సైతం రక్షణ ఉండదని నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పాలకోడేరు మండలం కొండేపూడిలో ఆయన మంగళవారం కుటుంబ సమేతంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత రామాలయం, విఘ్నేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే వైకాపా ఓటమి అంచున ఉందని తెలిపారు. ఓటమిని తట్టుకోలేక జగన్ పారిపోయే రీతిలో కూటమి అభ్యర్థుల గెలుపు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మద్యనిషేధం, ఇతర అంశాలపై హామీలు ఇచ్చి మోసం చేసిన జగన్ పార్టీని మహిళలు నిలదీయాలని కోరారు. ఎంపీ కుమారుడు భరత్, భార్య రమాదేవి, ఎమ్మెల్యే మంతెన రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిగ నాగరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
అన్నన్నా.. ఇంత మోసమా!
భీమవరం పట్టణం, న్యూస్టుడే: భీమవరంలో ఇటీవల జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ సభకు జనాన్ని తరలించేందుకు వైకాపా నాయకులు ఎన్నో అవస్థలు పడ్డారు. గంటన్నర పాటు కూర్చొంటే సరిపోతుంది.. రూ.500 ఇస్తామంటూ మభ్యపెట్టి జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి జనాల్ని బస్సుల్లో తీసుకొచ్చారు. చివరికి వారు ఇస్తామన్న రూ. 500 ఇవ్వలేదని ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో చాలా మంది బాహాటంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.300తో సరిపెట్టారని, మిగిలిన సొమ్ము మధ్యవర్తులు తినేశారంటూ తిట్లు దండకం మొదలెట్టారు. భీమవరంలో రెండు ప్రాంతాల్లోని నాయకులు రూ.200 చొప్పున ఇచ్చి సరిపెట్టడంతో స్థానికులు కోపోద్రిక్తులవుతున్నారు. రెండు వార్డుల్లో నాయకులైతే టోకెన్లు తీసుకువస్తే సొమ్ము ఇస్తామన్నారు. వాటి వెనుక పేరు, చరవాణి నంబరు వేసి మరీ తీసుకెళ్లినా చెల్లింపుల్లో భారీగా కోత విధించినట్లు సమాచారం. ఈ క్రమంలో వాగ్వాదాలు చోటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగాలు కావాలంటే తెదేపా రావాలి
[ 06-05-2024]
‘జాబ్ క్యాలెండర్ పేరుచెప్పి జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చి యువతను జగన్ నిండా ముంచారు. వైకాపా పాలనకు యువతే చరమగీతం పాడాలి’ అంటూ తెదేపా నేత నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఏలూరులో ఆదివారం నిర్వహించిన యువగళం సభలో విద్యార్థులు, యువతతో ముఖాముఖీ నిర్వహించారు. -
జగన్ జమానాలో నిధులు దోచేసి... అభివృద్ధి ఆపేసి!
[ 06-05-2024]
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు... వైకాపా అధికారంలోకి వచ్చాక... ఆ పట్టుగొమ్మలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొడలిపోటు వేశారు. అయిదేళ్ల జగన్ జమానాలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. -
జాగాలపై జగన్ మూకలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఊరూరా ఆక్రమణలపర్వం
[ 06-05-2024]
‘జాగా కనిపిస్తే..పాగా వేసేయడమే’ అన్నట్లు జగన్ అనుచరగణం ఊరూరా చెలరేగిపోయింది. అయిదేళ్ల జమానాలో మమ్మల్ని ఎవర్రా ఆపేది అన్నట్లు ఆక్రమణల పర్వం సాగింది. ప్రజల సామూహిక అవసరాలకు వినియోగించాల్సిన స్థలాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయాయి. -
కక్ష సాధింపుల్లో.. అధినేతకు పెద్దన్న
[ 06-05-2024]
జిల్లాలో సంపన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన కీలక కేంద్రమది. తొలి నుంచి ప్రశాంత వాతావరణానికి నిలయం. జాతరలైనా, పండుగలైనా లౌకికత గోచరిస్తుంది. ఇలాంటి ప్రాంతం వైకాపా జమానాలో అరాచక పాలనకు, కక్ష సాధింపులకు వేదికైంది. -
బటన్ నొక్కుడు.. వట్టిదేనా జగన్?
[ 06-05-2024]
‘మహిళల సంక్షేమమే నా లక్ష్యం.. అతివల ఆర్థిక స్వావలంబనే నా ధ్యేయం’ అంటూ సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ వేదికలపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. అమలు చేసే విషయంలో మాత్రం ఆయనకు చిత్తశుద్ధి కొరవడింది. దీనికి నిదర్శనమే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం. అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. -
నీట్కు 43 మంది గైర్హాజరు
[ 06-05-2024]
జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు 43 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1361 మంది హాజరు కావాల్సి ఉండగా 1318 మంది హాజరయ్యారు. -
రంగులు మారలే... ప్రలోభాలు తగ్గలే!
[ 06-05-2024]
నరసాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు పట్టణంలోని ఎండీయూ ఆపరేటర్. ఆయన నిత్యం ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉంటారు. ఎన్నికల ప్రచారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
చీకటి పాలన నుంచి త్వరలో విముక్తి : నారా రోహిత్
[ 06-05-2024]
అయిదేళ్ల చీకటి పాలన నుంచి త్వరలోనే విముక్తి పొందుతామని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. తెదేపా యువ నాయకుడు ఆరిమిల్లి నిఖిల్రత్న ఆధ్వర్యంలో స్థానిక భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువ గళం... -
తపాలా బ్యాలెట్ ఓటింగ్లో ఇంకా ఇబ్బందులు
[ 06-05-2024]
తపాలా బ్యాలెట్ వినియోగంలో ఉద్యోగులకు రెండో రోజూ స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యాయి. శనివారం ఫెసిలిటేషన్ కేంద్రాలకు వెళ్లిన అనేక మంది ఉద్యోగులకు వారి ఓట్లు లేవని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. -
అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వైకాపా సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు
[ 06-05-2024]
ఓ తెదేపా మహిళా నాయకురాలిపై అసభ్యకరంగా పోస్టింగులు పెడుతున్న వైకాపా సోషల్ మీడియా ఖాతాదారులపై ఏలూరు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది. -
తపాలా ఓట్ల కోసం పోటా పోటీ
[ 06-05-2024]
ప్రస్తుత ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కానుండటంతో తపాలా ఓట్లను దక్కించుకొనేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో తపాలా బ్యాలెట్ ఓటింగ్ జరగనుంది. -
ఇటు భోజనాలు... అటు సొమ్ములు
[ 06-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. సామాన్య ప్రజలతోపాటు వివిధ వర్గాలను ప్రభావితం చేసేలా చిరుదోగ్యులపై దృష్టి సారించింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
డోన్ ఆర్థిక మంత్రి బుగ్గనకు నిరసన సెగ
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం