సైబర్ నేరాలపై అవగాహన అవసరం
అధికారులంతా సైబర్ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఇన్ఛార్జి అడ్మిన్ డీసీపీ పి.వెంకటరత్నం సూచించారు. మంగళవారం ఆమె పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు,
అధికారులకు సూచనలు చేస్తున్న ఇన్ఛార్జి అడ్మిన్ డీసీపీ పి.వెంకటరత్నం
విజయవాడ నేరవార్తలు, న్యూస్టుడే : అధికారులంతా సైబర్ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఇన్ఛార్జి అడ్మిన్ డీసీపీ పి.వెంకటరత్నం సూచించారు. మంగళవారం ఆమె పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, స్టేషన్ రైటర్లు, కంప్యూటర్ సిబ్బందికి సైబర్ నేరాల దర్యాప్తుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ మోసాలు, ఆర్థిక నేరాలు, లోన్ యాప్స్, ఓటీపీ, ఈకేవైసీ, హనీట్రాప్, జాబ్ స్కామ్స్, ఫోన్కాల్ ఫ్రాడ్స్, సామాజిక మాధ్యమాల నకిలీ ఖాతాలు, ప్రకటన మోసాలు, ఛైల్డ్ ఫోర్నోగ్రఫీ తదితర సైబర్ నేరాలపై ఐటీ కోర్, సైబర్ క్రైం అధికారుల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తు, ఐటీ యాక్ట్ చట్టాల గురించి తెలుసుకోవాలని చెప్పారు. సైబర్నేరాల్లో కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల్లో ప్రధానంగా యువతలో అవగాహన కలిగించాలని సూచించారు. సైబర్ హెల్ప్ లైన్ 1930 నెంబరు ప్రాధాన్యత, దాని ద్వారా ఎలాంటి సాయం పొందవచ్చో ప్రజలకు తెలియజేసి, చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. సైబర్ నేరం జరిగినట్లు గుర్తించిన వెంటనే 1930కు ఫోన్ చేయాలన్నారు. రూ.15వేలు అంతకంటే ఎక్కువ సొమ్ము నష్టపోతే.. బాధితుడు 48 గంటల్లోపు 1930కు సమాచారం అందిస్తే నిందితుడి ఖాతాను స్తంభింపచేస్తారని వెంకటరత్నం వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
[ 20-05-2024]
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. -
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
[ 20-05-2024]
పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
[ 20-05-2024]
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్