అర్జీల పరిష్కారంపై దృష్టి సారించండి
స్పందనలో వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రంజిత్బాషా సూచించారు.
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్, జేసీ, డీఆర్వో, ఆర్డీవో
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: స్పందనలో వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రంజిత్బాషా సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం వివిధ విభాగాల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అర్జీలు సరిగా పరిష్కరించకుంటే రీఓపెన్ చేయాల్సిన అవసరం వస్తోందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అలా చేయాల్సి వస్తే అందుకు గల కారణాలను సంబంధిత అధికారి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్రామదర్శినిలో గుర్తించిన సమస్యలు, తనిఖీ నివేదికలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి బుధవారం స్పందన, గ్రామదర్శిని కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఈ రెండు అంశాల్లో వచ్చే సమస్యలు పరిష్కరిస్తే దాదాపుగా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉండదని పేర్కొన్నారు. అన్ని శాఖలకు సంబంధించి స్పందనలో వస్తున్న అర్జీలను పరిశీలించి, ఏయే సమస్యలపై ఎక్కువగా వస్తున్నాయనే విషయం గుర్తించి నివేదిక ఇవ్వాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించి రీఓపెన్ అర్జీలపై తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వాలని డీఆర్వోకు సూచించారు. జేసీ అపరాజితసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఐ.కిషోర్లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
వినతులు వెల్లువ: * పదిహేడేళ్ల కిందట జీఎన్ఎం కోర్సు పూర్తి చేసి కొవిడ్ సమయంలో తాత్కాలికంగా పనిచేశామని, ఇంటర్న్షిప్ లేని కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రతిభ, భారతి, సుజాత తదితరులు వినతిపత్రం ఇచ్చారు.
* పెనమలూరుకు చెందిన సుధీర్ తమ గ్రామంలో రహదారిని ఆక్రమించి వ్యవసాయ భూమిలో కలిపేశారని, విచారించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరారు.
* బోయ కులస్థులతో పాటు ఇతర కులాలకు చెందిన వారిని ఎస్టీల్లో చేర్పించే ప్రయత్నాలు విరమించుకోవాలని జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన పలువురు అర్జీలు సమర్పించారు.
లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలి: టిడ్కో గృహ లబ్ధిదారులకు రుణాల మంజూరును వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రంజిత్బాషా బ్యాంకు అధికారులను కోరారు. కలెక్టర్ బంగ్లా నుంచి టెలికాన్ఫరెన్స్లో బ్యాంకు అధికారులు, కోఆర్డినేటర్లతో టిడ్కో గృహ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. గుడివాడలో ముఖ్యమంత్రి చేతుల మీదగా గృహాలను అందించే కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకూ 4,828 మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడంతో పాటు గృహాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయడం ప్రశంసనీయమన్నారు. ఈనెల 10 లోపు మిగిలిన వారికి అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మెప్మా పీడీ విశాలాక్షి, జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయిరాం, తదితర అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
[ 20-05-2024]
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. -
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
[ 20-05-2024]
పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
[ 20-05-2024]
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా