మేనమామ వేషం... అక్కచెల్లెమ్మలకు మోసం
సీఎం జగన్... రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తాను మేనమామని గొప్పగా చెప్పుకొంటుంటారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా చేస్తానంటూ బీరాలు పలుకుతుంటారు. ఇందుకోసం అన్ని రకాల సాయాలు చేస్తానంటూ వాగ్దానాలు ఇచ్చేస్తుంటారు.
అమ్మఒడి అమలులో జగన్ మార్కు దగా
ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒక్కరికే లబ్ధి
అధికారంలోకి వచ్చాక సీఎం నాలుక మడత
ఈనాడు, కడప, న్యూస్టుడే, కడప
సీఎం జగన్... రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తాను మేనమామని గొప్పగా చెప్పుకొంటుంటారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా చేస్తానంటూ బీరాలు పలుకుతుంటారు. ఇందుకోసం అన్ని రకాల సాయాలు చేస్తానంటూ వాగ్దానాలు ఇచ్చేస్తుంటారు. ఆయన మాటలకు వాస్తవ పరిస్థితులకు అస్సలు పొంతనే ఉండదు. పిల్లలను బడికి పంపిస్తే తల్లులకు అందించే అమ్మఒడి సాయానికి రకరకాల సాకులతో కోతలు విధిస్తున్నారు. లబ్ధిదారులతోపాటు వారికిచ్చే మొత్తాన్ని తగ్గించేశారు. ఇలా అమ్మఒడి పథకంలోనూ జగన్ మార్కు మోసం చేశారు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే వారికిద్దరికీ రూ.15 వేల చొప్పున ఇస్తానంటూ హామీనిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారు. ఎంతమంది పిల్లల్ని బడికి పంపినా ఒక్కరికే ఇస్తానంటూ మెలిక పెట్టారు. పోనీ వారికైనా సక్రమంగా ఇచ్చారా అంటూ అదీ లేదు. 300 యూనిట్ల విద్యుత్తు వినియోగం దాటితే అనర్హులుగా తేల్చారు. అడ్డగోలు నిబంధనలతో అమ్మఒడి పథకంలో అక్కచెల్లెమ్మలకు గుండెకోత మిగిల్చారు.
పేదరికమే కొలమానంగా తీసుకుని ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా చేస్తున్నామంటూ వైకాపా సర్కారు చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇందుకు నిదర్శనమే అమ్మఒడి పథకం. 2019లో అధికారం చేపట్టిన అనంతరం 2020లో తొలిసారిగా రూ.15 వేలు ఇవ్వగా, మరుసటి ఏడాది రూ.వెయ్యి కోత వేశారు. 2022 నుంచి పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో కోతను రూ.2 వేలకు పెంచారు. అమ్మఒడి పథకం లబ్ధిదారుల సంఖ్యను సైతం తగ్గించేందుకు జగన్ సర్కారు విశ్వప్రయత్నాలు చేసింది.
జగన్రెడ్డి... ఓ కోతలరాయుడు
- పొరుగు సేవల ఉద్యోగులకు రూ.15 వేల వేతనం ఇచ్చినట్లే ఇస్తూ వారికి జగన్ మార్కు షాక్ రుచి చూపించారు. అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాలో వివిధ శాఖల్లో 27 వేల మంది పొరుగుసేవల ఉద్యోగులుండగా, వీరి మేలు కోసమే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ను తీసుకు వచ్చినట్లు గొప్పలు చెప్పిన జగన్ వీరిలో 18 వేల మందికి అమ్మఒడి పథకాన్ని దూరం చేశారు.
- ఆప్కాస్ పరిధిలో ఉన్నవారి వేతనాలను సీఎఫ్ఎంఎస్కు అనుసంధానించడంతో వారి వివరాలన్నీ రాబడుతూ పథకాలకు కోత వేశారు.
