అడవిని మింగేస్తున్న అనకొండలు
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి.
వందలాది ఎకరాల్లో పచ్చని చెట్ల నరికివేత
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో నిత్యం ఇదే తంతు జరుగుతోంది. ఆక్రమణదారులు యథేచ్ఛగా చెట్లు నరికివేస్తూ మైదానంలా మారిన భూమిలో ట్రాక్టర్లతో వ్యవసాయానికి అనువుగా చదును చేస్తున్నారు.
జిల్లాలోని వేములవాడ అటవీ డివిజన్లో చెట్ల నరికివేత నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వం పోడు పట్టాల పంపిణీ చేసిన దగ్గర నుంచి ఇది మరింత ఎక్కువైంది. గిరిజనులు, గిరిజనేతరులు ఇలా ఎవరికి వారు చెట్లను నరుక్కుంటూ పోతున్నారు. ఒకప్పుడు రహదారి పక్కన కొంతదూరం దట్టమైన చెట్లు కనిపించేవి. అడవి లోపల మైదానంలా ఉండే ప్రాంతంలో మాత్రమే చెట్లు నరికి పోడు చేసుకునేవారు. ప్రస్తుతం సాగుకు అనువుగా లేని బండరాళ్లు ఉన్న ప్రాంతాలను సైతం వదలడం లేదు. ఇక్కడి అటవీ ప్రాంతంలో కలపకు ఉపయోగపడే చెట్లు తక్కువగా ఉన్నాయి. గిరిజన గూడేల్లో ఎవరి ఇంటి ముందు చూసినా నరికిన చెట్ల కర్రలను కుప్పగా పేర్చిన దృశ్యాలు కనిపిస్తాయి.
- రుద్రంగి మండలం మానాల శివారు నిజామాబాద్ జిల్లా దేవక్కపేట, భీంనగర్లో ఇటీవల వందల ఎకరాల్లో చెట్లను నరికివేశారు. ఆయా గ్రామాల శివారులో ఇప్పటికే అటవీ భూముల్లో పోడు సాగు చేస్తున్నారు. వీటికి సమీపంలోని అడవిలోని చెట్లను నరుక్కుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్లో ఒక్కొక్కరు సగటున 10-15 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
- మానాల సమీపంలోని తొమ్మిది గిరిజన గూడేల్లోని వారికి గతేడాది 1,700 ఎకరాల పోడు భూములకు పట్టాలను పంపిణీ చేశారు. పోడు పట్టాల పంపిణీలో స్థానికులే కమిటీ సభ్యులుగా ఉండటంతో అధికారులకు ఫిర్యాదు చేయొద్దన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం వారికి ఇచ్చిన పోడు పట్టాలకు సమీపంలో రెండింతలు అటవీ భూమిని చదును చేసుకుంటున్నారు.
- రుద్రంగి శివారులోని మల్లన్నస్వామి ఆలయ సమీపంలో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను నరికివేసి ట్రాక్టర్లతో చదును చేశారు. అలాగే సూరమ్మ ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గైరిగుట్ట, అడ్డబోరు తండాలకు చెందిన వారు 40 ఎకరాలను చదును చేశారు.
- జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం, కలికోట శివారులోని చెరువు సమీపంలో 60 ఎకరాలపైన, కొత్తపేట, తుర్తి శివారులో 30 ఎకరాల్లో చెట్లను నరికివేశారు.
- చందుర్తి మండలం సనుగులలోని పెసల్లబండలో గిరిజనేతరులు సుమారు 50 ఎకరాల వరకు చెట్లను నరికివేసి సాగుకు అనువుగా ట్రాక్టర్లతో చదును చేశారు. అలాగే తిమ్మాపూర్, రామన్నపేట, నర్సింగాపూర్ శివారులో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను తొలగించి అటవీ భూముల్లోకి వెళ్లి చదును చేస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
అధికారులపైనే నిఘా
అటవీ బీట్ అధికారుల కదలికలపై స్థానికుల నిఘా నిరంతరాయంగా ఉంటుంది. వారు తనిఖీలకు వస్తున్న విషయాన్ని అడవిలో ఉంటున్న వారికి సమాచారం చేరవేస్తారు. అధికారులు లోపలికి వెళ్లేలోపు అక్కడ ఎవరూ ఉండరు. వీరికి ప్రతి గ్రామంలో ఇన్ఫార్మర్ల వ్యవస్థ ఉంది. ఒకరిద్దరు అధికారులు తనిఖీలకు వెళ్తే తిరగబడతారు. ఇటీవల రుద్రంగి మండలం అడ్డబోరు తండాలో బీట్ అధికారి బాలకృష్ణపై రాళ్లతో దాడి చేశారు. కొత్తపేటలో మహిళా బీట్ అధికారిపైకి తల్వార్తో దాడి చేసేందుకు వచ్చినట్లు సమాచారం. అటవీ భూముల్లోకి చొరబడి అక్రమంగా సాగుచేస్తున్న వారి నుంచి కొందరు అధికారులు ఏటా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సాగు చేసుకునే విస్తీర్ణాన్ని బట్టి ముట్టజెబుతారని తెలుస్తోంది. అందుకే వారి పరిధి దాటి ఎంతమేరకు ఆక్రమణలకు పాల్పడినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
కేసులు నమోదు చేశాం
- గౌసొద్దీన్, అటవీ సెక్షన్ అధికారి
ఎన్నికల విధుల్లో ఉండగా చెట్లను నరికివేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఆ ప్రాంతాలను పరిశీలించి బాధ్యులపై కేసులు నమోదు చేశాం. దీంతోపాటు అటవీ భూమిలో చదును చేస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నాం. అటవీ ప్రాంతాల్లో చెట్ల నరికివేత, చొరబాట్లను కట్టడి చేసేందుకు రాత్రి సమయంలో బేస్క్యాంపులను ఏర్పాటు చేసి ప్రత్యేక వాహనం ద్వారా గస్తీ తిరుగుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనిపిస్తే కరుస్తున్నాయ్!
[ 20-05-2024]
జిల్లాలో వీధి కుక్కలు బెంబేలేత్తిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారిపై దాడికి పాల్పడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులుగా తిరుగుతూ బయట ఆడుకునే చిన్నారులతో పాటు వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. రాయికల్ పట్టణంలోని ఓ కాలనీలో ఒకే రోజు 11 మందిపై కుక్కలు దాడి చేశాయి. -
సా..గుతున్న అభివృద్ధి పనులు
[ 20-05-2024]
రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ను గత ప్రభుత్వం పురపాలక సంఘం హోదా కల్పించి అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లోంచి పెద్ద చెరువుపై మినీ ట్యాంక్బండ్, సమీపంలో ఉద్యానవనం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు కేటాయించింది. -
పాఠ్య పుస్తకాలు వస్తున్నాయ్!
[ 20-05-2024]
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతేడాది పంపిణీలో కొంత జాప్యం జరిగింది. -
పెరిగిన మామిడి దిగుబడి.. తగ్గిన ధర
[ 20-05-2024]
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి ధర తగ్గింది. ఏడాది పొడవునా కంటికి రెప్పలా చూసుకునే చెట్లు... సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కాతకు సైతం ధర పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. -
పేరుకే పెద్ద ఆసుపత్రి!
[ 20-05-2024]
వైద్య విధాన పరిషత్లో నడుస్తున్న కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి ఆరు నెలలైంది. ఇప్పటికీ బడ్జెట్ మంజూరు చేయకపోవడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
[ 20-05-2024]
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 20-05-2024]
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!
[ 20-05-2024]
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. -
మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట
[ 20-05-2024]
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. -
మహాలక్ష్ములతో ఆర్టీసీ కళకళ
[ 20-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం. -
కొత్త రేషన్ కార్డులపై ఆశలు
[ 20-05-2024]
‘రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. -
ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు
[ 20-05-2024]
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. -
అర్బన్ బ్యాంక్ ఎన్నికల సన్నాహక సమావేశం
[ 20-05-2024]
సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ బ్యాంక్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే
[ 20-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం