వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి
అనారోగ్యం అధిగమించలేక, ఆర్థిక కారణాలు తట్టుకోలేక మనస్తాపంతో జిల్లాకు చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపాయి.
అనారోగ్యం అధిగమించలేక, ఆర్థిక కారణాలు తట్టుకోలేక మనస్తాపంతో జిల్లాకు చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపాయి.
కడుపు నొప్పి తాళలేక యువకుడు..
ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే: కడుపునొప్పి తాళలేక ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్కు చెందిన యువకుడు చెన్నా కరుణాకర్(24) ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామీణ మండలం వెంకటగిరి క్రాస్రోడ్డు వద్ద కరుణాకర్ గాలిమిషన్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో కుటుంబ సభ్యులు తలుపులు తీయగా అప్పటికే కరుణాకర్ మృతి చెందాడు. కరుణాకర్కు ఆరు నెలల క్రితమే వివాహం అయింది. మృతుని తండ్రి వీరబాబు ఫిర్యాదు మేరకు మూడో పట్టణ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
క్యాన్సర్తో బాధపడుతూ వృద్ధురాలు..
ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఉమ్మినేని రామలక్ష్మి(72) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. ఖమ్మం కవిరాజనగర్లో నివాసం ఉండే ఉమ్మినేని రంగయ్య సతీమణి రామలక్ష్మి క్యాన్సర్ బారిన పడ్డారు. ఈమెకు విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈక్రమంలో ఆమె మానసికంగా బాధపడుతుండగా, భర్త రంగయ్య ధైర్యం చెబుతున్నారు. బుధవారం ఖమ్మం గ్రామీణం మండలంలోని మారెమ్మగుడికి వెళ్లి వస్తానంటూ ఇంట్లో నుంచి బయలుదేరిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. మారెమ్మగుడి వద్ద గుర్తుతెలియని పురుగులమందు తాగి పడిపోయి ఉండగా మధ్యాహ్నం సమయంలో 108 వాహన సిబ్బంది ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మనస్తాపంతో వివాహిత..
రఘునాథపాలెం, న్యూస్టుడే: మద్యానికి బానిసై మనస్తాపంతో పురుగుమందు తాగి చికిత్సపొందుతూ వివాహిత మృతి చెందిన సంఘటన రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవి కథనం ప్రకారం... గోగుల సత్యవతి(42) గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసైంది. ఈక్రమంలో మంగళవారం భర్త సహదేవ మందలించడంతో పొలానికి వెళ్లి గుర్తుతెలియని పురుగుమందు తాగి స్పృహతప్పి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఆమె కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ వివరించారు.
తన కార్యాలయంలోనే మిరప వ్యాపారి..
ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే: పురుగులమందు తాగి మిరప వ్యాపారి బలన్మరణానికి పాల్పడిన సంఘటన ఖమ్మం నగరంలోని జమలాపురం పార్కు ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్నగర్కు చెందిన ఏపూరి కృష్ణయ్య(55) గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో మిర్చి వ్యాపారం చేస్తున్నాడు. మూడో నగర ప్రాంతంలోని బోసుబొమ్మ సెంటర్లో దగ్గర జమలాపురం పార్కు సమీపంలోని తన కార్యాలయంలో పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనపై బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో పట్టణ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నట్టేట ముంచే నకిలీలలు
[ 21-05-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభంకానుంది. ఈ ఏడాది సాగుకు సానుకూల వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోయిన అన్నదాతలు ఈసారైనా కాలం కలిసొస్తుందన్న కోటి ఆశలతో ఉన్నారు. -
ఉప ఎన్నికల సమరం.. రసవత్తరం
[ 21-05-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు అధికారులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. -
మాతృక.. గిరిపుత్రులకు బాసట..!
[ 21-05-2024]
రెవెన్యూ భూములు కాకుండా.. అటవీశాఖకు సంబంధం లేని మాతృక భూములను భూమిలేని అత్యంత నిరుపేద గిరిజనులకు పంపిణీ చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. -
పాతాళానికి పరుగులు
[ 21-05-2024]
గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఇటీవల మండే ఎండలకు జిల్లాలో భూగర్భ జలం పాతాళానికి పరుగులు తీస్తోంది. చెరువులు, కుంటల్లో నీటి జాడ లేక పూర్తిగా ఎండిపోవడంతో జిల్లావ్యాప్తంగా భూగర్భ జలమట్టం పడిపోయింది. -
అర్హులందరికీ రేషన్ కార్డులు: పొంగులేటి
[ 21-05-2024]
రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, ఆరు గ్యారంటీల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దు: కేటీఆర్
[ 21-05-2024]
శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హస్తం పార్టీని నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. -
పదవికి వన్నె తెచ్చేందుకే పోటీ: తీన్మార్ మల్లన్న
[ 21-05-2024]
మాజీ మంత్రి కేటీఆర్ అమెరికా నుంచి కాదుగదా అంతరిక్షం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీకి తీసుకొచ్చినా గెలవలేరని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. -
పట్టభద్రుల సమస్యలపై నిలదీసేందుకు భాజపాకు మద్దతివ్వాలి: ఈటల
[ 21-05-2024]
ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై చట్టసభల్లో నిలదీసేందుకు భాజపా అభ్యర్థికి మద్దతు తెలపాలని ఆపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ కోరారు. -
పునాది దశ దాటని వంతెన
[ 21-05-2024]
అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగుపై వంతెన ఈఏడాది వర్షాకాలంలోనూ అందుబాటులోకి రాకపోవచ్చు. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా పునాది దశ దాటలేదు. -
ఆదివాసీ సంప్రదాయం ‘చల్ల’గుండాలి
[ 21-05-2024]
వేసవి వచ్చిందంటే ఆదివాసీల వద్ద ఆనప(సొరకాయ) బుర్ర ఉండాల్సిందే. ఇది వారికి కదిలే ఫ్రిజ్. గిరిజన ఆచార వ్యవహారాలపై మక్కువ ఉన్న భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ కొద్ది రోజుల నుంచి ఆనప బుర్రను ఉపయోగించి అందులో నీటినే తాగుతున్నారు. -
ఎర్ర చీమల గుడ్లూ.. ఆదివాసీల ఆహారమే..!
[ 21-05-2024]
తెలంగాణ-ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివాసీలు ఏప్రిల్ మాసం చివరిలో ఎర్ర చీమల గుడ్లతో కూర, పచ్చడి తయారు చేసుకుని తింటుంటారు. -
ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
[ 21-05-2024]
ప్రజా ఉద్యమాలతోనే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య అన్నారు. -
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు దరఖాస్తు చేసుకోండి
[ 21-05-2024]
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. -
హత్య కేసు నిందితుల అరెస్టు
[ 21-05-2024]
ఆస్తికోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితుణ్ని, అతని రెండో భార్యను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్