- మిగిలిన వారికి ప్రతి నెలా విద్యుత్తు వినియోగం 300 యూనిట్లకు లోపే ఉండాలని షరతులు పెట్టారు. నాలుగు చక్రాల కారు ఉండరాదని, మగాణి భూమి మూడెకరాలు, మెట్ట 10 ఎకరాలకు పైగా ఉన్న వారిని అర్హుల జాబితా నుంచి తప్పించారు. పట్టణాల్లో 750 చదరపు అడుగులకు మించి ఇల్లు ఉన్నా లబ్ధి ఇవ్వకుండా మొండిచేయి చూపారు.
సమగ్ర వివరాల్లేవని కుంటిసాకులు
విద్యార్థి, తల్లి ఆధార్ పత్రంలో తప్పులున్నాయని, బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక లావాదేవీలు జరగలేదని, బియ్యం కార్డులో విద్యార్థి పేరు లేదని కుంటిసాకులతో అర్హులకు కోత పెట్టారు. మరికొందరికీ నగదు జమ చేసినట్లు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. బ్యాంకు వద్దకు వెళ్లి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వచ్చిందా లేదా అని అని పరిశీలిస్తే డబ్బులు రాలేదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు ఈ విషయంపై తల్లిదండ్రులు పదేపదే ప్రశ్నిస్తున్నా త్వరలో వస్తుందని ఊరించే మాటలతో కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి ఆధార్ సంఖ్య అనుసంధానం కావడంతో ధనవంతులుగా చూపి పక్కన పెట్టేశారు. మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం లేదు. ఒక ఇంటి విద్యుత్తు మీటరు కనెక్షన్కు మరొకరి ఆధార్ సంఖ్యతో అనుసంధానం కావడంతో చాలామందిని అనర్హుల జాబితాలో చేర్చారు.
75 శాతం హాజరుతోనూ ముడిపెట్టి...
అమ్మఒడి పథకంలో లబ్ధి పొందాలంటే బడికి వచ్చే విద్యార్థి ఏటా 75 శాతం కచ్చితంగా హాజరుకావాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులందాయి. ఇంతకంటే తక్కువ రోజులు పాఠశాలకు వస్తే పథకం వర్తించదని తేల్చారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు కంగుతిన్నారు. పిల్లల అమ్మనాన్నల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మేమింతే అన్నట్లు సీఎం జగన్ మొండిగా ముందుకెళ్లారు.
ఆరెంచల విధానంతో వడపోత?
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ఆరెంచల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. లబ్ధిదారుల అర్హతపై సందేహం ఉండటంతో గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లు, సిబ్బంది ద్వారా క్షేత్ర స్థాయిలో పునః పరిశీలన చేయించింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అర్హత ఉందని ధ్రువీకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా చాలామందికి అమ్మఒడి భాగ్యం కలగలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా లబ్దిదారులకు మోక్షం లభించలేదు.
విద్యార్థులకు ల్యాప్టాప్ ఏదీ?
తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడిలో ఆర్థిక సాయం అందజేస్తున్నాం. నగదు వద్దని అనుకున్న వారికి ల్యాప్టాప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వం చొరవ తీసుకొని పెద్ద కంపెనీలతో మాట్లాడుతోందని 2021, జనవరి 11న సీఎం జగన్ ప్రకటించారు. మార్కెట్లో రూ.25 వేల నుంచి రూ.27 వేలు పలికే ల్యాప్టాప్ రూ.18,500కే ఇస్తామని గొప్పగా ప్రకటించి అనంతరం అదనపు భారమవుతుందని చేతులెత్తేశారు.
మాట తప్పారు... మడమ తిప్పారు
వైకాపా ప్రభుత్వం నిబంధనలను తెరపైకి తీసుకురావడంతో రెండో సంవత్సరం నుంచి క్రమంగా తగ్గించుకుంటూ నాలుగో ఏడాదిలో 11,315 మందికి లబ్దిదారులు తగ్గిపోయారు. అదే తొలి ఏడాది పొల్చి చూస్తే చివరి సంవత్సంలో రూ.36.21 కోట్లు మేర ప్రభుత్వం మిగుల్చుకుంది. ఇక సీఎం ఆర్భాటంగా బటన్ నొక్కిన తర్వాత వెంటనే తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. కొన్ని నెలల తర్వాత అది కూడా రెండు, మూడు విడతలుగా జమ చేస్తున్నారు. మొదటి రెండేళ్లు జనవరిలో నిధులు విడుదల చేసిన ప్రభుత్వం 2021-22లో 75 శాతం హాజరు పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్లో నగదు జమచేసింది. 2022-23లోనూ అదే లెక్కన గత జూన్లో జమ చేశారు. ఈ ఏడాది జూన్లో మళ్లీ సాయం ఇచ్చే సమయానికి కొత్త ప్రభుత్వం వస్తుంది. గత ఐదేళ్ల వైకాపా పాలనలో నాలుగు పర్యాయాలు మాత్రమే ఇచ్చినట్లవుతుంది. ప్రభుత్వ బడులు, కళాశాలల్లో చదివే పేద పిల్లలపై మీ శ్రద్ధ ఇదేనా జగన్ మామయ్యా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలాపురంలో యువకుడి దారుణ హత్య
[ 30-04-2024]
పట్టణంలోని పకీర్ వీధిలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతుడిని మహమ్మద్ ఘనీ (26)గా గుర్తించారు. -
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
[ 30-04-2024]
ఆ తల్లి ఎన్ని కష్టాలు అనుభవించిందో కొడుకు, కూతురితో కలిసి చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించింది. ‘అన్నా క్షమించు జీవితంలో తొలిసారి నీకు చెప్పకుండా తప్పు చేస్తున్నా.. నాతో పాటు నా బిడ్డల్ని తీసుకెళ్తున్నా.. తల్లికన్నా ఎక్కువగా చూసుకున్నావు, ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా జీవితాన్ని బాగు చేయాలని ఎంతో శ్రమించావు. -
జగన్ అరాచక కేళి.. జనం కావాలా బలి..!
[ 30-04-2024]
అబద్ధాలు వల్లె వేయడం, కుయుక్తులు పన్నడం, అవకాశాలు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైకాపాది అందె వేసిన చేయి. దేన్నీ వదిలిపెట్టకుండా రాజకీయంగా మలుచుకోవడానికి కాచుకు కూర్చున్న వైకాపా సర్కారు ప్రజల ప్రాణాలతో మరోసారి ఆటలాడుకుంటోంది. -
జగనాసుర.. ఎప్పుడైనా ఇటుకేసీ చూశావా?
[ 30-04-2024]
జగన్ అరాచక పాలనలో పుడమి పుత్రులకు కన్నీళ్లే మిగిలాయి. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుల్లో ఒకటైన కేసీ కాలువ వైపు సీఎం జగన్ తన అయిదేళ్ల పాలనలో కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రైతు ప్రయోజనాలను కాపాడేవిధంగా నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
నామపత్రాల ఉప సంహరణలు
[ 30-04-2024]
ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి దాఖలు చేసిన 21 మంది అభ్యర్థుల్లో ఆరుగురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని ఆర్వో కౌసర్ బాను వద్దకు వెళ్లి ఆరుగురు పోటీ నుంచి వైదొలుగుతున్నామని సంతకాలు చేశారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 30-04-2024]
రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు సూపర్ సిక్స్ పథకాలు అమలవుతాయని తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి, బద్వేలు భాజపా అభ్యర్థి బొజ్జ రోశన్న పిలుపునిచ్చారు. -
ట్రయల్రన్ పేరుతో పట్టణం దిగ్బంధం
