జగనన్నా... మాపై ఎందుకీ వివక్ష?
కన్నతల్లి లాంటి పల్లెతో ఉన్న అనుబంధం తెగిపోయింది. పంట పొలాలను ముంపు ముంచేసింది. పేదల బతుకు చిత్రం తారుమారైంది. జీవన ‘నావ’కు భరోసా కరవైంది. ఏళ్ల తరబడి ఎదురుచూసినా నిర్వాసితులకు నిర్వేదం మిగిలింది.
ఇంటి స్థలాలకు ఏళ్లతరబడి నిరీక్షణ
కుడమలూరు గ్రామస్థుల ఆవేదన
న్యూస్టుడే, కడప
ఓటు హక్కు ఉన్నా పునరావాసం కల్పించలేదని ముంపు బాధితుల నిరసన (పాత చిత్రం)
కన్నతల్లి లాంటి పల్లెతో ఉన్న అనుబంధం తెగిపోయింది. పంట పొలాలను ముంపు ముంచేసింది. పేదల బతుకు చిత్రం తారుమారైంది. జీవన ‘నావ’కు భరోసా కరవైంది. ఏళ్ల తరబడి ఎదురుచూసినా నిర్వాసితులకు నిర్వేదం మిగిలింది. పునరావాసం కలగా మారింది. ఇంటి స్థలాలకు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. మౌలిక వసతుల ఊసేలేదు. అభివృద్ధి మాటే వినిపించడం లేదు. జగనన్నా ఇంకెన్నాళ్లీ దయనీయ బతుకులు, మాపై ఎందుకీ వివక్ష అంటూ కుడమలూరు నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ఒంటిమిట్ట మండలం కుడమలూరులో 132 కుటుంబాలుండగా, 415 మంది ఉన్నారు. పురుషులు 126, మహిళలు 111 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇక్కడ మత్స్యకారులు ఎక్కువ. సోమశిల వెనుక జలాల్లో చేపల వేటపై 80 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు. సోమశిల వెనుక జలాలతో రెండు దశాబ్దాల కిందట గ్రామం ముంపులో చేరింది. వెనుక జలాలు రాని ఎత్తు ప్రదేశంలో పెంకు, రేకుల ఇళ్లల్లో దుర్భరజీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం చేపలవేట సాగకపోవడంతో గొర్రెలు, మేకలు, పశువుల పోషణ, కూలి పనులు చేసుకుంటూ జీవితాలను నెట్టుకొస్తున్నారు. గ్రామానికి ఇప్పటికీ మట్టి దారే దిక్కు. రవాణా వసతి లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం బయటకు వెళ్లాలంటే ఆటోలు, ద్విచక్ర వాహనాలే ఆధారం. దాతలు నిర్మించిన రేకుల షెడ్డులోనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. ఇక్కడ ప్రజలకు ఇప్పటికీ పక్కాగృహాలు మంజూరు చేయలేదు. తాగునీటి ట్యాంకులు నిర్మించలేదు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సామాజిక భద్రత పింఛను తీసుకోవాలంటే లబ్ధిదారులు ఏడు కిలోమీటర్ల దూరంలోని రాచగుడిపల్లె గ్రామ సచివాలయానికి వెళ్లాల్సిందే. గ్రామానికి ఎగువన సర్వే సంఖ్య 401లో 1,207.68 ప్రభుత్వ భూమిని సబ్ డివిజన్ (విభజన) చేశారు. సర్వే సంఖ్య 411లోని 12.26 ఎకరాలను ముంపు వాసుల పునరావాస కాలనీ ఏర్పాటు కోసం ఇస్తామని మూడేళ్ల కిందట రెవెన్యూ అధికారులు ప్రకటించారు. ఇంటి స్థలం వస్తుందని బాధితులు సంతోషించారు. ఊర్లో వారంతా రూ.3 లక్షలు చందాలు వేసుకొని కంప చెట్లు, ముళ్ల పొదలను తొలగించి చదును చేయించుకున్నారు. త్వరలో ఇంటి నివేశన పత్రాలను పంపిణీ చేస్తామని అధికారులు ఊరించారు. మండల, డివిజన్, జిల్లా అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా అదిగో పట్టా ఇస్తాం.. ఇదిగో స్థలం తీసుకోండంటూ దాటవేస్తూ వస్తున్నారు. జగన్ ప్రభుత్వం మా సొంతింటి కలను నెరవేర్చడంలేదని, మత్స్యకారులపై ఎందుకీ వివక్ష అంటూ వారంతా ప్రశ్నిస్తున్నారు. జాలర్లకు ఇవ్వాల్సిన రాయితీలు కూడా ఇవ్వడంలేదని వారంతా వాపోతున్నారు. గతంలో కోటపాడు కనుమ వద్ద ప్రభుత్వ భూమి సర్వే సంఖ్య 613లో పునరావాస గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని అధికార పార్టీ నాయకులు మాటిచ్చారని, ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదని కన్నీళ్లపర్యంతమవుతున్నారు.
ఎదురుచూపులే
మిగిలాయి : సోమశిల వెనుక జలాలతో మా గ్రామం ముంపునకు గురైంది. గ్రామసమీపంలోని ప్రభుత్వ భూమిలో పునరావాస కాలనీ ఏర్పాటు చేస్తామని మూడేళ్ల కిందట అధికారులు మాటిచ్చి ఇంతవరకు పట్టాలివ్వలేదు. పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదు. గ్రామాభివృద్ధిపై శీతకన్ను వేయడం అన్యాయం.
గుడి వెంకటరమణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలాపురంలో యువకుడి దారుణ హత్య
[ 30-04-2024]
పట్టణంలోని పకీర్ వీధిలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతుడిని మహమ్మద్ ఘనీ (26)గా గుర్తించారు. -
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
[ 30-04-2024]
ఆ తల్లి ఎన్ని కష్టాలు అనుభవించిందో కొడుకు, కూతురితో కలిసి చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించింది. ‘అన్నా క్షమించు జీవితంలో తొలిసారి నీకు చెప్పకుండా తప్పు చేస్తున్నా.. నాతో పాటు నా బిడ్డల్ని తీసుకెళ్తున్నా.. తల్లికన్నా ఎక్కువగా చూసుకున్నావు, ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా జీవితాన్ని బాగు చేయాలని ఎంతో శ్రమించావు. -
జగన్ అరాచక కేళి.. జనం కావాలా బలి..!
[ 30-04-2024]
అబద్ధాలు వల్లె వేయడం, కుయుక్తులు పన్నడం, అవకాశాలు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైకాపాది అందె వేసిన చేయి. దేన్నీ వదిలిపెట్టకుండా రాజకీయంగా మలుచుకోవడానికి కాచుకు కూర్చున్న వైకాపా సర్కారు ప్రజల ప్రాణాలతో మరోసారి ఆటలాడుకుంటోంది. -
జగనాసుర.. ఎప్పుడైనా ఇటుకేసీ చూశావా?
[ 30-04-2024]
జగన్ అరాచక పాలనలో పుడమి పుత్రులకు కన్నీళ్లే మిగిలాయి. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుల్లో ఒకటైన కేసీ కాలువ వైపు సీఎం జగన్ తన అయిదేళ్ల పాలనలో కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రైతు ప్రయోజనాలను కాపాడేవిధంగా నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
నామపత్రాల ఉప సంహరణలు
[ 30-04-2024]
ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి దాఖలు చేసిన 21 మంది అభ్యర్థుల్లో ఆరుగురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని ఆర్వో కౌసర్ బాను వద్దకు వెళ్లి ఆరుగురు పోటీ నుంచి వైదొలుగుతున్నామని సంతకాలు చేశారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 30-04-2024]
రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు సూపర్ సిక్స్ పథకాలు అమలవుతాయని తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి, బద్వేలు భాజపా అభ్యర్థి బొజ్జ రోశన్న పిలుపునిచ్చారు. -
ట్రయల్రన్ పేరుతో పట్టణం దిగ్బంధం
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారం కోసం సీఎం జగన్ మోహన్రెడ్డి మంగళవారం మైదుకూరు పర్యటనతో సోమవారం సాయంత్రం పోలీసులు ట్రయల్రన్ నిర్వహించారు. పట్టణంలోని నాలుగురోడ్లను దిగ్బంధనం చేశారు. లోపలి వాహనాలను బయటకు పంపండం తప్పితే పట్టణంలోకి వాహనాలు ప్రవేశించకుండా అడ్డుకున్నారు. -
ప్రచారం... చేరికలు
[ 30-04-2024]
పురపాలకలోని చిన్నయ్యగారిపల్లెలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటి ప్రచారం చేశారు. మైదుకూరు పురపాలకకు చెందిన ఆరీఫ్, రెహ్మాన్, అస్యాక్, షేక్ ఆరీఫ్, చందు, అబ్దుల్లా, బాషా, హుస్సేన్, అబ్దుల్, బ్రహ్మంగారిమఠం జౌకుపల్లె ఎస్సీకాలనీకి చెందిన వైకాపా నాయకులు నాగులారపు కొమ్మయ్య, బత్తల శివ, సంసోను, ఫిలమెంట్, దినకర్, భాస్కర్, ఏసోబు, డేవిడ్ తెదేపాలో చేరారు. -
సీఎం పర్యటనతో విభాజికం ధ్వంసం
[ 30-04-2024]
ముఖ్యమంత్రి పర్యటన అంటే ప్రజలు విస్తుపోయే పరిస్థితి. ఇది ఒక్ల మైదుకూరు పట్టణంలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా ఆ ప్రాంత వాసులకు ఎదురయ్యే దుస్థితి. -
రోడ్డుపైనే సీఎం సభ... ప్రయాణాలు మానుకోండి!
[ 30-04-2024]
ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల వైపు నుంచి మైదుకూరు మీదుగా బద్వేలు, కడప మార్గంలో మంగళవారం రాకపోకలు సాగించే ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార సభను మైదుకూరు వద్ద కృష్ణపట్నం-హుబ్లీ జాతీయ రహదారిపై నిర్వహించనున్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ
[ 30-04-2024]
రాజంపేట ఎంపీ స్థానంతోపాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. రాజంపేట ఎంపీ స్థానంలో 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పోటీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో 18 మంది బరిలో నిలిచారు. -
కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం
[ 30-04-2024]
వైకాపా పాలనపై విరక్తి చెందిన ప్రజలు కూటమి వైపు చూస్తున్నారని తెదేపా పీలేరు అసెంబ్లీ అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని సొరకాయలపేట, గోరంట్లపల్లె, మారెళ్ల, వగళ్ల గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని బెదిరింపు
[ 30-04-2024]
తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి బెదించారని ఆ పార్టీ నాయకుడు సిద్దవరం వెంకటేశ్వర రెడ్డి పెనగలూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. -
బంగ్లామిట్ట... తాగునీటికి కటకట!
[ 30-04-2024]
రైల్వేకోడూరు మండలం బొజ్జావారిపల్లె పంచాయతీ బంగ్లామిట్ట కాలనీ వాసులు గత కొన్ని రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని డైరెక్ట్ పంపింగ్ మోటారు మరమ్మతులకు గురికావడంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. -
వైకాపాకు యువజన రాష్ట్ర కార్యదర్శి రాజీనామా
[ 30-04-2024]
మైదుకూరుకు చెందిన వైకాపా యువజన రాష్ట్ర కార్యదర్శి తప్పెట శశిధర్రెడ్డి పార్టీ పదవితోపాటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు సోమవారం విలేకరులకు తెలిపారు. -
నేడు కలికిరికి సీఎం జగన్ రాక
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మంగళవారం సాయంత్రం కలికిరికి రానున్నారు. ఈ నేపథ్యంలో కలికిరి-కలకడ మార్గంలోని అంకాలమ్మ గుడి ఎదురుగా ఉన్న స్థలాన్ని హెలీప్యాడ్కు పరిశీలించి చదును చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా