ఆర్టీసీ అద్దె బస్సుల దూకుడు
ఈనెల 18న కడప కోటిరెడ్డి కూడలి వద్ద ఆర్టీసీ అద్దెబస్సులో ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఎక్కారు. కొద్ది దూరం రాగానే డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఆమె బస్సులో నుంచి కింద పడి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మృతి చెందింది.
20 రోజుల్లో ఏడు ప్రమాదాలు
రాయచోటి వద్ద ప్రమాదానికి గురైన ఆర్టీసీ అద్దె బస్సు (దాచిన చిత్రం)
న్యూస్టుడే, చిన్నచౌకు(కడప)* ఈనెల 18న కడప కోటిరెడ్డి కూడలి వద్ద ఆర్టీసీ అద్దెబస్సులో ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఎక్కారు. కొద్ది దూరం రాగానే డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఆమె బస్సులో నుంచి కింద పడి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మృతి చెందింది.
* ఈ నెల 22న రాయచోటి నుంచి చక్రాయపేటకు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు లక్ష్మీపురం వద్ద లారీని ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఆ సమయానికి బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు.
* జనవరి 14న ప్రొద్దుటూరు సమీపంలోని నాగులపల్లె వద్ద ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
జిల్లా వ్యాప్తంగా ఎనిమిది డిపోల పరిధిలో 250 ఆర్టీసీ అద్దె బస్సులున్నాయి. ఈ బస్సుల చోదకులు తరచూ రోడ్డు ప్రమాదాలు చేస్తుండడంతో ఆర్టీసీకి చెడ్డపేరు వస్తోంది. ఈ నెలలో 20 రోజుల్లో ఏడు ప్రమాదాలు చేయగా అందులో ఇద్దరు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. అద్దె బస్సు డ్రైవర్లు నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆర్టీసీ డ్రైవర్లంటున్నారు. గతంలో ఏకదాటిగా ఒకే డ్రైవరు బస్సు నడిపేవాడు. దీంతో ప్రమాదాలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఆర్టీసీ యాజమాన్యం మూడు రోజుల ఒకరు, మరో మూడు రోజులు ఒకరు చొప్పున బస్సు నడపాలని సూచించారు. ఆ నిబంధన సక్రమంగా అమలు కావడం లేదు. హెవీ డ్రైవింగ్ లైసెన్సు తీసుకుని ఒకటిన్నర సంవత్సరం అనుభవం కలిగి ఉన్న వారినే చోదకులుగా తీసుకోవాలి. చాలా మంది చోదకులకు అనుభవం లేదు. అద్దె బస్సు చోదకులకు తొలుత వారం రోజులు సంస్థ నిపుణులు శిక్షణ ఇస్తారు. ప్రయాణికులతో ఎలా ఉండాలి, డ్రైవింగ్ ఎలా చేయాలి, ఆర్టీసీ నిబంధనల గురించి వివరిస్తారు. ఇప్పుడు శిక్షణ తరగతులు నిర్వహించడం లేదు. మద్యం మత్తులో, చరవాణి మాట్లాడుతూ బస్సులు నడుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాం
ప్రమాదం ఎవరు చేసిన ఒక్కటే. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ప్రమాదాలు చేస్తే వెంటనే వారిని తొలగించి వారి స్థానంలో అనుభవం ఉన్న వారిని నియమిస్తున్నాం. సంస్థ నిర్వహించే వైద్యపరీక్షల్లో ఉత్తీర్ణులైన వారినే చోదకులుగా నియమిస్తున్నాం. ప్రతి రోజు జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాం. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. - భాస్కర్, ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం అధ్యక్షుడు, కడప
వారిని పక్కన పెడుతున్నాం
ఆర్టీసీ అద్దె బస్సుల ప్రమాదాలు ఇటీవల పెరిగినది వాస్తవం. ప్రమాదాలపై దృష్టి పెట్టాం. ఎక్కువగా ప్రమాదాలు చేసే వారిని, చరవాణి మాట్లాడుతూ బస్సు నడిపే చోదకులను పక్కన పెడుతున్నాం. ప్రమాదాలు నివారణకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. - భాస్కర్, ఆర్టీసీ డిప్యూటీ సీఎంఈ, కడప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నుంచి పలు కుటుంబాలు తెదేపాలో చేరిక
[ 28-04-2024]
మండలంలోని రెడ్డిపల్లెలో ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో ముట్టె చెన్నయ్యఆధ్వర్యంలో వైకాపాకు చెందిన పలు కుటుంబాలు తెదేపాలు చేరాయి. -
పాపాలు చేసిన వారిని తొక్కిపడేయండి: బ్రదర్ అనిల్
[ 28-04-2024]
పాపాలు చేసిన వారిని తొక్కిపడేయాలని వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. -
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించండి
[ 28-04-2024]
మండల కేంద్రంలో ఆదివారం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
[ 28-04-2024]
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పేరు వింటేనే మనకు అరాచక పాలన గుర్తుకొస్తుంది. దీనిని తలదన్నేలా రాష్ట్రంలో జగన్ పాలన భయభ్రాంతులకు గురిచేస్తోంది.... అఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ఆటవిక పాలనను సైతం మరిపిస్తోంది. -
యువత మరణాలు వైకాపా ప్రభుత్వ హత్యలే!
[ 28-04-2024]
‘అయిదేళ్ల పాటు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన జగన్ను ఇంటికి పంపిస్తాం. యువత మరణాలన్నీ వైకాపా ప్రభుత్వ హత్యలే’ అని నిరుద్యోగ ఐకాస నాయకులు మండిపడ్డారు. -
ఎస్ఆర్బీసీ... తుంగలో తొక్కేసి..!
[ 28-04-2024]
సీఎం జగన్ సొంత జిల్లాలో సాగునీటి పనులకు మోక్షం కలగడంలేదు. ప్రధానంగా నిధుల్లేక నిలిచిపోయిన ఎస్ఆర్బీసీ (శ్రీశైలం కుడికాలువ) పనులు ఏళ్లుగా పడకేశాయి. -
నా అనుకున్న వాళ్లే మోసం చేశారు
[ 28-04-2024]
అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన కుమార్తె సునీతారెడ్డి పేర్కొన్నారు. -
పుంగనూరు, తంబళ్లపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అరాచకాలకు, వనరుల దోపిడీలకు పాల్పడిందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
కూటమి జోష్!
[ 28-04-2024]
ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలు రంగంలోకి దిగడం మరింత జోష్ నింపుతోంది. -
ఒట్టేసి ఒక మాట... ఓటేశాక ఒక మాట..!
[ 28-04-2024]
‘2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్...నేను ఉన్నా.. నేను విన్నా.. అని చెప్పి ఓట్లు అడిగి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. -
జగన్ ఝలక్... కరెంట్ షాక్!
[ 28-04-2024]
వైకాపా పాలనలో విద్యుత్తు నియంత్రికలు, సామగ్రికి ధరాఘాతం తప్పడం లేదు. అస్మదీయులకు ఆయాచితంగా లబ్ధి కలిగించాలని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. -
జగన్ దంపతులొచ్చి ప్రచారం చేసినా గెలుపు నాదే
[ 28-04-2024]
ఈ నెల 25వ తేదీన నామినేషన్ తర్వాత తలపెట్టిన కూటమి ర్యాలీ విజయవంతమైనందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
తెదేపాలో చేరికలు... విజయానికి సంకేతాలు
[ 28-04-2024]
తెదేపాలోకి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు చేరిపోతున్నారు. తమ మద్దతు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు పలుకుతున్నారు. మైదుకూరు పట్టణంలో 15వ వార్డుకు చెందిన వైకాపా నాయకులు బండి సుబ్బరాయుడు, బండి రాజాలు వారి అనుచరులతో శనివారం తెదేపాలో చేరారు. -
క్రీడా మైదానం...రాచమల్లుకు ఆదాయం
[ 28-04-2024]
ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతూ, క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడే ప్రొద్దుటూరు అనిబిసెంటు పురపాలక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అధ్వానంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!