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారం కోసం సీఎం జగన్ మోహన్రెడ్డి మంగళవారం మైదుకూరు పర్యటనతో సోమవారం సాయంత్రం పోలీసులు ట్రయల్రన్ నిర్వహించారు. పట్టణంలోని నాలుగురోడ్లను దిగ్బంధనం చేశారు. లోపలి వాహనాలను బయటకు పంపండం తప్పితే పట్టణంలోకి వాహనాలు ప్రవేశించకుండా అడ్డుకున్నారు. -
ప్రచారం... చేరికలు
[ 30-04-2024]
పురపాలకలోని చిన్నయ్యగారిపల్లెలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటి ప్రచారం చేశారు. మైదుకూరు పురపాలకకు చెందిన ఆరీఫ్, రెహ్మాన్, అస్యాక్, షేక్ ఆరీఫ్, చందు, అబ్దుల్లా, బాషా, హుస్సేన్, అబ్దుల్, బ్రహ్మంగారిమఠం జౌకుపల్లె ఎస్సీకాలనీకి చెందిన వైకాపా నాయకులు నాగులారపు కొమ్మయ్య, బత్తల శివ, సంసోను, ఫిలమెంట్, దినకర్, భాస్కర్, ఏసోబు, డేవిడ్ తెదేపాలో చేరారు. -
సీఎం పర్యటనతో విభాజికం ధ్వంసం
[ 30-04-2024]
ముఖ్యమంత్రి పర్యటన అంటే ప్రజలు విస్తుపోయే పరిస్థితి. ఇది ఒక్ల మైదుకూరు పట్టణంలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా ఆ ప్రాంత వాసులకు ఎదురయ్యే దుస్థితి. -
రోడ్డుపైనే సీఎం సభ... ప్రయాణాలు మానుకోండి!
[ 30-04-2024]
ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల వైపు నుంచి మైదుకూరు మీదుగా బద్వేలు, కడప మార్గంలో మంగళవారం రాకపోకలు సాగించే ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార సభను మైదుకూరు వద్ద కృష్ణపట్నం-హుబ్లీ జాతీయ రహదారిపై నిర్వహించనున్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ
[ 30-04-2024]
రాజంపేట ఎంపీ స్థానంతోపాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. రాజంపేట ఎంపీ స్థానంలో 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పోటీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో 18 మంది బరిలో నిలిచారు. -
కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం
[ 30-04-2024]
వైకాపా పాలనపై విరక్తి చెందిన ప్రజలు కూటమి వైపు చూస్తున్నారని తెదేపా పీలేరు అసెంబ్లీ అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని సొరకాయలపేట, గోరంట్లపల్లె, మారెళ్ల, వగళ్ల గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని బెదిరింపు
[ 30-04-2024]
తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి బెదించారని ఆ పార్టీ నాయకుడు సిద్దవరం వెంకటేశ్వర రెడ్డి పెనగలూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. -
బంగ్లామిట్ట... తాగునీటికి కటకట!
[ 30-04-2024]
రైల్వేకోడూరు మండలం బొజ్జావారిపల్లె పంచాయతీ బంగ్లామిట్ట కాలనీ వాసులు గత కొన్ని రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని డైరెక్ట్ పంపింగ్ మోటారు మరమ్మతులకు గురికావడంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. -
వైకాపాకు యువజన రాష్ట్ర కార్యదర్శి రాజీనామా
[ 30-04-2024]
మైదుకూరుకు చెందిన వైకాపా యువజన రాష్ట్ర కార్యదర్శి తప్పెట శశిధర్రెడ్డి పార్టీ పదవితోపాటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు సోమవారం విలేకరులకు తెలిపారు. -
నేడు కలికిరికి సీఎం జగన్ రాక
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మంగళవారం సాయంత్రం కలికిరికి రానున్నారు. ఈ నేపథ్యంలో కలికిరి-కలకడ మార్గంలోని అంకాలమ్మ గుడి ఎదురుగా ఉన్న స్థలాన్ని హెలీప్యాడ్కు పరిశీలించి చదును చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్