సగం మందీ గట్టెక్కలే!
జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 50 శాతం లోపు ఉండటం గమనార్హం. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో న్యాల్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫలితాలు నిరాశాజనకం
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 50 శాతం లోపు ఉండటం గమనార్హం. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో న్యాల్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10.32శాతమే పాసయ్యారు. హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ ఇదే తీరు. ఇక్కడ ఉత్తీర్ణత శాతం 15.96. కోహీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 277కు 86 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 11 కళాశాలల్లో ఉత్తీర్ణత 50శాతం లోపు ఉంది.
ఇదీ పరిస్థితి..: 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జిల్లాలో ఉన్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షకు 3,696 మంది హాజరుకాగా సగం మంది కూడా ఉత్తీర్ణత సాధించలేదు. 1,248 మంది విద్యార్థులు మాత్రమే గట్టెక్కారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన 2,867 మందిలో 1,373 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 45.41శాతమే ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. పరీక్షకు 218 మంది హాజరుకాగా 99 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 189 మందికి 113 మంది ఉత్తీర్ణత సాధించారు. సంగారెడ్డిలోని బాలికల జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత 60.75శాతం ఉండగా బాలుర కళాశాలలో ఇది 32.61 శాతమే.
ఇక్కడ ఆదర్శం: సమస్యలు తిష్ట వేసినా కొన్ని కళాశాలలు మెరుగైన ఉత్తీర్ణత శాతంతో ఆదర్శాన్ని చాటాయి. ప్రణాళికతో ముందుకు సాగడమే దీనికి కారణం. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక తరగతులు, వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఉత్తీర్ణత శాతం పెరిగింది. కల్హెర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 103 మందికి 90 మంది ఉత్తీర్ణత సాధించడం విశేషం. కంగ్టి కళాశాలలో 109 మందికి 90, హత్నూరలో 69కి 54 మంది గట్టెక్కారు.
మెరుగవ్వాలంటే..
* అధ్యాపకుల ఖాళీలను భర్తీచేయాలి.
* కళాశాలల్లో కనీస వసతులు కల్పించాలి.
* విద్యార్థులు చదువుపై దృష్టిసారించేందుకు వీలుగా ఆహ్లాదకర వాతావరణం ఉండాలి.
* కళాశాల నిర్వహణపై సరైన పర్యవేక్షణ ఉండటంలేదు. అధికారుల పర్యవేక్షణ పెరగాలి.
* విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక తరగతులతోపాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలి.
కారణాలు తెలుసుకుంటాం
-గోవిందరామ్, జిల్లా ఇంటర్ విద్యాధికారి
విద్యార్థుల ఉత్తీర్ణత తక్కువగా వచ్చిన కళాశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఉత్తీర్ణత తగ్గడానికి కారణాలు తెలుసుకుంటాం. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఫలితాల మెరుగుకు ప్రణాళికతో ముందుకు సాగుతాం. ప్రత్యేక తరగతులతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!